ఈ రోజే వక్ఫ్ వార్.. ఉత్కంఠకు తెర !

Publish Date:Apr 2, 2025

Advertisement

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వక్ఫ్ చట్ట  సవరణ బిల్లును ప్రభుత్వం  బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ  పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ  వ్యవహారాల శాఖ మంత్రి  కిరణ్ రిజిజు బిల్లును సభలో  ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి మంగళ వారం (ఏప్రిల్ 1) జరిగిన బీఎసీ సమావేశంలో స్పీకర్ ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు. అయితే  ముస్లిం హక్కులను కాలరాచే బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం సరి పోదు పది గంటలు కావాలని విపక్షాలు పట్టు పట్టాయి.   సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే, స్పీకర్ అనుమతిస్తే పది గంటల చర్చకు అయినా పభుత్వం సిద్డంగా ఉందని మంత్రి  కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో.. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అవసరం అయితే ఇంకా ఎక్కువ సమయం అయినా చర్చ జరగవచ్చును. అయితే  ఎన్ని గంటలు చర్చ జరుగుతుందిఅనేది కాదు, చివరకు ఏమి జరుగుతుంది? ఇదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

వక్ఫ్ చట్ట  సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అనుమానం లేదు. ఉభసభల్లో అధికార, విపక్షాల సంఖ్య, బలాలను బట్టి చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా, ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు.  వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. సో , సంఖ్యా పరంగా చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. అలాగే  ఒక సారి, సభ ఆమోదం పొందిన తర్వాత  రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్‌ సవరణ బిల్లు వక్ఫ్‌ సవరణ చట్టం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి రోడ్ బ్లాక్స్  లేకుండా కథ నడిచి పోతుంది. 

కానీ, అక్కడితో కథ ముగిసి పోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిజానికి, రేపటి దృశ్యం ఎలా ఉండబోతోందో సూచించే సంకేతాలు ఇప్పటికే చాలా వరకు స్పష్ట మయ్యాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తర్వాత కలహాల కాపురంగా మారిన ఇండియా కూటమి  ని వక్ఫ్ బిల్లు మళ్ళీ ఏకం చేసింది. బుధవారం(ఏప్రిల్ 2) లోక్ సభలో జరిగే చర్చలో ఇండియా కూటమి పార్టీలు ఒక్కటిగా బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే  ఇప్పటికి కూడా అటు అధికార ఎన్డీఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీలలో ఎలాగైతే చిన్న పెద్ద  సందేహాలు, సందిగ్ధతలు ఉన్నాయో  అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలలోనూ శషబిషలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సభలో అటు ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ఇటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల వైఖరి ఎలా ఉంటుంది  అనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో   ఒకటే మాట, ఒకటే బాణం  అన్నట్లు వ్యవహరిస్తాయా.. సభలోనూ పాత గాయాలు బయట పడతాయా అన్నది చూడవలసి వుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ మేనేజిమెంట్,  ఫైనల్ కౌంటింగ్ రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనీ..  కీలకంగా మారుతుందని అంటున్నారు.   

నిజానికి, వక్ఫ్ చట్టం సవరణలకు సంబంధించి సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలతా లేదు. అసలు సరైన అవగాహనే లేదు. అయితే  ముస్లిం సమాజంలో సహజంగా స్థిరపడిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్ల నాటుకు పోయిన వ్యతిరేకత (కల్పిత ‘భయం’ అనాలేమో) కారణంగా మెజారిటీ ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ  80 శాతం ఉన్న హిందువులపై ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. నిజానికి బిల్లుకు ముందు కాదు  తర్వాతనే అసలు రాజకీయం బయట పడుతుంది.అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై ఈరోజు దేశంలో ఒక విధమైన ఉత్కంఠ నెలకొందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందిస్తారు. ఆ నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెడతారు. ఆ నష్టాన్ని నివారించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తారు.
తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టగానే తొట్ట తొలిగా తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించింది. వైసీపీ హయాంలో తిరుమల పారిశుద్ధ్యం సహా ప్రతి విషయంలోనూ అస్తవ్యస్థంగా తయారైంది. అన్యమతస్తులకు టీటీడీలో కొలువులు ఇవ్వడం నుంచీ, తిరుమల ప్రసాదంలో కల్తీ వరకూ నానా రకాలుగా భ్రష్టుపట్టించారు. దీంతో తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టగానే తిరుమల పవిత్రతను కాపాడటంపై దృష్టి సారించింది.
వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉ:ది. సోమవారం (ఏప్రిల్ 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది.  ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
 తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం  వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్  చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం  మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో  వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి.  తాజాగా  తిరుపతిలోని  ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.