ఏపీలో చంద్రోదయం.. దేశానికి వెలుగుల ప్రసారం

Publish Date:Nov 15, 2024

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక  చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి సంచలనం రేపారు.  ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో  ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.  ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారుల,ఇటు ప్రజల మన్నలు పొదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వభాగస్వామిగా ఉన్నా రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకులకన్నా సీనియర్. ప్రధానిమోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచీ కూడా  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన ముఖ్యమంత్రి గా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. ఏడుపదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు  ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో  ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ, ఆరెస్సెస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  ప్రపంచంలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి  విజయ తీరాలకు బీజేపీని చేర్చ లేకపోయినా ప్రపంచ కీలక నేతలతో  మోడీ నెరిసిన సంబంధాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా, రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకు వెళుతున్నది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ  విధానం కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల లో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో  నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు.   అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన  సమస్యల కారణంగా  ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు.  రాజధాని అమరావతిని  రూపుదిద్దేపనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేసారు. 2019లో ఊహించని పరాజయంతో  విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టినా అవిశ్రాంతంగా శ్రమించారు.  పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి,మళ్లీ అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టారు.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు  చేసి 52 రోజులు జైలులో పెట్టినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు.  
చంద్రబాబు వ్యూహరచనలలో మేటి.  ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ ను దీటుగా ఎదుర్కొని నిలిచారు.

2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేధించడం ద్వారా ఆయన వ్వూహాలు బెడిసి కొట్టినా, 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటం లాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీయేలో కీలకంగా మారారు.  అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్ల కుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం, అమరావతి,పోలవరం పూర్తి  లక్ష్యంగా ముందుకు పోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చిక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది.కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది.  తన కున్న 16 స్థానాలతో ఎన్డీఏ ను మూడోసారి అధికారంలో నిలబెట్టారు.  1996లో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ ను కాదని యూనైటేడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ లో బాబు కీలకంగా వ్వవహరించిన అనుభవం మరచిపోలేం.  ఏదిఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖరాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.