ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తాం: రాజాసింగ్ 

Publish Date:Apr 1, 2025

Advertisement

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి అంశం  గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన  సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే మహరాష్ట్ర హిందువులకు తెలంగాణ హిందువులు మద్దత్తు గా నిలుస్తారని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యాక ఔరంగజేబు, బాబర్  వారసులు ఆందోళనకు గురయ్యారన్నారు. భారత్ ను హిందూ దేశంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించాలని రాజాసింగ్ అభిలషించారు. గతేడాది  ధూల్ పేట నుంచి  శ్రీరామనవమి శోభాయాత్రను ఎంఐఎం అడ్డుకుందని  ఈ యేడు  ఎవరి అనుమతులు, ఆదేశాలు లేకుండానే శ్రీరామనవమి శోభాయాత్రను నిర్వహిస్తామని రాజాసింగ్ చెప్పారు. 

ఔరంగ జేబు ఆఖరి మొఘల్ చక్రవర్తి.   ఆరో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు ఉన్న చక్రవర్తులు మతసామరస్యానికి పెద్ద పీట వేస్తే ఔరంగజేబు మాత్రం హిందువులపై జిజియా పన్ను వసూలు చేసిన  చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నాడు.  ముస్లింల నుంచి జకాత్ పన్ను, హిందువులనుంచి జిజియా పన్ను వసూలు చేసేవాడని అంటారు. మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ  ఇస్లాం ను అనుసరిస్తూ టోపీలు కుట్టి జీవనం సాగించేవాడు. హైద్రాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మహరాష్ట్రలో ఉన్న ఔరంగ జేబు సమాధిని  ఔరంగాబాద్ లో సందర్శించడంతో భారతీయ జనతాపార్టీ నేతలతో బాటు హిందుత్వ వాదులు తీవ్రంగా ప్రతిఘటించారు.  రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలకు   ఔరంగ జేబు సమాధి కేంద్రబిందువయ్యింది. 

మొఘల్ చక్రవర్తుల సమాధులకు ఔరంగ జేబు సమాధి భిన్నంగా ఉంటుంది. కేవలం మట్టితో కప్పిన ఈ సమాధి  అతి నిరాడంబరంగా ఉంటుంది.  సమాధిని పరిరక్షించే బాధ్యత షేక్ షుకుర్ పూర్వికులు తీసుకున్నారు. షేక్ షుకుర్ ఆరోతరానికి చెందిన వారు. సమాధి మీద  వనమూలికలను  మాత్రమే పెంచుతున్నారు.  ఔరంగ జేబు సమాధిని చూడటానికి ప్రపంచనలుమూలలనుంచి పర్యాటకులు ప్రతి నిత్యం వస్తుంటారు. చత్రపతి శంభాజీ మహరాజ్ ను 45 రోజుల పాటు హింసించి చంపేసినట్టు విహెచ్ పి, భజరంగ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  ఔరంగజేబు మతగురువు షేక్ జైనుద్దీన్ సమాధి పక్కనే ఈ సమాధిని నిర్మించారు. 


 

By
en-us Political News

  
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. చిన్న కొడుకు మార్క్ శంకర్ తాను చదువుతున్నపాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డారు. కాళ్లు, చేతులకు కాలిన గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవస్థ జగన్ కోసం జగన్ చేత జగనే సృష్టించుకున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థను జగన్ గాలి కొదిలేశారు. తన కోసం పని చేయడం తప్ప వలంటీర్లకు ఉద్యోగ భద్రత అన్నది లేకుండా చేశారు. వైసీపీ హయాంలో అమలులోకి వచ్చిన ఈ వలంటీర్ల వ్యవస్థ గ్రామాలు, పట్టణాల్లో సంక్షేమ పథకాల అమలులో జగన్ హయాంలో కీలక భూమిక పోషించింది.
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీల చీఫ్​ దాది రతన్ మోహిని ఇక లేరు. ఆమె వయస్సు వంద సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు.
చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో  మావోయిస్టులకు  కోలుకోలేని దెబ్బ తగిలింది.  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తాజాగా  మావోయిస్టులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను ఇన్ ఫార్మర్లుగా చేసుకుని ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రప్రభుత్వం జల్లెడపడుతుంది.
ఎపి రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత ఇల్లు శంఖు స్థాపన కార్యక్రమం  మంగళవారం (ఏప్రిల్ 9) జరుగనుంది. గత ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనివంశీకి మరో మారు షాక్ తగిలింది. కస్టడీ ముగియడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యేను  ప్రత్యేక న్యాయస్థానం ఎస్ సి ఎస్ టి కోర్టులో హాజరుపరిచారు.
త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరుపుకోబోతున్నారు. జరగబోయే మహనాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలతాయో..? ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో..? ఆ తర్వాత పరిణామాలు ఎలా దారి తీస్తాయోననే అంశంపై టీడీపీ సానుభూతిపరుల్లో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది.
ప్రియుడి మోజులో పడి  మీరట్ యువతి  ముస్కాన్ తన భర్తను హత్య చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ గర్బవతి అని నిర్దారణ అయ్యింది.
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతించారు. మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ హైకోర్టు పేర్కనడాన్ని ఆయన హర్షించారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాపిరెడ్డి పల్లిలలో మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం (ఏప్రిల్ 8) జరిపిన పర్యటన పెద్ద ప్రహసనంగా మారింది. ఇటీవల హత్యకు గురైన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జగన్, హెలికాప్టర్ లో వచ్చి, కారులో తిరిగి బెంగళూరు వెళ్లారు.
అలేఖ్య పికిల్స్ వివాదం గత నాలుగోజులుగా నలుగుతూనే ఉంది. అలేఖ్య బూతుపురాణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. అదే సమయంలో ముగ్గురు అక్కా చెల్లెల్లు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా ఈ ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ హౌరా జంక్షన్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తృటిలొ పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. అది కూడా సరిగ్గా మధ్యలో అంటే రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.