కాళ్ల పారాణి ఆరక ముందే!

Publish Date:Apr 25, 2025

Advertisement

జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం.  అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును  తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం. పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు చేసిన ఈ ఉగ్రదాడిలో మరణించిన ప్రతి ఒక్కరిదీ ఒక విషాద వ్యథ. గుండెలు పిండే విషాదం.  
అందులోనూ దేశం మొత్తం కన్నీరు పెట్టేలా చేసిన నేవీ ఆఫీసర్  వినయ్ నర్వాల్  వ్యధ మరింత విషాదం. కేవలం వారంరోజుల క్రితమే వినయ్ నావల్, హిమాన్షి మూడు ముళ్ళ బంధంతో  ఒకటయ్యారు. హనీ మూన్ కు కశ్మీర్ వెళ్లారు. అదే వారు చేసిన తప్పో లేక హిందువులుగా పుట్టడమే వారు చేసిన మహాపరాధమో కానీ  హనీమూన్ విషాదంగా మారింది. ఉగ్రవాదులు హిమాన్షి కళ్ళ ముందే  వినయ్ నావల్ ని కాల్చి చంపారు.  
పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ,ఒక్క వారం రోజుల వ్యవధిలోనే ఆ కొత్త జంట నూరేళ్ళ జీవితం ముగిసి పోయింది. పెళ్లి కలలు కరిగి పోయాయి. నవవధువు పాదాల పారాణి ఆరక ముందే, కళ్యాణ తిలకం ఆమె కన్నీళ్ళలో కరిగి గుండెల్లోకి జారిపోయింది. 
అవును. ఏప్రిల్ 16 న ముస్సోరీలో  మూడు ముళ్ళ సాక్షిగా ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఏప్రిల్ 19న కర్నల్ లో బంధు మిత్రులకు వివాహ విందు ఇచ్చారు. అందరి ఆశీస్సులు అందుకున్నారు. ఏప్రిల్ 21న  హనీమూన్ కు కశ్మీర్ చేరుకున్నారు. ఏ ప్రిల్ 22.. ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు  ఏప్రిల్ 23న అతడి మృతదేహం కర్నల్ చేరుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ ఆఫీసర్  వినయ్ నావల్ నూరేళ్ళ స్వప్నం.. విషాద చిత్రంగా మిగిలి పోయింది.
నిజానికి గతంలోనూ  దేశంలో అనేక చోట్ల  ఉగ్ర దాడులు జరిగాయి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎన్నో ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. కానీ, పహల్గాం ఉగ్రదాడి  హిందువులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి. ఉగ్రవాదులు తూటా పేల్చేందుకు ముందుగా  విక్టిమ్’  ఎవరో, ఏ మతమో అడిగి నిర్ధారణ చేసుకుని ఆ తర్వతనే తూటాలు పేల్చారు. 

వినయ్ నర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. ఆ ఇద్దరు బేల్ పూరి తింటున్న సమయంలో,  ఉగ్రవాది ఒకడు నర్వాల్ ని సమీపించి నువ్వు ముస్లిమా అని అడిగాడు.. కాదనగానే కాల్చి చంపాడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. హిమాన్షి స్పాట్లో చెప్పిన, వీడియోలో రికార్డు అయిన సత్యం. ఇలా జరుగుతుందని, ఎప్పుడు అనుకోలేదని  ఆమె భోరు మన్నారు.  ఇంకా విషాదం ఏమంటే, మరో వారం రోజుల్లో  మే 1న నర్వాల్ ని 27పుట్టిన రోజు. ఇంతలోనే ఈ విషాదం. మరో రెండు రోజుల్లో కొత్త జంట, కొచ్చి నేవీ క్యాంపు లో కొత్త జీవితం (కాపురం) ప్రారంభించేందుకు  ముహూర్తం పెట్టుకున్నారు. కానీ  ఇంతలోనే  ఉగ్రవాదులు ‘మృత్యు’ ముహూర్తం పెట్టారు. ప్రాణాలు తీశారు. 

కర్నాల్ సిటీలో నర్వాల్ ఇంటి ముందున్న పెళ్లి పందిరి, పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలంకారాలు అలా ఉండగానే, అదే పందిరిలోకి నర్వాల్ శవ పేటిక వచ్చింది. ఆ విషాద దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, తల్లి తండ్రులు బంధువులు, మొత్తం కర్నాల్ నగరమే కన్నీరు మున్నీరైంది. సరే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్, మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు నర్వాల్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తుందని  హామీ ఇచ్చారు. 

కానీ.. పాదాల పారాణి అయినా అరక ముందే భర్తను కోల్పోయిన హిమాన్షి కి ప్రభుత్వం ఏమి  న్యాయం చేస్తుంది. ఆ తల్లితండ్రుల కడుపు కోతకు ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది?  అయినా  పభుత్వం మహా అయితే.. పోయిన ప్రాణానికి విలువ కట్టి, నష్ట పరిహారం ఇస్తే ఇవ్వవచ్చును ?  పెళ్ళయి పది రోజులు అయినా  కాకముందే  చెరిగిన నుదిటి బొట్టుకు నష్ట పరిహారం  ఇంతని ఎవరు ఖరీదు కడతారు?  ఏదో ఇస్తారు, ఏదో జరుగుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేసిన విధంగా  ఉగ్రవాది ఎక్కడ నక్కినా, వెతికి, వేటాడి శిక్షించ వచ్చును. ఇంకా ఏమైనా  చేయవచ్చును.కానీ కంటి తుడుపు చర్యలు, ప్రకటనలు, ప్రగల్భాలతో ప్రయోజనం ఉంటుందా? ఉగ్రవాదానికి ముగింపు ఉంటుందా?

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.