Publish Date:Nov 20, 2024
కత్తి వాడటం మొదలు పెడితే, నా కన్నా బాగా ఎవడూ వాడలేడు అంటూ మిర్చి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దానికి కొంచం మార్చి మనుషులను వ్యవస్థలను వాడుకోవడంలో తనను మించిన వాడు ఎవడూ ఉండడు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా ఇష్టారీతిగా వాడేసుకున్నారు. ఆ వాడకంలో ఆయన తన కోసం తన చేత తానే సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. వాడకం పూర్తయిన తరువాత జగన్ అంత కాలం తన కోసమే పని చేసిన మనుషులను, వ్యవస్థలను కూడా కూరలో కరివేపాకులా విసిరి అవతల పారేశారు. అలా పారేశిన వాటిలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది.
అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి కూడా లేకుండా పోయింది. ఆయన కోసం అన్నీ వదులుకుని నామమాత్రపు వేతనాల కోసం వాలంటీర్లుగా చేరిన లక్షలాది మంది యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఔను ఇదే విషయాన్ని శాసనమండలి వేదికగా మంత్రి డోలా బాలవీరాంజనేయులు చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు. గత ఏడాది ఆగస్టు నుంచే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి మాయమైపోయిందని శాసన మండలి జీరో అవర్ లో మంత్రి డోలా బాల వీరాంజనేయ శర్మ చెప్పారు. జగన్ గత ఏడాది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందనీ, కానీ ఆయనా పని చేయకపోవడంతో ఆ నాటి నుంచి ఆ వ్యవస్థ రాష్ట్రంలో లేకుండా పోయిందనీ అన్నారు. జగన్ నిర్వాకం వల్ల గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థకు కాలం చెల్లిందని వివరించారు.
వాలంటీర్లను కొనసాగిస్తామంటూ తాము ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాలంటీర్లను కొనసాగించి వారికి వేతనాలు ఇద్దామని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని చెప్పిన మంత్రి డోలా కొలువులో లేని ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వడానికి ఎలా సాధ్యమౌతుందని సభా ముఖంగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లనే వాలంటీర్లను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయిం దని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ సర్కార్ పునరుద్ధరించి ఉన్నట్లైతే తమ సర్కార్ ఇప్పుడు దానిని తప్పని సరిగా కొనసాగించేదని డోలా బాల వీరాంజనేయులు సభా ముఖంగా చెప్పారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో 2,63,000 మంది వాలంటీర్లు ఉండేవారనీ, వారిలో లక్షా ఏడు వేల మంది సరిగ్గా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపిన మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా పది వేల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని వివరించారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాము అప్పట్లో రాజీనామాలు చేశామని చెబుతున్నారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లుగా భావించి తిరిగి కొలువులోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ల పట్ల ప్రజలలో ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదు. వారు వైసీపీ ఏజెంట్లని ప్రజలందరికీ తెలుసు. అందుకే వారిని కొనసాగించాలన్న వాదనలో ఇసుమంతైనా పస లేదు. అయినా వాలంటీర్ల ప్రాథమిక బాధ్యత సామాజిక పింఛన్ల పంపిణీ, అది ఈ ఐదు నెలలుగా వారు లేకుండా కూడా సజావుగా సాగుతోంది. అటువంటప్పుడు ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా వాలంటీర్లను కొనసాగించడంలో అర్ధం ఉండదని డోలా బాల వీరాంజనేయులు శాసనమండలి జీరో అవర్ లో స్పష్టంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/volunteer-system-in-ap-a-closed-chapter-25-188690.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.