ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై అధికార, విపక్షాల మధ్య వార్...

Publish Date:Feb 10, 2020

Advertisement

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఈ చర్యను ఎదుర్కోవడానికి చట్ట పరంగా ముందుకు వెళతానని వెంకటేశ్వర రావు చెబుతున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కాక రేపుతోంది.

ప్రభుత్వం తప్పుచేసి ఆ తప్పుకు ఉద్యోగులను శిక్షించడం ఎక్కడైనా ఉందా అని చంద్రబాబు ట్విట్టర్ లో ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు ధోరణి రానురాను పరాకాష్టకు చేరుతుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపుతో వారి ఉన్మాదం చల్లారలేదన్నారు. మూడు నెలలకు మించి వెయిటింగ్ లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించబోమనటం వైసీపీ ఉన్మాదానికి నిదర్శనం అని, అధికారులను భయబ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అటు టిడిపి సీనియర్ నేతలు యనమల, వర్ల రామయ్యలు కూడా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదించవద్దని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గాలను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏ తప్పూ చేయకున్నా ఏడు నెలలుగా పోలీసులను వీఆర్ లో ఉంచారని మూడు నెలలు విఆర్ లో ఉంటే జీతాలు ఇవ్వబోమని వేధిస్తున్నారని మండిపడ్డారు. 

ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి ఓడిపోవడానికి ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిని సన్మానిస్తారు అనుకుంటే సస్పెండ్ చేశారు ఏమిటి అంటూ ట్వీట్ చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి వైసిపి గెలవటానికి టిడిపి ఓడిపోవడానికి ఏబీ వెంకటేశ్వరరావే కారణం అని అర్థం వచ్చేలా కేశినేని నాని ట్వీట్ చేశారు. కేశినేని నాని ట్వీట్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఏబివి అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారు అని సజ్జల ట్వీట్ చేశారు. ఏబివి ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాల కోసం పని చేశారని వైసీపీని దెబ్బ తీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని ఆరోపించారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పని చేశారని తనతో సహా వైసీపీ నేతల ఫోన్లన్నింటిని అక్రమంగా ట్యాప్ చేసి ఓ మాఫియా నడిపారని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. 

సస్పెన్షన్ పై ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. బంధుమిత్రులను హితులను ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. ఆరోపణలు అవాస్తవమని సస్పెన్షన్ వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్ట పరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని ఏబీ వెంకటేశ్వర రావు ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. ప్రాథమిక విచారణలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరించినట్టుగా గుర్తించిన ప్రభుత్వం దీనిపై సీఐడీ చేత విచారణ జరిపించేందుకు సిద్ధమైంది. అంతర్గత పరికరాలతో పాటు కొనుగోళ్ళ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తుకు సన్నాహాలు చేస్తోంది. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలనే ప్లాన్ లో ఉంది, ఇప్పటికే ఏడు అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్.

By
en-us Political News

  
ఏపీ రాజ‌కీయాల్లో పోలింగ్ త‌రువాత కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ నేత‌లు ప‌క్క‌ చూపులు చూస్తున్నారు. వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, కూట‌మి 140 నుంచి 150 సీట్ల‌తో తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం(మే21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్ 15
ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా 570 రాళ్ళున్నాయి.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది
ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి...
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.