ఈ రోజే వక్ఫ్ వార్.. ఉత్కంఠకు తెర !

Publish Date:Apr 2, 2025

Advertisement

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వక్ఫ్ చట్ట  సవరణ బిల్లును ప్రభుత్వం  బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ  పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ  వ్యవహారాల శాఖ మంత్రి  కిరణ్ రిజిజు బిల్లును సభలో  ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి మంగళ వారం (ఏప్రిల్ 1) జరిగిన బీఎసీ సమావేశంలో స్పీకర్ ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు. అయితే  ముస్లిం హక్కులను కాలరాచే బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం సరి పోదు పది గంటలు కావాలని విపక్షాలు పట్టు పట్టాయి.   సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే, స్పీకర్ అనుమతిస్తే పది గంటల చర్చకు అయినా పభుత్వం సిద్డంగా ఉందని మంత్రి  కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో.. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అవసరం అయితే ఇంకా ఎక్కువ సమయం అయినా చర్చ జరగవచ్చును. అయితే  ఎన్ని గంటలు చర్చ జరుగుతుందిఅనేది కాదు, చివరకు ఏమి జరుగుతుంది? ఇదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

వక్ఫ్ చట్ట  సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అనుమానం లేదు. ఉభసభల్లో అధికార, విపక్షాల సంఖ్య, బలాలను బట్టి చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా, ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు.  వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. సో , సంఖ్యా పరంగా చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. అలాగే  ఒక సారి, సభ ఆమోదం పొందిన తర్వాత  రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్‌ సవరణ బిల్లు వక్ఫ్‌ సవరణ చట్టం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి రోడ్ బ్లాక్స్  లేకుండా కథ నడిచి పోతుంది. 

కానీ, అక్కడితో కథ ముగిసి పోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిజానికి, రేపటి దృశ్యం ఎలా ఉండబోతోందో సూచించే సంకేతాలు ఇప్పటికే చాలా వరకు స్పష్ట మయ్యాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తర్వాత కలహాల కాపురంగా మారిన ఇండియా కూటమి  ని వక్ఫ్ బిల్లు మళ్ళీ ఏకం చేసింది. బుధవారం(ఏప్రిల్ 2) లోక్ సభలో జరిగే చర్చలో ఇండియా కూటమి పార్టీలు ఒక్కటిగా బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే  ఇప్పటికి కూడా అటు అధికార ఎన్డీఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీలలో ఎలాగైతే చిన్న పెద్ద  సందేహాలు, సందిగ్ధతలు ఉన్నాయో  అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలలోనూ శషబిషలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సభలో అటు ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ఇటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల వైఖరి ఎలా ఉంటుంది  అనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో   ఒకటే మాట, ఒకటే బాణం  అన్నట్లు వ్యవహరిస్తాయా.. సభలోనూ పాత గాయాలు బయట పడతాయా అన్నది చూడవలసి వుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ మేనేజిమెంట్,  ఫైనల్ కౌంటింగ్ రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనీ..  కీలకంగా మారుతుందని అంటున్నారు.   

నిజానికి, వక్ఫ్ చట్టం సవరణలకు సంబంధించి సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలతా లేదు. అసలు సరైన అవగాహనే లేదు. అయితే  ముస్లిం సమాజంలో సహజంగా స్థిరపడిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్ల నాటుకు పోయిన వ్యతిరేకత (కల్పిత ‘భయం’ అనాలేమో) కారణంగా మెజారిటీ ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ  80 శాతం ఉన్న హిందువులపై ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. నిజానికి బిల్లుకు ముందు కాదు  తర్వాతనే అసలు రాజకీయం బయట పడుతుంది.అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై ఈరోజు దేశంలో ఒక విధమైన ఉత్కంఠ నెలకొందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.