రూ. 19,496 కోట్లతో వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం

Publish Date:Sep 12, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ నగరాలలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ని ఈ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారు శ్రీధరన్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేశారు.

 

వాటిలో విజయవాడలో పి.యస్. బి.యస్. నుంచి పెనమలూరు వరకు నిర్మించబోయే 26.03 కి.మీ. పొడవుగల మెట్రో ప్రాజెక్టుకి రూ.6, 769 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. వైజాగ్ లో మదురవాడ సమీపంలో కొమ్మాది నుండి ఎన్.ఏ.డి. మీదుగా గాజువాక వరకు ఒక కారిడార్, గురుద్వారా జంక్షన్ నుండి పాత పోష్టాఫీసు వరకు మరో కారిడార్ నిర్మిస్తారు. మొత్తం 42.5 కి.మీ పొడవుగల ఈ రెండు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 12,727 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే విజయవాడలో ఒక కి.మీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.260.04 కోట్లు అవసరమయితే, అదే వైజాగ్ లో ఒక కి.మీ.కి రూ.299.46 కోట్లు వ్యయం అవుతుందన్నమాట!

 

20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నట్లయితే మెట్రో ప్రాజెక్టులు నిర్వహించడం లాభదాయకం కాదనే కారణం చేత విజయవాడ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చలేనని ఇదివరకే తేల్చి చెప్పింది. కానీ జపాన్ దేశానికి చెందిన జైకా అనే సంస్థ ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేప్పట్టాలని నిశ్చయించుకొంది. కానీ రెండు ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తే వీలయినంత వరకు రెంటికీ కూడా నిధులు మంజూరు అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా 2018 డిశంబరు నాటికి పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు అన్నారు.

 

ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా విజయవాడ-గుంటూరు-రాజధాని అమరావతిని కలుపుతూ సర్క్యులర్ రూటులో ఒక హైస్పీడ్ రైల్ నడిపేందుకు కూడా ప్రతిపాదనలు రైల్వే శాఖకు పంపించామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ సమగ్ర నివేదిక తయారు చేసి ఈయవలసి ఉంటుందని అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా రైల్వే శాఖదేనని వెంకయ్య నాయుడు అన్నారు. ఆ నివేదిక చేతికి అందగానే తను రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడి దానిని కూడా ఆమోదింపజేయిస్తానని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల నిర్మాణ పనులు మొదలు పెట్టే ముందు వాటికి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. బహుశః త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమం మొదలుపెట్టవచ్చును.

By
en-us Political News

  
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.