ఏమి చెబుతున్నాయి హక్కులు??

Publish Date:Dec 11, 2021

Advertisement

 Human rights. ప్రస్తుత ప్రపంచంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో చిన్న నుండి పెద్ద వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇంట్లో మనుషుల నుండి సమాజంలో కూటములైన సంఘాలు, సంస్థలు వాటిలో పనిచేసే వారి వరకు. ఇలా సకల ప్రజానీకం ఎక్కువగా మాట్లాడే పదం, ఉపయోగించే పదం "హక్కు"

మనిషికి తన జీవితంలో కొన్ని స్వేచ్చలు ఉన్నాయి వాటిని పొందడానికి, ఆ స్వేచ్ఛకు తగ్గట్టు బతకడానికి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేపట్టి ఆమోదించినవే మానవ హక్కులు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులను పొందే సౌలభ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులు ఏమిటి?? మనం డిమాండ్ చేస్తున్నది ఏమిటి?? వీటిని గూర్చి ఆలోచిస్తే 

జాతి, మత, లింగ, కుల, వర్ణ, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కానీ మన సమాజంలో ప్రతి మనిషితో మాట్లాడే ముందు కచ్చితంగా కులం, మతం చూసుకుంటూ ఉంటారు. వీటి ప్రస్తావన లేకుండా వాటి గురించి అసలు ఆలోచించకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువని చెప్పవచ్చు. పరోక్షంగా ఎందరో చర్యల ద్వారా ఈ రకమైన వివక్షకు గురవుతూనే ఉంటారు. ఇక ఈ సమాజంలో ప్రస్తుతం  ఉన్న అతి పెద్ద సమస్య రాజకీయ కారణాలు. చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నా సాధారణ పౌరులు ఈ రాజకీయ వర్గాలు మధ్య నలిగిపోతూ ఉంటారు. 

చిత్రహింసలు మరియు క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రహింసలు మరియు క్రూరత్వానికి బలి అవుతున్న వాళ్లలో ఆడవాళ్లు అధికశాతం మంది, తరువాత పిల్లలు, వృద్ధులు ఉన్నారు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా వీఎటి బారిన పడుతున్నారు. చేదైన నిజం ఏమిటంటే చిత్రహింసలు, క్రూరత్వం కుటుంబ సభ్యులనుండే ఇవన్నీ ఎదురవ్వడం. వ్యక్తిగత దాడులు, ఆర్థికపరమైన కారణాలు, కక్షలు, కుట్రలు వంటి వాటిలో బాగా తెలిసినవారి నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పై సమస్యలు ఎదుర్కొంటారు.

వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. బానిసత్వం మన భారతదేశంలో వేళ్లూనుకుపోయింది. ఎంతగా అంటే పక్క దేశాలు చెప్పినదానికి తలలు  ఊపుతూ వాగ్దానాలు చేసి దేశంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకునే స్థాయిలో. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎన్నో ఒప్పందాలు, వాటి రహస్యాలు సామాన్య ప్రజలకె కాదు ధనికులకు కూడా తెలియదు సరిగ్గా.  ఒక కుటుంబంలో ఆడపిల్లను ఎలాగైతే బాధ్యత, పరువు అనే పేరు కింద స్వేచ్ఛను తుంచి బానిసగా ఉంచుతారో అలాంటివి సమాజంలో, జీతీయం, అంతర్జాతీయ స్థాయిలలో కూడా జరుగుతుంటాయి. ఆర్థిక, విద్య, వైద్య రంగాలలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. 

నిర్బంధించబడకుండా ఉండే హక్కు మానవ హక్కుగా పేర్కొన్నారు. నిర్బంధం అంటే కట్టడి చేయడం. సరైన కారణం లేకుండా ఒక మనిషి స్వేచ్ఛను హరించడం, ఆ మనిషిని అన్ని రకాలుగా అన్నిటికీ దూరం చేయడం. ఆంక్షలు విధించడం, ఇష్టాలకు గౌరవం ఇవ్వకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ రకమైన నిర్బంధం ఆడవాళ్ళ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ చాలా జరుగుతున్నాయి. 

పక్షపాతం లేకుండా ఉండటం. అనేది మానవ హక్కు కానీ ఇంటా బయట ఈ పక్షపాత ధోరణి పుష్కలంగా కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్లలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే అక్కడ పక్షపాత ధోరణి కచ్చితంగా ఉంటుంది. లింగవివక్షలో మెండుగా ఉండే ఈ పక్షపాతం వల్ల ఎంతో నష్టపోతారు. ఇషి మాత్రమే కాకుండా పేద,  ధనిక వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇలా అన్ని వర్గాలలో పక్షపాతం ఉంటుంది.

పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు, ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి.

అయితే హక్కుల పేరుతో వీటిని ఎందసరో దుర్వినియోగం చేస్తున్నారు కూడ. ముఖ్యంగా యువత స్వేచ్ఛ అనే హక్కును, జీవించే హక్కును కాస్త అడ్డదారిలో వెల్తూ అది నా హక్కు అని, స్వేచ్ఛగా ఉండటంలో తప్పులేదని అతిగా వాదిస్తుంది.  

హక్కుల ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని సరైన దిశలో అనుసరిస్తే అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది.

 

◆ వెంకటేష్ పువ్వాడ

 

By
en-us Political News

  
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది.
మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అయ్యాయని ఒకప్పుడు చెప్పుకునేవాళ్లం.
విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు.
ఈ ప్రపంచంలో భార్యభర్తల బంధం చాలా గొప్పది.
పిల్లలు ఎదిగే కొద్దీ తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అణుగుణంగా తామూ కనెక్ట్ అవుతారు.
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా..
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది.
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అదొక సందడి అంటారంతా..
స్మార్ట్‌ఫోన్‌లు,  ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు  జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది.
పెళ్లి తర్వాత హనీమూన్ అనేది కొత్త జంటలకు అత్యంత ప్రత్యేకమైన క్షణం. ఈ సమయంలో కుటుంబం, బంధువులకు దూరంగా.. కొత్త జంట ఒకరినొకరు తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవడానికి, ఇద్దరూ కలిసి సంతోషంగా గడపడానికి వారికి మాత్రమే కేటాయించిన సమయం పొందుతారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.