వ్యాయామం మీద అతి పెద్ద పరిశోధన

Publish Date:Nov 24, 2020

Advertisement

ఆరోగ్యానికి నడక ఎంత అవసరమో కొత్తగా చెప్పేదేమీ లేదు. జాగింగ్‌ చేయడం, సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం... ఇవన్నీ కూడా మంచి ఫలితాలని ఇచ్చే వ్యాయామాలే అయినప్పటికీ... సులువుగా సహజంగా చేసే నడకే మన ఆరోగ్యాలను కాపాడుతూ వస్తోంది. కానీ ఈ నడక ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి అన్నదాని మీద ఇప్పటివరకూ ఎవరూ సరైన జవాబు చెప్పలేకపోతున్నారు.

రోజుకి 10,000 అడుగులు నడిస్తే మంచిదన్న మాట ఉన్నప్పటికీ... అదేమీ అంత శాస్త్రీయం కాదని కొట్టి పారేస్తున్నారు నిపుణులు. ఈ 10,000 అడుగులు అన్నమాట జపాన్‌లోకి ఒక వాణిజ్య సంస్థ మొదలుపెట్టిన ప్రచారం అని గుర్తుచేస్తున్నారు. మరికొందరేమో వారానికి ఓ రెండు రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందిలే... మిగతా రోజుల్లో ఆఫీసుకి పోవాలి కదా! అంటున్నారు. మరి నడకకు సంబంధించి లోగుట్టును రట్టు చేసేదెలా!

 

 

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన ‘అలెన్‌ యూంగ్‌’ అనే కార్డియాలజిస్టుకి ఇదే అనుమానం వచ్చింది. వేలమంది జనాల రోజువారీ కదలికలను క్షుణ్నంగా పరిశీలిస్తే కనుక.... వారి జీవిత విధానం, అందులో భాగంగా వారు ఎంతసేపు నడుస్తున్నారు, ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు తెలిసిపోతుంది. వ్యాయామం చేయడం వల్ల వాళ్ల ఆరోగ్యం ఏమన్నా మెరుగుపడిందా! అన్న విషయమూ బయటపడుతుంది. కానీ ఇందుకోసం వేలమంది జీవితాలను దగ్గరగా పరిశీలించడం ఎలా సాధ్యం?

 

 

తన పరిశోధనను ఎలా ముందుకు తీసుకుపోవాలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటున్న అలెన్‌కు హఠాత్తుగా ఓ ఉపాయం తోచింది. అప్పటికే యాపిల్‌ సంస్థ విడుదల చేసిన ఒక యాప్‌ గుర్తుకువచ్చింది. మన శరీర కదలికలు ఎలా ఉన్నాయి? మనం ఎంత దూరం నడుస్తున్నాం? అని పసిగట్టగలిగే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమంటూ ఒక పిలుపుని ఇచ్చారు. అలెన్‌. అలెన్ పిలుపునిచ్చిన తొలివారంలోనే దాదాపు 53,000 మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రస్తుతానికి లక్షమంది ఈ యాప్‌ ద్వారా అలెన్‌కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అలెన్‌కు అందిస్తున్నారు. అందుకే వ్యాయామానికి సంబంధించి అతి పెద్ద పరిశోధనగా ఇది పేరుగాంచింది.

 

 

అలెన్‌ మొదలుపెట్టిన ఈ పరిశోధన ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందేందుకు కొంత కాలం పట్టక తప్పదు. లక్షమందికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించాలంటే అంత తేలికైన విషయం కాదు కదా! కానీ ఈపాటికే ఈ గణాంకాలు కాస్త భయపెట్టేవిగా ఉంటున్నాయట. మనలో చాలామంది అసలు కదలనే కదలడం లేదంటూ ఈ యాప్ ద్వారా తేలుతోందట.

‘అందులో ఆశ్చర్యం ఏముంది? మన సమయాన్ని పూర్తిగా కూర్చునే గడిపేస్తున్నాం. అటూఇటూ వెళ్లడం మాట అటుంచి, కనీసం లేచి నిలబడేందుకు కూడా ప్రయత్నించడం లేదు’ అంటున్నారు అలెన్. మరి ఈ పరిశోధన ముగిసేసరికి ఇలాంటి భయంకరమైన వాస్తవాలు ఎన్ని బయటపడతాయో!

మరైతే ఎంతసేపు నడవాలి? ఎలా నడవాలి? అన్న విషయమై అలెన్‌ తన పరిశోధనని పూర్తి చేసేదాకా మనం ఆగాలా! అమెరికాలోనే సుదీర్ఘ కాలం నడక గురించి అధ్యయనం చేస్తున్న ‘ట్యూడర్‌ లాక్‌’ అనే నిపుణుడి ప్రకారం మనషి రోజుకి కనీసం 8,000 అడుగులన్నా నడిస్తే మంచిది.

సాధారణంగా మనిషి ఓ 5,000 అడుగుల వరకు తనకు తెలియకుండానే నడుస్తుంటాడనీ, దానికి మరో 3,000 అడుగులు జోడించేందుకు, ఓ అరగంటపాటు ప్రత్యేకంగా నడకసాగించమని చెబుతున్నారు ట్యూడర్‌. మరి అలెన్‌ పరిశోధన, ట్యూడర్‌ మాటను ఎంతవరకు రుజువు చేస్తుందో చూడాలి.

- నిర్జర.

By
en-us Political News

  
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.