విశాఖ జగన్ ఈగో శాటిస్ ‘ఫ్యాక్షన్ ’రాజధానేనా?

Publish Date:Sep 23, 2023

Advertisement

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా  పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే  ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.  ఇందుకోసం విశాఖలో ఇప్పటికే కార్యాలయాలు, సీఎం నివాసం కూడా సిద్దమవుతున్నట్లు ఆయనే చెప్పారు. రాబోయే ఎన్నికలను అక్కడి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికిప్పుడు ఎలాగైనా పరిపాలన విశాఖ నుండే చేయాలని కసరత్తులు ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే మూడు రాజధానులంటూ ప్రకటించింది.  అనంతరం అమరావతి రైతుల నిరసనలు, కోర్టు చిక్కులు, కరోనా కారణంగా మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి. కోర్టుల నుండి తీవ్ర ఒత్తిడితో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది.

ఇప్పుడు కూడా ఏపీ రాజధానిగా అమరావతి అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా  ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. రాజధానుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్ విశాఖలో రాజధాని ఏర్పాట్లు చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ఈ మేరకు ప్రకటన చేసేశారు. ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్, కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయమై తాజాగా.. మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. 

ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే, జగన్ ఏ ఉద్దేశ్యంతో విశాఖ నుండి పాలన చేయనున్నారన్న చర్చ ప్రజల మధ్య జరుగుతుంది. చట్ట పరిధిలో విశాఖకు రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు. కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగా.. చట్టాన్ని అతిక్రమించి రాజధాని తరలించే పరిస్థితి లేదు.

రాజధాని అమరావతి కోసం స్థానిక రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో ప్రభుత్వం చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాల ప్రకారం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. లేదంటే రైతులకు కొన్ని వేల కోట్లు పరిహారం చెల్లించాలి. వీటిని ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అంతేకాదు దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా పేర్కొంది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కోర్టు నిర్ణయం డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

దీనిని బట్టి చూస్తే జగన్ ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు సాంకేతికంగా జరిగే పని కాదు. కానీ, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని స్వయంగా జగనే చెబుతున్నారు కనుక విశాఖ నుండి పరిపాలన చేయాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్,  వైసీపీ చెప్తున్నట్లుగా ఇది రాజధాని తరలింపు కాదు కేవలం సీఎం ఇల్లు, ఆఫీసు. క్యాంప్ ఆఫీసు తరలింపు మాత్రమే. ఇది కూడా కేవలం విశాఖ నుండి పాలన చేశానని చెప్పుకోవడానికీ,  జగన్ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాజకీయ లబ్ది పొందడం కోసమే ఎన్నికలకు ముందు కంటితుడుపుగా ఈ విశాఖ నుండి పాలన డ్రామా మొదలు పెట్టినట్లు చూడాల్సి ఉంటుంది. అయితే, సీఎం తన ఇల్లు, ఆఫీసు తరలిస్తే రాజధాని కాదు.. దానికి ఒక చట్టం ఉంది.. అనుమతులు కావాలి.. కేంద్రం నోటిఫై చేయాలి.. ప్రభుత్వ అధికారిక ముద్ర మారాలి. కానీ, అవేమీ లేని విశాఖ జస్ట్ జగన్ ఈగో శాటిస్ఫాక్షన్ రాజధాని మాత్రమే.

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.