టీకాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది?

Publish Date:Feb 16, 2025

Advertisement

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది..? నేత‌లు వ‌ర్గాల వారిగా విడిపోయారా? త‌మ ఆధిప‌త్యం కోసం పార్టీకి, ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెస్తున్నారా? క్ర‌మంగా ప్ర‌భుత్వానికి ప్ర‌జా మ‌ద్ద‌తు త‌గ్గిపోతోందా? ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌థ్యంలో ఎన్నిక‌ల హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ అంత‌ర్గ‌త స‌ర్వేలో ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చిద‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌టంతో ప్ర‌భుత్వానికి చెడ్డ‌ పేరు వ‌స్తుంద‌న్న విష‌యాన్ని పార్టీ అధిష్ఠానం పెద్ద‌లు గుర్తించారని అంటున్నారు‌. ఈ క్ర‌మంలోనే పార్టీలోనూ, ప్ర‌భుత్వంలోనూ కీల‌క మార్పులు చేసేందుకు రాహుల్ గాంధీ టీం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే మొద‌టి వేటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దీపాదాస్ మున్షీపై ప‌డింద‌ని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఆమె స్థానంలో రాహుల్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌స్తురాలైన‌ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా రాహుల్ గాంధీ నియ‌మించారు.   దీపాదాస్ మున్షీని ప‌క్క‌కు త‌ప్పించ‌డం ప‌ట్ల కాంగ్రెస్‌లోని మెజార్టీ నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు‌. 


తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న వేళ‌.. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతున్న వేళ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పు రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. 

అయితే  పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీపాదాస్ మున్షీ ఫెయిల్‌ అయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని దీపాదాస్ మున్షీ ఏకపక్షంగా వ్యవహరించారని మెజార్టీ శాతం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారితో కూడా దీపాదాస్‌కు ఏ మాత్రం కోఆర్డినేషన్ లేదని కాంగ్రెస్ వ‌ర్గాల్లో టాక్ ఉంది. మ‌రోవైపు.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర‌ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ నిర్ణ‌యాల‌తో ప్ర‌మేయం లేకుండా ఆమె సొంత నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని.. పార్టీలోనే కాక ప్ర‌భుత్వంలోనూ ఆమె జోక్యం పెరిగింద‌న్న వాద‌న ఉంది. కొంత‌మంది అధికారుల‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకుని ప‌నులు చేయించుకున్నార‌న్న టాక్ ఉంది. అయితే గ‌తంలో ఈ విష‌యంపై మీడియా ప్ర‌శ్నించ‌గా రేవంత్ రెడ్డి, మ‌హేశ్ కుమార్ గౌడ్ లు అదేంలేద‌ని కొట్టిపారేశారు. కానీ, పార్టీలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు తోడు ప్ర‌భుత్వంలో జోక్యం పెర‌గ‌డంతో ఆమెపై రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పెద్ద‌ల‌కు రాష్ట్ర పార్టీ నేత‌లు ప‌లుసార్లు ఫిర్యాదులు సైతం చేశార‌ని తెలుస్తోంది.

ముఖ్యంగా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ నేత‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు రేవంత్ స‌ర్కార్ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తుంది. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సుతోపాటు రైతు రుణ‌మాఫీ, రైతు భ‌రోసా నిధులు విడుద‌ల, ఇంధిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఇంధిరమ్మ ఆత్మీయ భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు ఇలా అనేక ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తుంది. వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లడంలో కేత్ర‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు కాంగ్రెస్ నేత‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగాలేక‌పోయినా.. రైతు రుణ‌మాఫీని రేవంత్ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని అమ‌లు చేసింది. కానీ, చివ‌రికి ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. రుణ‌మాఫీ అమ‌లును ప్ర‌జ‌ల్లోకి పార్టీ నేత‌లు బ‌లంగా తీసుకెళ్ల‌క‌పోవ‌ట‌మే. ఈ విష‌యంలో పార్టీని, ప్ర‌భుత్వాన్ని స‌మ‌న్వ‌య ప‌ర్చ‌డంలో దీపాదాస్ మున్షీ విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న బ‌లంగా ఉంది. దీనికితోడు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆమెకు మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌న్న చ‌ర్చ‌కూడా కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఉంది. దీంతో రాహుల్ గాంధీ టీం రంగంలోకిదిగి ఆమెను రాష్ట్ర పార్టీ ఇంచార్జి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించార‌ని స‌మాచారం. కొత్త ఇన్‌ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మున్షీ స్థానంలో ఆమె ఫుల్ టైం కార్యకలాపాలు కొనసాగించనున్నారు. 

రాహుల్‌గాంధీ టీమ్‌లో కీ పర్సన్‌గా మీనాక్షికి పేరుంది. అయితే, ఆమె ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నేత‌ల్లో ఐక్య‌త కోసం ఆమె ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంది. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం పెంచి ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు గ్రామ స్థాయి నుంచి విస్తృత ప్ర‌చారం పొందేలా మీనాక్షి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి గ్రామ స్థాయిలో ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వంపై నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను తొల‌గించి, కాంగ్రెస్ ప్ర‌భుత్వం అద్భుత పాల‌న అందిస్తున్నద‌న్న భావన ప్రజలలో కలిగేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవ‌న్నీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే.. పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తో పాటు.. పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొన‌సాగేలా చేయాలి. ఆమేర‌కు మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఏ మేర‌కు విజ‌య‌వంతం అవుతార‌న్న అంశం కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేపుతుంది.

అయితే, మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాహుల్ గాంధీకి విశ్వాసపాత్రురాలు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె రాహుల్ కు న‌మ్మిన బంటు. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేత‌లు ఏ మాత్రం త‌ప్పుచేసినా నేరుగా రాహుల్ వ‌ద్ద‌కు ఫిర్యాదులు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ నేత‌లు సైతం వ‌ర్గాలుగా విడిపోకుండా ఐక్య‌తారాగంతో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారిస్తూ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్తార‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.