వివేకా హత్య కేసు దర్యాప్తు.. తదుపరి అరెస్టు అవినాష్ దేనా?

Publish Date:Apr 15, 2023

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందు ముందు మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ శుక్రవారం (ఏప్రిల్ 14) అరెస్టు చేసిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టును సీబీఐ శనివారం (ఏప్రిల్ 15)  కోర్టుకు సమర్పించింది.

ఆ రిమాండ్ రిపోర్టులో కూడా వైసీపీ ఎంపీ  ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. హత్య   అనంతరం వేకువ జామున ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది.

హత్య విషయం తెలిసిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ పూర్కొంది. ఈ నలుగురికి సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. 
నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను మాయం చేసేయత్నం చేశారనీ, . అలాగే వివేకా గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆ నివేదికలో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

ఉదయ్ కుమార్ రెడ్డి పరారి అవుతాడన్న అనుమానంతోనే అరెస్టు చేశామని తెలిపింది. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనీ హత్య జరిగిన అనంతరం ఆయన లొకేషన్ వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా ఉదయ్ కుమార్ రెడ్డి నోరు మెదపడంలేదనీ పేర్కొంది. వివేకా హత్య కేసుకు సంబంధించి త్వరలోనే మరి కొందరు కీలక వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు సీబీఐ కోర్టులు నివేదించింది.  దీంతో తరువాత అరెస్టు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. సీబీఐ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇహనో ఇప్పుడో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించిన వివరాలు స్పష్టంగా, సూటిగా హత్య జరిగిన తరువాత ఎవరెవరు ఏం చేశారన్నది వివరంగా ఉండటంతో వివేకా హత్య కేసులో తదుపరి అరెస్టు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలేనని పలువురు అంటున్నారు.

గతంలో కూడా సీబీఐ హైకోర్టుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలిపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో సీబీఐ విచారణాధికార మారడంతో సీబీఐ దర్యాప్తు ఒకింత మందగించినట్లు అనిపించింది. ఇంతలోనే ఉరుములేని పిడుగులా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ అవినాష్ అరెస్టు ఎప్పుడున్న దానిపై కేంద్రీకృతమై ఉంది. ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ వివేకా హత్య తదననంతరం అవినాష్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సాక్ష్యాల మాయంకు ప్రయత్నించారని పేర్కొనడంతో ఆయన అరెస్టు కూడా అనివార్యమని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.