విజయ్ సాయిరెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. ఇన్నాళ్ల పాటు వ్యవసాయమే నా వ్యాపకం, జీవన పరమార్ధం అంటూ కబుర్లు చెప్పిన విజయసాయిరెడ్డి.. పార్లమెంటు అమారావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లును ఆమోదించిన వెంటనే సామాజిక మాధ్యమంలో క్యాస్ట్ రిలేటెడ్ పోస్టుతో రంగంలోకి దిగారు. విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలూ ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లును ఇలా ఆమోదించాయో లేదో అలా ఆయన అమరావతి ని కమ్మరావతి కాకుండా చూసుకోండి ఫస్ట్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావించాలి. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. అసలు రాజకీయాలలోనే లేరు. వైసీపీకి రాజీనామా చేస్తున్నపుడు విజయసాయి ఇదే చెప్పారు. అన్నీ వదిలేసి తాను వ్యవసాయం చేసుకుంటానన్నారు.. అలాంటి వ్యవ-సాయిరెడ్డి అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి రావడం తరచూ జరుగుతూనే ఉంది. బేసిగ్గా తాను రాజకీయ పార్టీ పెడతానో లేదో తెలీదుగానీ మీడియా సంస్థనైతే పెడతానని అన్నారు విజయసాయిరెడ్డి. అది కూడా ఎందుకులే.. ఖర్చు దండగ అనుకున్నారో ఏమో.. ఫ్రీగా ఒక ట్వీట్ పడేస్తే పోతుందనే కాడికి వచ్చేశారాయన.
నిజంగానే ఆయనకు తెలుగు సమాజం మీద అంతటి ప్రేమాభిమానాలే ఉంటే.. ఆ విధానం వేరుగా ఉండేది. ఇరవై నాలుగ్గంటలూ మీడియాను ఆడిపోసుకునే ఆయన.. ఈ రంగంలోకి దిగి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేవారు. కానీ ఇప్పటి వరకూ అలాంటిదేదీ చేయకుండా కాసేపు జనసేన అధినేత నాకు ఎప్పటి నుంచో మిత్రుడనడం.. ఇదిగో ఇప్పుడు చూస్తే కమ్మరావతి అంటూ కామెంట్ చేసి.. కులాల కార్చిచ్చు రేపడానికి ప్రయత్నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
నిజానికి వీరందరికీ ఎందుకింత కడుపు మంట అంటే, విశాఖ లో అయితే అడిగే వారే ఉండరు. అందుకు వైసీపీ అధికార సమయంలో ఆయన చేసిన భూ దోపిడీయే నిలువెత్తు సాక్షి. అందుకే అందరి అమ్మలాంటి అమరావతిపై ఇలాంటి కామెంట్లు చేసి.. విజయసాయి కడుపు మంట చల్లార్చు కుంటున్నారంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి అటు వాడే కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటు వాడు కాడన్న మాట మరోమారు నిజమైందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasaireddy-kammarawati-comments-spark-criticism-39-216616.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.