Publish Date:May 31, 2023
పాతబస్తీ వోటర్లు విభిన్న శైలి. ఇక్కడి ముస్లింలు వోటు వేసేది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేసేది మాత్రం బిఆర్ఎస్ కు. పాతబస్తీలో ఈ రెండు పార్టీలు తప్పితే మరే ఇతర పార్టీలు పాతబస్తీలో కనీసం కాలు పెట్టజాలవు. ఇది బిజెపికి మింగుడుపడడం లేదు. మజ్లిస్ టార్గెట్ గా బిజెపి ఇవ్వాళ ఆరోపణలు చేసింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. దారుస్సలాంలో కూర్చొని మాట్లాడడం కాదు.. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్రమంతటా పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ను సంకలేసుకొని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కలా పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దామని కౌంటర్ వేశారు బండి. ప్రస్తుతం బిఆర్ఎస్ మిత్ర పక్షాలలో మజ్లిస్ పార్టీకి తప్పితే మరో పార్టీకి స్థానం లేదు. బిఆర్ఎస్ కంటే ముందు మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. బిజెపితో ఉన్న శత్రుత్వంతో మజ్లిస్ అప్పట్లో కాంగ్రెస్ తో జత కట్టింది. కాంగ్రెస్ మాత్రమే సెక్యులర్ పార్టీ అని ఓవైసీ కితాబిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ హాయం నుంచి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూలి పోయింది. బిజెపి, సంఘ్ పరివార్ ను దూషించిన మజ్లిస్ కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో దోషిగా నిలబెట్టలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మజ్లిస్ పార్టీకి ఊపిరిపోశారు. మజ్లిస్ కోరిక మేరకు పాతబస్తీలో పునర్ విభజన చేపట్టారు. ఈ పునర్ విభజనతో పాత బస్తీలో మెజారిటీ సీట్లు మజ్లిస్ దక్కించుకుంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. అదే సాంప్రదాయాన్ని బిఆర్ఎస్ కొనసాగిస్తుంది. పాత బస్తీలో మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు బలమైన వారు లేకపోవడంతో బిఆర్ఎస్ అధికారంలో వచ్చిన రెండు పర్యాయాలు మజ్లిస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. షాదీ ముబారక్ వంటి స్కీంతో పేద ముస్లి అమ్మాయిలు లక్షలాది మందికి పెళ్ళిళ్లు జరుగుతున్నాయని గాజిబండకు చెందిన హజ్మత్ భాయ్ అంటున్నారు. బిఆర్ఎస్ ను పాతబస్తీ వాసులు ఓన్ చేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/we-are-support-brs-onlly--39-156133.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.