అవినాష్ తల్లి హెల్త్ బులిటెన్లో ఏముంది? ఏం జరుగుతుంది?

Publish Date:May 22, 2023

Advertisement

అవినాష్ రెడ్డి సీబీఐకి చుక్కులు చూపిస్తున్నారు. దేశంలో సర్వోన్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అవినాష్ ముందు చిట్టులుకలా మారిపోతోంది. విచారణకు డుమ్మా కొట్టినా, పదే పదే ఏవో సాకులు చెప్పి గైర్హాజరైనా చర్యలు తీసుకునే చొరవ చేయలేకపోతోంది. సీబీఐ తీరు చూస్తుంటే.. ఆసలది దర్యాప్తు సంస్థఏనా? అన్న అనుమానం సామాన్యులకు సైతం కలిగేలా ఉంది. అటువంటి సీబీఐ ఎట్టకేలకు ధైర్యం చేసి కర్నూలు చేరుకుని అక్కడి ఎస్పీకి తాము అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చారు. లొంగిపొమ్మనండి లేదా అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

అయినా కర్నూలులో పోలీసుల సహకారం కరవైందా?  లేక సీబీఐకే ధైర్యం తక్కువైందా తెలియదు కానీ ఈ తెల్లవారు జామునుంచీ ఆస్పత్రి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఇహనో ఇప్పుడో సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయనున్నారని అంతా భావిస్తున్న వేళ ఇప్పటి వరకూ హెల్త్ బులిటిన్  విడుదల చేయడం సాధ్యం కాదు అంటూ చెబుతూ వచ్చిన కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వర్గాలు అవినాష్ తల్లి హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆ బులిటిన్ లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని పేర్కొన్నారు.  ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, ఏమీ తినలేకపోతున్నారని చెప్పారు. వాంతులు అవుతున్నాయని తెలిపారు. లోబీపీ ఉందని వెల్లడించారు.

ఆమె మెదడుకు, పొత్తికడుపుకు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండు రోజులుగా విడుదల కాని హెల్త్ బులిటెన్ ఇప్పుడే విడుదల కావడంపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఆసుపత్రి అవినాష్ స్నేహితుడికి చెందినది కావడం, పులివెందులకు దగ్గరగా ఉన్న బెంగళూరును కాదని, అలాగే అత్యాధునిక వైద్య సౌకర్యాలు లభ్యమయ్యే హైదరాబాద్ నూ కాదని కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలోనే అవినాష్ తన తల్లిని చేర్చించడంపై నాలుగు రోజుల కిందటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్ లలో కంటే కర్నూలులో మెరుగైన వైద్యం లభిస్తుందని కాకుండా సీబీఐ నుంచి తనకు ర క్షణ ఏపీలో అయితేనే ఎక్కవ అన్న భావన ఆయనలో ఉందని కూడా పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందని అంతా భావిస్తున్న వేళ.. అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల కావడం అనుమానాలకు తావిస్తున్నది.  

నిజంగానే అవినాష్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించి తీరాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. అయితే ఇప్పుడు విషయం అది కాదు.. అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపైనే అనుమానాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ విషయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ఆ సంస్థ నోటీసులను ధిక్కరించిన తీరు కారణంగానే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏం చేసినా, ఏం మాట్లాడినా అనుమానించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది పూర్తిగా  ఆయన స్వయం కృతం. విశ్వభారతి ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ అవినాష్ ను అరెస్టు నుంచి కాపాడటానికా అన్న అనుమానాలు వ్యక్తం కావడానికి కూడా అవినాష్ సీబీఐ విచారణను తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సోమవారం (మే 22) ఉదయం నుంచీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద జరిగిన, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే.. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తం కాకమానవు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఉందా? ఉంటే స్వతంత్రంగా పని చేస్తోందా అన్న అనుమానాలూ వ్యక్తం కాక మానవు. కర్నూలులో అవినాష్ రెడ్డి ఉన్న విశ్వ భారతి ఆసుపత్రి మొత్తం వైసీపీ, అవినాష్ అనుచరుల  అధీనంలోనే ఉందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీబీఐ వాహనాలు ఆ ఆసుపత్రి ఆవరణలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టించిన అవినాష్ రెడ్డి అనుచరులు ఆ తరువాత ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పోలీసులు వారిని అక్కడ నుంచి తొలగించడానికి నానా అగచాట్లూ పడ్డుతున్నారు. వారిని బ్రతిమలాడుకుంటున్నారు. అంతకు మందు ఆదివారం రాత్రి విశ్వభారతి ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో అవినాష్ అనుచరులు సృష్టించిన వీరంగాన్ని పోలీసలు ప్రేక్షకుల్లా తిలకించారు. వైసీపీ ఎమ్మెల్యే తరువాత తీరిగ్గా రంగప్రవేశం చేసి పొరపాటు జరిగింది, క్షమించండి అంటూ విలేకరులకు చెప్పారు.

అనినాష్ అనుచరుల స్వైర విహారంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా విలేకరులకు అవకాశం లేకుండా అవినాష్ అనుచరులు వారికి వెంబడించారంటే పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు.  నిన్న అర్ధరాత్రి నుంచీ కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద  పదుల సంఖ్యలో ఉన్న అవినాష్ అనుచరుల వీరంగం సృష్టిస్తే.. మీడియా ప్రతినిథులపై దాడులు చేస్తే.. ఇప్పటి వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు.  సీబీఐ అధికారులను ఆసుపత్రి వద్ద అడ్డుకుంటుంటే ఆపడానికి పోలీసులకు అడుగు ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, లేదా అన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.