వివేకా పాపం.. తలా పిడికెడు

Publish Date:Jun 10, 2023

Advertisement

వైఎస్ రాజారెడ్డి కుమారుల్లో రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిలు కడప రాజకీయాల్లో చక్రం తిప్పారు. వైఎస్ వంశానికి శాశ్వత కీర్తిని సంపాదించగా, వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో పనులు చక్కబెడుతూ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ మరణంతో తిరిగి ఆ కుటుంబంలో ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది.

అప్పటికే ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పని చేసిన వివేకానందరెడ్డి తన నాయకత్వాన్ని నిలుపుకొని కుటుంబ పెద్దగా తనను తాను ప్రకటించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ తండ్రి స్థానం కోసం పావులు కదిపాడు. వివేకా, జగన్ ల మధ్య 2005 ప్రాంతం నుంచి జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోవాలి.  2004లో కపడ  లోక్ సభ స్థానం నుండి వివేకానందరెడ్డి విజయం సాధించారు. అప్పటికి ఏ పదవిలోనూ లేని జగన్ కు లోక్ సభ సభ్యుడు కావాలన్న కోరిక పుట్టింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా కడప ఎంపీ వివేకాపై ఒత్తిడి పెరిగింది.  

జగన్ కు తండ్రి తోడవడంతో చేసేది లేక రాజీనామాకు సిద్ధపడిన వివేకానందరెడ్డి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు ఎదురు చూసినా సోనియా దర్శనం కాకపోవడంతో నిరాశగా తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరారు. మోతీలాల్ ఓరా ద్వారా సమాచారం తెలుసుకున్న సోనియా గాంధీ వైఎస్ వివేకాను ఏఐసీసీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.  విషయాన్ని సోనియాకు వివరించిన వివేకా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. వివేకా ప్రతిపాదన సోనియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వివేకాను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడాన్ని సోనియా తప్పుపట్టారు. వివేకాకు నచ్చజెప్పి ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించారు సోనియాగాంధీ.

ఈ అంశాన్ని దగ్గరుండి చూసిన మరో కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఈ నిజాన్ని ఇటీవల ప్రపంచం ముందు ఉంచారు. అప్పటి నుంచి వివేకానందరెడ్డిని కష్టాలు పలకరిస్తూనే వచ్చాయి. 2009లో కడప లోక్ సభ స్థానాన్ని జగన్ కు వదిలేసి అనంతరం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ ప్రమాదవశాత్తు మరణించడంతో వివేకా కష్టాలు నూరింతలు పెరిగాయి. 2010లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో వదిన విజయలక్ష్మికి మద్దతు పలికారు. కాంగ్రెస్ తో జగన్ తెగతెంపులు చేసుకున్న తరువాత 2011లో మరోసారి ఉప ఎన్నిక వచ్చింది. ఈ సారి వివేకా కాంగ్రెస్ తరఫున వదిన విజయలక్ష్మికి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2014 తరువాత వివేకా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇది గతం. ప్రస్తుతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతి విషయం వివేకా హత్య  చుట్టూ తిరుగుతోంది. 2019లో విజయం సాధించిన జగన్ ను ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య మింగుడుపడడం లేదు.

వివేకానందరెడ్డిని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన పాపం, వివేక హత్య జరిగిన అనంతరం ఆయనపై వేసిన నిందల పాపం, ఆయన కుమార్తెకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న పాపం, వివేకా హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన అవినాష్ ను కాపాడుతున్న పాపం.. ఇలా ఒకటి కాదు అన్ని పాపాలూ కలిసి ఇప్పడు జగన్ కు, ఆయన అనుయాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న ఎన్నికలలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.