Publish Date:Jan 25, 2025
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన రాజకీయాలలో పెను సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఉరుములేని పిడుగులా విజయసాయి ఇంత హఠాత్తుగా అదీ వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటి? ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో.. జగన్ కు విజయసాయి అలాగ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి, జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచీ ఆయనకు వెన్నంటి ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి, జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తరువాత ఏ2గా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఇంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకీ, పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశీలకులైతే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగనే అని అంటున్నారు. ఒక విధంగా విజయసాయి రాజీనామా బీజేపీకి జగన్ పంపిన ప్రేమ సందేశం అని కూడా చెబుతున్నారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం వైసీపీ మెరేల్ ను బాగా దెబ్బతీసిందనడంలో సందేహం లేదు. విజయసాయి కూడా వైసీపీని వదిలేస్తే ఇక అసలు ఆ పార్టీలో మిగిలేవారెవరుంటారన్న సందేహం పార్టీ క్యాడర్ లో బలంగా వ్యక్తం అవుతోంది. తన రాజీనామా నిర్ణయం ప్రకటనకు ముందే ఈ విషయం విజయసాయికి తెలుసు అనడంలో సందేహం లేదు. అయినా విజయసాయి ఆ నిర్ణయం తీసుకున్నారంటే.. జగన్ తో ఆయనకు ఇక పూడ్చలేని అగాధమైనా ఏర్పడి ఉండాలి. కానీ జగన్ పట్ల విజయసాయి విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని ఆయన తన రాజకీయ సన్యాసం ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ద్వారా అవతగమౌతోంది. మరి విజయసాయి నిర్ణయానికి కారణమేమిటన్న ప్రశ్నకు.. జగన్ ఆదేశం మేరకే విజయసాయి ఈ నిర్ణయం ప్రకటించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీ రాజకీయాలలో వైసీపీకి ఇంక స్పేస్ లేదు. జగన్ ను జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలను నమ్మించి వారి విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు జగన్ ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. తాను కూసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అండ అనివార్యం అని జగన్ కు స్పష్టంగా తెలుసు. అందుకే విజయసాయి చేత రాజీనామా చేయించి జగన్ బీజేపీకి ప్రేమ సందేశం పంపారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి బీజేపీలో వెంటనే చేరకపోవచ్చు.. కానీ విజయసాయి రెడ్డి బాటలో ఇతర ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తారనీ, వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారనీ అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్నే ధృవీకరిస్తున్నాయి. అయోధ్యరామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించి ఉండొచ్చు.. కానీ ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందనీ, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని ఫణంగా పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-resignation-jagan-love-message-to-bjp-25-191825.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.