Publish Date:Feb 20, 2020
ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి చాలా వినూత్నంగా దూసుకుపోతున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు, ఏపీలో విపక్షం విమర్శలే కాకుండా అంతర్జాతీయ స్థాయి పత్రికల విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు వైఎస్ జగన్. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరోసారి జగన్ ప్రభుత్వం విమర్శలపాలైంది. మొన్నటికి మొన్న పోలవరం పెండింగ్ బిల్లులు చెల్లించలేదంటూ జర్మనీ కంపెనీ ఏపీ ప్రభుత్వం పరువు తీస్తే.. తాజాగా పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ జగన్ ప్రభుత్వంపై పునరుత్పాదక ఇంధన శక్తి కంపెనీలు చేసిన ఆరోపణలు కాస్త అంతర్జాతీయ మీడియాకెక్కాయి.
వాడుకున్న విద్యుత్ కు ఏపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఉత్పత్తి కంపెనీలు చెబుతున్నాయంటూ అమెరికాలోని ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వ్యాసం రాసింది. ప్రపంచ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగంపై కథనం రాసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ సందర్భంగా ఇండియాలో తాజా పరిస్థితుల గురించి కూడా చర్చించింది. దశాబ్ద కాలంగా భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన శక్తిపై సీరియస్ గా దృష్టి సారించిందని సౌర విద్యుత్ విషయంలో పెద్ద కలలు ఉన్నాయని చెప్పింది. 2030 నాటికల్లా 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని సాధించాలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పెట్టుకుందని వివరించింది.
అయితే ఈ లక్ష్యాలను సాధించడంలో ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ కంపెనీలకు 1.3 బిలియన్ డాలర్ లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. సోలార్ విద్యుత్ ను అధికంగా వినియోగించుకోవడంలోనే కాదు కంపెనీలకు బకాయిలు చెల్లించే విషయంలోనూ అగ్ర స్థానంలో ఏపీ ఉందంటూ పరువు తీసింది. ఏపీ విద్యుత్ పంపిణీ కంపెనీలు విద్యుత్ బిల్లులను సరిగ్గా చెల్లించకుండా వేధిస్తున్నాయని రాసుకొచ్చింది. తక్కువ ధరకు సరఫరా చేయకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రస్తావించింది. ఇప్పటికే పీపీఏలు రివర్స్ టెండరింగ్ నిర్ణయాలపై పలుచోట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించాలన్న నిర్ణయంపై అటు భారత ప్రభుత్వం కూడా ఏపీని తప్పుపట్టింది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుందని కేంద్ర పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఒకటి రెండు సార్లు కేంద్రప్రభుత్వం కూడా ఈ విషయంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wall-street-journal-trashes-ap-cm-ys-jagan-over-ppas-issue-25-94529.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.