సర్వేల వెనుక చీకటి కోణాలు! ఆరా సర్వే అసలు కథేంటి?

Publish Date:Jul 15, 2022

Advertisement

తెలంగాణలో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తోందా? ఎన్నికల వ్యూహ కర్తల హవా  నడుస్తోందా? రాష్ట్రంలో సర్వే జనులు, ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరుగుతోందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, అదే సమయంలో, ప్రతి సర్వే వెనక ఒక చీకటి కోణం దాగుందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

గత మూడు నాలుగు రోజులగా ఆరా మస్తాన్ సర్వే చుట్టూ సాగుతున్న చర్చ రచ్చ వివాదం వెనక కూడా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల చీకటి కోణం దాగుందని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెసుస్తోంది.   కొద్దిరోజుల క్రితం టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ హైర్ చేసుకున్నఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, ఆరా మస్తాన్ వరకు అందరు చేసిన సర్వేలలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్’లో ఉందని, చెప్పు కొచ్చారు. అయితే, సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ అందరి సర్వే నివేదికలు, తనకు ఎక్కడి  నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మాత్రం చెప్పలేదు.

అయితే,రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమ అభద్రతా భావాన్ని, భయాన్ని  కప్పిపుచ్చుకునేందుకు  సర్వేలను అడ్డుపెట్టుకుని గంభీర ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడప్పుదు ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏదో గాలి కబురుగా కాకుండా, సర్వే సంస్థలు, సర్వే సంస్థల యజమానుల పేర్లు కూడా  తీసుకున్నారు.  ఆ నివేదికలు అన్నీ, తన కళ్ళతో తాను చూసినట్లే చెప్పుకొచ్చారు. ఒక విధంగా,  విత్ అల్ డ్యూ రేస్పెక్ట్స్ టూ కేఏ పాల్ , అయన స్టైల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసిందని, తాను ముఖ్యమంత్రి అయిపోయాననే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. బహుశా, ఆ సంస్థలేవీ తమను పట్టించుకోవని అనుకున్నారో  ఏమో కానీ, సర్వే సంస్థల పేర్లు చెప్పి మరీ జబ్బలు చరుచు కున్నారు.  అయితే, కాంగ్రెస్ ‘బలుపు’కు రేవంత్ ఆధారంగా చూపిన ఆరా మస్తాన్’ రేవంత్ రెడ్డి తమ  సంస్థ పేరు తీసుకునందున, వివరణ ఇచ్చేదుకు స్వయంగా  తెరమీదకు వచ్చారు.

ఆయన, తమ సంస్థ జరిపిన సర్వేకి సంబంధించి రేవంత్ చెప్పింది తప్పని చెప్పారు. ఆయన వెర్షన్ అయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో కాదు థర్డ్ పొజిషన్  లో ఉందని తమ సర్వే నివేదికను బయట పెట్టారు. అక్కడితో అగ్గి రాసుకుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చేయని చౌకీదార్ చోర్  వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం చేసి, చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు, ఆరా మస్తాన్ కోర్టుకు వెళితే రేవంత్  రెడ్డి కూడా క్షమాపణలు చెప్పవలసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు.   అప్పుడు గానీ, రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేశారో ఆయనకు, కాంగ్రెస్ పార్టీలో ని ఆయన వర్గానికి తెలిసినట్లు లేదు. అయితే, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభించింది.

రేవంత్ రెడ్డి తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశారని లోపాయికారిగా దెప్పిపొడవడం  ప్రారంభించారు. అసత్యాలు, అర్థ సత్యాలు  చెప్పి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని కాంగ్రెస్  సీనియర్లు  ఢిల్లీకి  వర్తమానం చేర వేశారు. అదే సమయంలో, రేవంత్ వర్గం డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, ఆరా మస్తాన్ పుట్టు పూర్వోత్తరాలు, బయటకు తీసి ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. ఆయన భావజలాం లోతులు తవ్వి ఆయన సంఘీయుడు అని తేల్చారు. కావచ్చును, అయనకు బీజేపీతో సంబంధాలు ఉన్న మాట నిజం కావచ్చును. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో సంబంధాలు ఉంటే ఉండ వచ్చును, ఆమాటకొస్తే, రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలను తవ్వి తీసినా ఆయన కూడా  సంఘీయుడే.

ఏబీవీపీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని అంటారు.  అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు, ఎందుకోసమో, ఎందు కోసమో ఏముంది లెండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సొంతగా జరిపించిన సీక్రెట్ సర్వే లో కాంగ్రెస్ పరిస్థ్తితి ఏమంత బాగలేదని తేలిందని, ఢిల్లీకి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ గా కొనసాగితే, పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్ధులు బరిలో దిగే ప్రమాదముందని, ఆయన తమ వర్గం వారికే టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని, అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సీనియర్లు నేరుగా అధిష్టానానికి నివేదికలు సంర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి  సర్వే నివేదికలను అడ్డు పెట్టునికి తనను తానూ రక్షించుకునే ప్రయత్నం చేశారని,  విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎవరి వ్యుహమో, ఎవరితో ఎవరి చీకటి ఒప్పందమో ఏమో కానీ, ఆరా మస్తాన్ తెర మీదకు రావడంతో రేవంత్ కథ అడ్డం తిరిగిందని, అంటున్నారు.

By
en-us Political News

  
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.