విజయసాయి తిరుపతి మొక్కు ఏమై ఉండొచ్చు?

Publish Date:May 4, 2025

Advertisement

విజ‌య‌సాయిరెడ్డి మొహం చూస్తుంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న‌ట్టుంది. ఒక ద‌రిద్రం వ‌దిలింద‌న్న సంబ‌రంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అనేక విచార‌ణ‌ల‌కు వెళ్లి వ‌స్తున్నా.. ఆయ‌న మోములో తొణికిస‌లాడుతున్న‌ ఆ ఆనందానికి గ‌ల కారణాలేంట‌ని చూస్తే.. సాయిరెడ్డిగానీ ఇప్ప‌టికీ వైసీపీలో ఉండి ఉంటే ఆ టెన్ష‌న్ వేరే లెవ‌ల్లో ఉండేది. కానీ త‌న‌లోని చార్టెడ్ అకౌంటెంట్ తెలివి తేట‌ల‌న్నిటినీ వాడి.. వైసీపీకి రాం రాం చెప్పేసి.. చేతులు దులుపుకున్నారు. 

ఇటు వైసీపీ స‌భ్య‌త్వానికి, అటు త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సాయిరెడ్డి అప్పుడే ప‌దే ప‌దే వెంక‌టేశ్వ‌ర స్వామివారిని తలుచుకున్నారు. అలాంటి స్వామివారి చెంత‌కు ఇప్పుడు వ‌చ్చాక ఆయ‌న ఎలాంటి మొక్కులు మొక్కుకుని ఉంటార‌న్నదానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పైకి ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. విచారణలను ఎదుర్కొంటున్నారు.   మ‌ద్యం విచార‌ణ‌ల‌కు హాజ‌రవుతున్నారు. రాజ్ కేసిరెడ్డిని తెలివైన క్రిమిన‌ల్ అని ఈయ‌న అన‌డం, సాయిరెడ్డిని రాజ్ కేసిరెడ్డి కూడా విజయసాయిరెడ్డిని తిట్ట‌డం మ‌నకు తెలిసిందే.

 ఈ క్ర‌మంలో రాజ్ కేసిరెడ్డి త‌దిత‌రులు వ్యాపారం చేస్కోడానికి అప్పులు ఇప్పించాన‌ని కూడా చెప్పారు విజ‌యసాయిరెడ్డి. ఇలాంటి వాటితో పాటు కాకినాడ పోర్టు వ్య‌వ‌హారాలు ఇంకా ఎన్నో స‌మ‌స్య‌ల్లో పీక‌లోతు కూరుకుపోయిన విజ‌య‌సాయి.. ఈ స‌మ‌స్య‌ల‌న్నిటికీ కార‌ణ‌మైన పార్టీని వ‌దిలినా.. అప్ప‌ట్లో ఆయ‌న చేసిన పాపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వీటి నుంచి విముక్తి క‌లిగించ‌మ‌ని మొక్కి ఉంటారా?

 మొన్న‌టికి మొన్న భీమిలి బీచ్ లో విజ‌య‌సాయిరెడ్డి  సెవెన్ స్టార్ సామ్రాజ్యాన్ని సైతం పునాదుల‌తో స‌హా  పెక‌ళించింది  కూట‌మి ప్ర‌భుత్వం. దీన్నిబ‌ట్టీ చూస్తే సాయి రెడ్డి కూసాలు ఏ స్థాయిలో కదులుతున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. అంటే బిడ్డ చ‌చ్చినా పురిటి కంపు పోవ‌డం లేద‌న్న చందంగా త‌యారైంద‌న్న‌మాట‌ విజ‌య‌సాయి జాత‌కం. ఈ విష‌యంలో స్వామివారిని ఏదైనా కోరి ఉంటారా? ఒక ర‌కంగా చెబితే పార్టీలో ఉండి  కేసులు ఎదుర్కుంటున్న వారు హ్యాపీగానే ఉన్నారు. వారికంటూ ఒక సింప‌తి వ‌చ్చే ప‌రిస్థితి కూడా ఉంది. అదే విజ‌య‌సాయి రెడ్డికి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ‌గా ఉంది. ఈ విష‌యంలో కాస్తా  త‌న‌ను బ‌య‌ట ప‌డేయ‌మ‌ని కూడా ఆయ‌న కోరుకుని ఉండొచ్చ‌ని అంటారు కొంద‌రు.

 వైసీపీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కూ పార్టీలో నెంబ‌ర్ 2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి.. అధికారంలోకి వ‌చ్చాక 2వేల స్థానానికి ప‌డిపోవ‌డానికి కార‌కుల‌ను కూడా ఒక ప‌ట్టు ప‌ట్ట‌మ‌ని శ్రీవారిని వేడుకునే అకవ‌కాశాలు కూడా లేక పోలేదు. అంతే కాదు వీట‌న్నిటి నుంచి తాను బ‌య‌ట ప‌డ్డానికి ఒక మంచి పార్టీని చూపించ‌మ‌ని.. ఈ క‌ష్టాల క‌డ‌గండ్ల నుంచి త‌న‌ను త‌ప్పించ‌మ‌ని కూడా స్వామివారిని, సాయి రెడ్డి కోరుకునే అవ‌కాశాలు కూడా ఉండొచ్చంటారు కొంద‌రు. వీట‌న్నిటినీ అటుంచితే.. విజ‌య‌సాయి రెడ్డి తానొక మీడియా సంస్థ పెడ‌తాన‌ని కూడా గ‌తంలో అన్నారు. ఈ విష‌యంలో ఏదైనా మంచి పేరు త‌ట్టేలా చేయ‌మ‌ని కూడా స్వామివారిని కోరుకుని ఉండొచ్చు. 

ఇక పోతే తాను త‌న శేష జీవితాన్ని వ్య‌వ‌సాయం చేసుకుని గ‌డుపుతాన‌ని కూడా ఆయ‌న‌ గ‌తంలో అన్నారు విజ‌య‌సాయిరెడ్డి. అందుకు త‌గిన సాయం.. చేయ‌మ‌ని కూడా తిరుమ‌ల వెంక‌న్న‌ను సాయిరెడ్డి కోరుకుని ఉండొచ్చంటారా? కొంద‌రు అంటున్న మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే విజ‌య‌సాయి పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఒక‌ర‌క‌మైన మెలో డ్రామాకు తెర‌లేపార‌నీ.. ఆ డ్రామా బ‌య‌ట ప‌డ‌కుండా చూడ‌మంటూ స్వామివారిని కోరి ఉండొచ్చ‌ని కూడా అంటున్నారు మ‌రి కొంద‌రు. 

మ‌రి చూడాలి.. త‌న‌క‌న్నా మించిన వ‌డ్డీ లెక్క‌ల్ని క‌ట్టే ఒక భ‌క్తుడు ఎదురైన‌పుడు ఎంతైనా శ్రీవారికి కూడా కాస్త టెన్ష‌న్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఎన్నో లెక్క‌లు ఉన్న‌వి లేనివి- లేనివి ఉన్న‌వీ చూపించి సూట్ కేస్ కంపెనీలు పెట్టించి, పుట్టించి.. ఒక స‌మ‌యంలో త‌న మాజీ అధినేత జ‌గ‌న్ తో క‌ల‌సి ఏ2గా జైల్లో ఉండొచ్చినోడు.. అలాంటి మాయావి  ఎదురు ప‌డి.. త‌న స‌మ‌స్య‌ల‌ చిట్టా మొత్తం విప్పి.. వీట‌న్నిటినీ తీర్చాల్సిందే.. అని కోరుకుని పనిలో పనిగా క్విడ్  స్వామివారికి బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించి  ఉండొచ్చు.

 ఇలాంటి వ్య‌వ‌హారాల‌ను శ్రీవారు అనుమ‌తిస్తారా లేదా అన్నది వేరే విషయం. ఏది ఏమైనా సాయిరెడ్డి శ్రీవారి ద‌ర్శ‌నానికి రావ‌డం మాత్ర‌మే కాకుండా.. నిండా గుండు కొట్టుకుని న‌యా అవ‌తార్ లో క‌నిపించారు సాయిరెడ్డి. ఆయ‌న‌ త‌ర్వాతి అవ‌తారం ఎప్పుడు- ఎక్క‌డ‌- ఎలా ఉండ‌బోతుంద‌న్న‌దానిపై కూడా  క్లారిటీ రావ‌ల్సి ఉంది. చూద్దాం.. విజ‌య‌సాయి రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండ‌బోతుందో.. ఈ విష‌యంలో ఆయ‌న స్వామివార్ని ఎలాంటి కోరిక‌లు కోరి ఉంటారో.. తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిందే. ఏమంటారు?

By
en-us Political News

  
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.