ఏపీలో చంద్రోదయం.. దేశానికి వెలుగుల ప్రసారం

Publish Date:Nov 15, 2024

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక  చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి సంచలనం రేపారు.  ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో  ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.  ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారుల,ఇటు ప్రజల మన్నలు పొదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వభాగస్వామిగా ఉన్నా రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకులకన్నా సీనియర్. ప్రధానిమోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచీ కూడా  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన ముఖ్యమంత్రి గా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. ఏడుపదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు  ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో  ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ, ఆరెస్సెస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  ప్రపంచంలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి  విజయ తీరాలకు బీజేపీని చేర్చ లేకపోయినా ప్రపంచ కీలక నేతలతో  మోడీ నెరిసిన సంబంధాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా, రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకు వెళుతున్నది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ  విధానం కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల లో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో  నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు.   అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన  సమస్యల కారణంగా  ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు.  రాజధాని అమరావతిని  రూపుదిద్దేపనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేసారు. 2019లో ఊహించని పరాజయంతో  విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టినా అవిశ్రాంతంగా శ్రమించారు.  పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి,మళ్లీ అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టారు.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు  చేసి 52 రోజులు జైలులో పెట్టినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు.  
చంద్రబాబు వ్యూహరచనలలో మేటి.  ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ ను దీటుగా ఎదుర్కొని నిలిచారు.

2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేధించడం ద్వారా ఆయన వ్వూహాలు బెడిసి కొట్టినా, 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటం లాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీయేలో కీలకంగా మారారు.  అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్ల కుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం, అమరావతి,పోలవరం పూర్తి  లక్ష్యంగా ముందుకు పోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చిక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది.కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది.  తన కున్న 16 స్థానాలతో ఎన్డీఏ ను మూడోసారి అధికారంలో నిలబెట్టారు.  1996లో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ ను కాదని యూనైటేడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ లో బాబు కీలకంగా వ్వవహరించిన అనుభవం మరచిపోలేం.  ఏదిఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖరాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.