ఈటలతో అమిత్ షా భేటీ అందుకేనా?

Publish Date:Jun 20, 2022

Advertisement

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో సందేహం లేదు. బీజేపీ, ముఖ్యమంత్రి కేసీఆర్’తో లోపాయికారి ఒప్పందం  కుదుర్చుకుని, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేప్రయత్నం చేస్తోందని, కొంత ప్రచారం జరిగినా, మెల్ల మెల్లగా సీన్ మారి పోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని   నిర్ణయించడంతో, బెంగాల్  తరహాలోనే  బీజేపీ  తెలంగాణ పై దృష్టిని కేంద్రీకరించిందనే విషయం స్పష్టమైంది. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే, గుజరాత్ వంటి రాష్ట్రాల కంటే, ఎన్నికలకు సంవత్సరం పైగా సమయమున్న తెలంగాణ పై, బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర కీలక నేతలు  రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసు కుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరో వంక తెర వెనక నుంచి చక్రం తిప్పే సంఘ్ పరివార్ నేతలు రాష్ట్రంలో తిష్టవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సంఘ్ పెద్దలకు, పార్టీఅధిష్టానానికి అందచేస్తున్నారని, తదనుగుణంగా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, పార్టీ వర్గాల సమాచారం.  ఇందులో భాగంగానే, ఇప్పుడు, మరో పది రోజుల్లో, హైదరాబాద్’లో పార్టీ జాతీయ కార్యవర్గ  సమావేశాలు జరుగతున్న సమయంలో, మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు  కేంద్ర హోం మంత్రి  అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. ఆ  పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి  అమిత్ షాను కలిసారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామం ఇటు   రాజకీయవర్గాల్లో అటు పార్టీ వర్గాలో చర్చనీయాంశమైంది.  ఈటలను హుటాహుటిన ఢిల్లీకి ఎందుకు పిలిచారు? ఆయనకు కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈటలకు ప్రత్యేక పీఠం వేసేందుకే, అమిత్ షా ఆయన్ని ఢిల్లీ పిలిపించి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో ఆయనకు చెక్ పెట్టేందుకు, ఈటలకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తారా? లేక రాష్ట్రంలో పాగా వేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగిస్తారా, అనే విషయంలో విభిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. గత కొంత కాలంగా ఓ వంక  ఈటల కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది,  మరో వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మరుస్తారనే ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. అయితే, బండి సంజయ పాద యత్ర ముగుంపు సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా, స్వయంగా బహిరంగ వేదిక నుంచి బండి సంజయ్ ని ప్రశంసలతో ముంచెత్తి, ‘మార్పు’  ప్రచారానికి తెర దించారు.  ఏ  నేపధ్యంలో ఈటలకు ఏ పదవి ఇస్తారు? ఏ బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి సమన హోదా కల్పిస్తూ పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంటి పదవి కట్టబెట్టబోతున్నారా? అన్నది చర్చనీయాంశమైంది.

అయితే పదవి ఏదైనా, బీజేపీలో బయట నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం లభించదు అన్న అపవాదును తొలిగించే విధంగా ఈటల సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు, తెలుగు వన్  కు చెప్పారు. తెరాస సహా ఇతర పార్టీలలోని కీలక నేతలు కొందరు, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా, ఒకసారి చేరిన తర్వాత, పార్టీలో తమ స్థానం ఏమిటి? అనే ప్రశ్న దగర ఆగిపోతున్నారు, అందుకే, పార్టీ అధినాయకత్వం ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించాలానే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. 

ఇందుకోసంగానే. డాక్టర్ కే.లక్ష్మణ సహా పార్టీ పాత కాపులకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈటలకు రాష్ట్ర స్థాయిలోనే కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.అయితే, బీజేపీ నాయకత్వం చివరకు ఎలాంటి  నిర్ణయం తీసుకుంటుంది, అనే దాని పైనే, ఈటల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.