Publish Date:Jan 25, 2025
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో పెను సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఉరుములేని పిడుగులా విజయసాయి ఇంత హఠాత్తుగా అదీ వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటి? ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ ఆయనకు వెన్నంటి ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరువాత ఏ2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులైతే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగనే అని అంటున్నారు. ఒక విధంగా విజయసాయి రాజీనామా బీజేపీకి జగన్ పంపిన ప్రేమ సందేశం అని కూడా చెబుతున్నారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వైసీపీ మెరేల్ ను బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. విజయసాయి కూడా వైసీపీని వదిలేస్తే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేవారెవరుంటారన్న సందేహం పార్టీ క్యాడర్ లో బలంగా వ్యక్తం అవుతోంది. తన రాజీనామా నిర్ణయం ప్రకటనకు ముందే ఈ విషయం విజయసాయికి తెలుసు అనడంలో సందేహం లేదు. అయినా విజయసాయి ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. జగన్ తో ఆయనకు ఇక పూడ్చలేని అగాధమైనా ఏర్పడి ఉండాలి. కానీ జగన్ పట్ల విజయసాయి విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని ఆయన తన రాజకీయ సన్యాసం ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అవతగమౌతోంది. మరి విజయసాయి నిర్ణయానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. జగన్ ఆదేశం మేరకే విజయసాయి ఈ నిర్ణయం ప్రకటించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీ రాజకీయాలలో వైసీపీకి ఇంక స్పేస్ లేదు. జగన్ ను జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలను నమ్మించి వారి విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు జగన్ ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. తాను కూసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ అనివార్యం అని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే విజయసాయి చేత రాజీనామా చేయించి జగన్ బీజేపీకి ప్రేమ సందేశం పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి బీజేపీలో వెంటనే చేరకపోవచ్చు.. కానీ విజయసాయి రెడ్డి బాటలో ఇతర ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారనీ, వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారనీ అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయోధ్యరామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించి ఉండొచ్చు.. కానీ ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందనీ, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని ఫణంగా పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-resignation-jagan-love-message-to-bjp-39-191824.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.