విజయసారెడ్డి అప్రూవర్ గా మారిపోయినట్లేనా? వైసీపీకి ఇక దబిడి దిబిడేనా?

Publish Date:Apr 22, 2025

Advertisement

ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది.  ఈ కేసులో  త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ  నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది.  వైసీపీ మాజీ ఎంపీ,  విజయసాయి రెడ్డి  ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే  కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంంబంధించినంత వరకూ విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి అసలీ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు.  ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో నంబర్ 2గా.. ఒకానొక దశలో డిఫాక్టో సీఎంగా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో, వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయమంటూ ఉండే అవకాశం లేదు.  కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయటపెడతున్న, పెడతానంటున్న ప్రతి విషయమూ సంచలనాలను రేకెత్తిస్తుందనడంలో సందేహానికి తావు లేదు.  గత రెండు మూడు రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలూ చూస్తుంటే.. విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జగన్‌ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్టయ్యారు. గంటల వ్యవధిలోనే  ఈ ఇద్దరూ అరెస్టు కావడం కాకతాళీయమని భావించలేము. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే..ఒకరి వెంట ఒకరుగా   వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొం టున్న వారూ అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణను ఎదుర్కొనే అవకాశం ుందన్న అంశపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   

ఇంత జరిగినా, జరుగుతున్నా.. వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలూ అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావుడి చేయడం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్నే చూపుతున్నాయనీ, వైసీనీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయనీ పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీమీద గట్గిగానే పడిందనడానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమే తార్కానమంటున్నారు. 

By
en-us Political News

  
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.