మోనోరైల్ అన్నారు..మౌనంగా ఉన్నారు : ఏడాది నుండి పడిగాపులు కాస్తున్న వరంగల్ ప్రజలు

Publish Date:Dec 28, 2019

Advertisement

 

మోనోరైల్ తో వరంగల్ కు కొత్త శోభ సంతరించుకోబోతుందని ఏడాది క్రితం తెలియజేశారు. ప్రపంచ శ్రేణి నగరాల సరసన వరంగల్ ను నిలిపేందుకు కృషి జరుగుతోందని ప్రచారం చేశారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారంగా స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ మోనో రైలు ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆ మేరకు వారిని వరంగల్ నగరంలో తిప్పి సర్వే కూడా చేయించారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు పన్నెండు కిలో మీటర్ లకు దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు కు రూపకల్పన జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

గతేడాది ఫిబ్రవరి 22న స్విట్జర్లాండ్ ప్రతినిథులను ఓరుగల్లు గల్లీల్లో తిప్పుతూ మోనోరైల్ రాబోతోందని ఊరించారు. కానీ కొన్నాళ్లకు అది మరిచిపోయి ఆ ఊసే ఎత్తలేదు. తాజాగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో హెచ్ఎండీఏ అధికారులతో వరంగల్లో పర్యటించారు.మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదన పై సమీక్ష నిర్వహించారు.సాధ్యాసాధ్యాలపై చర్చించారు మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు డీపీఆర్ తయారీ తదితర అంశాల పై స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమీక్ష జరిపారు. దీంతో వరంగల్ కు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని ఏడాదిలోగా పనులు ప్రారంభమవుతాయని చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో గతేడాది మోనోరైల్ పై జరిగిన సర్వేను నగర వాసులు గుర్తు తెచ్చుకుంటున్నారు.

గతేడాది ఫిబ్రవరిలో మోనో రైలు కోసం జరిగిన సర్వే ఏమయిందని ప్రశ్నిస్తున్నారు. మోనోరైలుకు,మెట్రో రైల్ కు ఉన్న తేడాల పై తీవ్రమైన చర్చ సాగుతోంది. మెజారిటీ ఓరుగల్లు వాసుల మాత్రం మోనోరైల్ పైనే మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ తర్వాత వేగంగా విస్తరిస్తున్న మహానగరం వరంగల్ అని అందరికి తెలిసిందే.దినదినాభివృద్ధి చెందుతూ మెట్రో పాలిటన్ నగరాల సరసన నిలిచేందుకు పోటీ పడుతోంది ఓరుగల్లు నగరం.హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరమే ఉండటంతో పరిశ్రమలు పుట్టుకొస్తున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇతర వ్యాపార సంస్థలు నగరం పై కన్నేశాయి.ఉద్యోగం ఉపాధి అవకాశాలు కూడా రోజు రోజుకూ పెరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండే యువత ఓరుగల్లు పై ఆసక్తి పెంచుకుంటున్నారు.దీంతో నగరంలో జనం రద్దీ పెరుగుతోంది.

ఇప్పటి వరకు వరంగల్ జనాభా 10 లక్షలు దాటింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసి ట్రై సిటీస్ గా అవతరించాయి. ఈ ట్రై సిటీస్ లో ప్రయాణించాలంటే గగనమే. వరంగల్ నుంచి కాజీపేటకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 12 కిలో మీటర్లు ప్రయాణించాలంటే గంటకి పైనే పడుతోంది. నిత్యం ట్రాఫిక్ పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు గతేడాది మోనో రైలు ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు సర్వే కూడా నిర్వహించారు.ఈ లోగా ఎలక్షన్లు రావడంతో అదంతా వదిలేశారు. వరంగల్ మహానగరంలో జనాభా కేవలం 10 లక్షలు మాత్రమే. రాజధాని నగరంలో చివరి నుంచి మరోవైపుకు వెళ్లాలంటే 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాని వరంగల్లులో 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ కోసం రిస్కు పడకుండా మోనోరైల్ అందుబాటులోకి తేవాలని నగర వాసులు కోరుతున్నారు.

By
en-us Political News

  
పరుగెత్తి పాలు తాగినా, నిలబడి నీరు తాగినా దాహం తీర్పుకోవడమే లక్ష్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు అదే లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  కుదిరితే పరిగెత్తుకు వస్తున్నారు, లేకపోతే నడిచి వస్తున్నారు, అదీ కుదరకపోతే పాక్కుంటూ కూడా పోలింగ్ బూత్ కు చేరుకుంటున్నారు.  ఏరులు దాటి వస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే
జగన్ దారుణంగా ఓడిపోబోతున్నారని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నిన్న ఆదివారం కూడా ఆర్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి జగన్ ఓడిపోతారంటూ కుండ బద్దలు కొట్టారు.
వైసీపీ మూకలు చెలరేగిపోతున్నాయి. ఎన్నికల వేళ దాడులకు తెగబడుతూ భయానక వాతావరణాన్ని సృష్ఠించాలని యత్నిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారి పల్లెలో తెలుగుదేశం ఏజెంట్ సుభాష్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుభాష్ కు కుడి కన్ను పోయింది.
మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, భార్య భువ‌నేశ్వ‌రితో క‌లిసి ఉండ‌వ‌ల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అలాగే ఆయ‌న కుమారుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌, భార్య బ్రాహ్మ‌ణి కూడా ఇదే పోలింగ్ సెంట‌ర్‌లో ఓటు వేశారు.
ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ స‌హా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనాల‌ని మోదీ పిలుపునిచ్చారు. మ‌రోవైపు తెలుగు సంస్కృతిని, గౌర‌వాన్ని కాపాడే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.   
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ సోమవారం (మే13) ప్రారంభం అయింది. నాల్గోవిడతలో దేశ వ్యాప్ంగా 10 రాష్ట్రాలలో  96 లోక్‌సభ స్థానాల్లో   ఓటింగ్‌ జరుగుతోంది.
మంగళగిరిలో ఓటు హక్కును  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు.
మంత్రి పెద్దిరెడ్డి మంచీ చెడూ, ఉచ్ఛం, నీచం వదిలేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్‌లో పెద్దిరెడ్డి ఓటు వేశారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం, ఇతర బకాయిల మొత్తాన్ని ఈ రోజు తెల్లవారు ఝామునే వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ఉత్సాహం మీద పలు చోట్ల ఈవీఎంలు నీళ్లు చల్లుతున్నాయి. రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలంగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ లలో వేచి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు వేసే వంతు కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయాలన్న పట్టుదల, సంకల్పం జనంలో కనిపిస్తోంది.
ఆంద్రప్రదేశ్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాపుల ఘటనలు జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.