న్యాయవ్యవస్థలను ప్రజా ప్రతినిధులే అనుమానించి, అవమానిస్తే...

Publish Date:Aug 5, 2015

Advertisement

 

హైకోర్టు విభజనపై తెరాస ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మన న్యాయవ్యవస్థలనే ప్రశ్నిస్తున్నట్లుంది. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పునే అయన తప్పు పట్టారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో సెక్షన్:31 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, హైకోర్టు మాత్రం అందుకు విరుద్దంగా తీర్పు చెప్పిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజించి హైదరాబాద్ లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయదలచుకొంటే హైకోర్టుకి ఎందుకు అభ్యంతరం? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రుల కార్యాలయాలు వగైరా అన్నిటినీ విభజించుకొన్నప్పుడు హైకోర్టుని విభజించడానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు.

 

సుప్రీం కోర్టులో కొందరు న్యాయమూర్తులకు తీర్పులు వ్రాయడం కూడా చేతకాదని నేషనల్ జ్యూడిషియల్ కమీషన్ విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయపాలనపై తన పట్టుకోల్పోకూడదనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు విభజన జరగకుండా జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు.

 

కానీ వినోద్ చేసిన ఈ ఆరోపణలన్నీ మన న్యాయవ్యవస్థను అనుమానిస్తున్నట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పకతప్పదు. జ్యూడిషియల్ కమీషన్ పేరు చెప్పి న్యాయమూర్తులకు తీర్పు ప్రతిని వ్రాయడం కూడా రాదని చెప్పడం మన న్యాయవ్యవస్థలను, న్యాయమూర్తులను అవమానించడమే. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తీర్పుని ప్రశ్నించడం కూడా అటువంటి చర్యేనని చెప్పక తప్పదు.

 

హైకోర్టులు, సుప్రీంకోర్టు మన చట్టాలలో రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలకి అనుగుణంగా మాత్రమే తీర్పులు చెపుతాయి తప్ప కులం, మతం, జాతి, ప్రాంతీయవాదం, భావోద్వేగాలు వంటి అంశాలకు లోబడి పనిచేయవు. అవి చట్టాలకు, రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు కలిగి ఉన్నాయి. అదేవిధంగా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా కలిగి ఉన్నాయి.

 

విభజన చట్టంలో సెక్షన్: 31లో రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలని వ్రాసున్న మాట నిజమే. ఒకవేళ వ్రాయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హైకోర్టుని ఏర్పాటు చేసుకోక తప్పదు. కానీ ఆ చట్టం ప్రకారం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది కానీ ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్రంలో రెండు హైకోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొనబడలేదు. అటువంటప్పుడు హైకోర్టు ఏర్పాటుకి తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో బిల్డింగ్స్ కేటాయించినంత మాత్రాన్న హైకోర్టు విభజించి మరొకటి ఏర్పాటు చేస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అందుకే హైకోర్టు విభజన చేసి హైదరాబాద్ లో మరో హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తీర్పు చెప్పింది. అది నూటికి నూరు శాతం చాలా ఖచ్చితమయిన తీర్పు. అందుకే సుప్రీంకోర్టు ఆ తీర్పుని కొట్టివేయలేకపోయింది. ఈ సాంకేతిక అవరోధం కారణంగానే కేంద్రప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది.

 

ఇవన్నీ తెరాస ఎంపీ వినోద్ కుమార్ కి తెలియవని భావించలేము. అయినప్పటికీ ఆయన సెక్షన్: 31కి స్వంత భాష్యాలు చెపుతూ హైకోర్టు తీర్పునే ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తన తీర్పు చెపుతున్న సమయంలో ఒక మంచి సూచన కూడా చేసింది. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు. విభజన చట్టంలోని సెక్షన్: 31కి పార్లమెంటులో చట్ట సవరణలు చేసినట్లయితే, ఉమ్మడి హైకోర్టుని విభజించి హైదరాబాద్ లో తెలంగాణాకు లేదా ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే చెప్పింది. కానీ చట్ట సవరణ చేయడం కష్టమని భావించడం వలననో లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ కారణంతో విమర్శించవచ్చనే ఆలోచనతోనో తెరాస ప్రభుత్వం చట్ట సవరణకు ఒత్తిడి చేయడం లేదు. పైగా న్యాయవ్యవస్థలపై చంద్రబాబు నాయుడు తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే విభజన జరగకుండా అడ్డుపడుతున్నారనే మరొక భయంకరమయిన ఆరోపణ చేసి, న్యాయవ్యవస్థలు రాజకీయ నేతల, ప్రభుత్వాల కనుసైగలలోనే పనిచేస్తుంటాయనే అపవాదు కూడా మోపారు.

 

న్యాయవ్యవస్థల మీద ప్రజా ప్రతినిధులే ఇంత నీచమయిన అభిప్రాయం కలిగి ఉంటే ఇక సామాన్య ప్రజలకి వాటిపై విశ్వాసం కలిగిఉంటారా? ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తేనే వాటిని మన్నిస్తాము లేకుంటే ప్రశ్నిస్తాము? అనే ఇటువంటి ధోరణి మంచి పద్ధతి కాదు.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.