ప్రజా సమస్యలు గాలికి.. ప్రజాప్రతినిథులు గాల్లోకి!

Publish Date:Apr 12, 2025

Advertisement

రోమ్ నగరం తగలబడి పోతుంటే ఇటలీ చక్రవర్తి ఫీడెల్ వాయించుకున్నారట.... ఇదో పాతకాలపు సామెత. ఇప్పుడు విశాఖలోని కొందరు కార్పొరేటర్లను చూసి ప్రజలు ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ప్రధానంగా  తెలుగుదేశం,  వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అత్యధిక శాతం మంది విహార యాత్రలకు వెళ్లారు. అది కూడా ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం.  

విశాఖ కార్పొరేషన్ తాజా కౌన్సిల్ ఏర్పాటై నాలుగేళ్లు గడిచింది. వైసీపీ   హయాంలో ఎన్నికలు జరగడంతో అన్ని రకాల అండదండలతో ఆ పార్టీ మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి ఎన్నికయ్యారు. కానీ కార్పొరేషన్ పై ఆమెకు పెత్తనం లేకుండా వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి వ్యవహరించారు. కౌన్సిల్లో కూడా ఆ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను లాంటి నాయకులు పెత్తనం కొనసాగింది. ఒక సమయంలో అప్పటి ఎంపీ విజయ్ సాయి రెడ్డి అండతో జీవీఎంసీ కమిషనర్ సృజన కనీసం మేయర్ ను పట్టించుకోని పరిస్థితి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీంతో సొంత పార్టీతో పాటు తెలుగుదేశం,  బిజెపి జనసేన కార్పొరేటర్ ల్లో కూడా చాలా వరకు అసంతృప్తి ఉంది.

ఈ దశలో నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. దీంతో కూటమికి చెందిన కార్పొరేటర్లు ఇటీవల జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం లేఖను ఇచ్చారు.  దీంతో ఒక్కసారిగా వైసిపి శిబిరంలో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ఆరు నెలల నుంచి విశాఖకు పెద్దదిక్కుగా మారిన బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారాన్ని తన భుజంపై వేసుకున్నారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు జారిపోకుండా ప్రత్యేక శిబిరానికి తరలించారు. ముందు బెంగళూరు వెళ్ళిన ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఆ తర్వాత కొలంబో కూడా ప్రయాణం కట్టారు. కూటమి నేతలు తమ కార్పొరేటర్ల పై పూర్తిస్థాయి నమ్మకం ఉండడంతో   శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు అయితే ఈనెల 19న కౌన్సిల్ జరుగుతున్న దశలో వైసీపీ మాదిరిగా తమను కూడా విహారయాత్రకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం కార్పొరేటర్లు కొందరు ప్రతిపాదన చేశారు.  దీంతో ఆ పార్టీ తరఫున మేయర్ పీఠం అవకాశం ఉన్న  తెలుగుదేశం నాయకుడు పీలా శ్రీను తమ వర్గం కార్పొరేటర్ లను మలేషియా తీసుకువెళ్లారు. రెండు పార్టీల కార్పొరేటర్లు ఈనెల 19న జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ వ్యవహారం తెలిసిన విశాఖ ప్రజలు కార్పొరేటర్ల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత మొదలైంది.

మరో రెండు వారాల్లో వర్షాలు కురవనట్లయితే కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే  రైవాడ, మేఘాద్రి గడ్డ ముడసరలోవ... గంభీరం లాంటి రిజర్వాయర్లలో పూడిక తీయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటితోపాటు నగరంలో చాలా   ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో కౌన్సిల్లో ప్రజా సమస్యలు చర్చించడానికి సిద్ధం కావలసిన కార్పొరేటర్లు రాజకీయాల కోసం విదేశాలకు వెళ్లడం ప్రజలు ఇష్టపడడం లేదు. పట్టుమని ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొండవాలు ప్రాంతాల్లో చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. టిడ్కో ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసిన ప్రజలకు ఇప్పటికీ ఇళ్ల విషయంపై ఓ స్పష్టత లేదు. ఇక వైసీపీ హయాంలో ఇచ్చిన  ఇళ్ల  స్థలాలు సెంటు సెంటున్నర భూముల వ్యవహారం కూడా అస్పష్టంగా ఉంది. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో వైఎసీపీ హయాంలో అడ్డుగోలుగా కొన్ని భూములు కేటాయింపు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక రాజకీయ అండతో పలువురు ఆస్తి పన్ను ఎగవేశారన్న అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని చర్చించాల్సిన కార్పొరేటర్లు బాధ్యత మరిచారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏడాది గడువుండే మేయర్ పీఠం ఎవరికి దక్కినా పెద్ద ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు. కానీ రాజకీయ ప్రతిష్ట కోసం వైసీపీ, తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రజా సమస్యను మరిచి విలాసాల బాట పట్టారని విశాఖ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.