విజయసాయి పొలిటికల్ రీఎంట్రీ.. వైసీపీలోకి హోం కమింగేనా?

Publish Date:Aug 11, 2026

Advertisement

రాజకీయ సన్యాసం ప్రకటించి.. వ్యవసాయమే తన వ్యాపకమన్న విజయసాయి యూటర్న్ తీసుకున్నారు. అన్యాపదేశంగా కాదు నేరుగానే తన రాజకీయ రీఎంట్రీ గురించిన సంకేతాలు, ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ అంటూ లీకులిస్తున్నా విజయసాయి అడుగులు మాత్రం జగన్ పంచన చేరే దిశగానే పడుతున్నాయి. ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు.

అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో దారి అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మారుస్తున్న మాటలు, రంగులు వింటే.. చూస్తే.. ఊసరవిల్లి కూడా సిగ్గుపడేలా ఉన్నాయి.  

తాజాగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా  తన పొలిటికల్ రీఎంట్రీ విషయాన్ని దాదాపు కన్ ఫర్మ్ చేసేశారు. తన రాజకీయ రీ-ఎంట్రీ,  భవిష్యత్ కార్యాచరణ, సొంత పార్టీయా కాదా అన్న విష యాలన్నీ త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తానంటూ ప్రకటించి సస్పెన్స్ క్రియోట్ చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఆయన సోషల్ మీడియా పోస్టును ప్రస్తావిస్తూ.. సస్పెన్సేమీ లేదు.. విజయసాయి చేరేది జగన్ గూటికే అని విశ్లేషణలు చేస్తున్నారు. వారు తమ విశ్లేషణలకు  ఇటీవలి విజయసాయి వ్యాఖ్యలు, విమర్శలను ఉదాహరణలుగా చూపుతున్నారు.  

విజయసాయి ఇటీవలి ట్వీట్ లో ఏపీలో శాంతి భద్రతల సమస్య, బాలికలు, మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా పనిలో పని అన్నట్లు వైసీపీనీ దుయ్యబట్టారు. సమస్యలపై, శాంతి భద్రతల అంశంపై, మహిళలూ బాలికల భద్రతపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలమైందంటూ చెరిగేశారు. 

ప్రత్యేకంగా ఆయన విమర్శలన్నీ వైసీపీలో కొంందరిని టార్గెట్ చేశాయి. అందులో దాపరికం ఏమీ లేదు. ఆయన విస్పష్టంగా కొందరు వైసీపీ నేతలు అధికార తెలుగుదేశం కూటమితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, పార్టీ పరంగా ఆందోళనలు జరగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సాధారణంగా శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలపై ఎవరైనా ప్రభుత్వాన్నీ, పోలీసుల పని తీరునూ నిలదీస్తుంటారు. కానీ విజయసాయి మాత్రం వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు.

అందులోనూ కొందరు నేతలు అంటూ ఆయన విస్పష్టంగా చేసిన విమర్శలు.. గతంలో తాను వైసీపీలో ఉండగా తనకు అడుగడుగునా అవరోధంగా నిలిచి.. చివరకు తాను పార్టీ వీడటానికి కారణమైన సజ్జల బ్యాచ్ పై పరోక్షంగా ఎక్కుపెట్టిన అస్త్రాలేనని పరిశీలకులు అంటున్నారు.  ఇక్కడ ఇటీవల సజ్జల టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ ఏకంగా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేసిన బోరుగడ్డ అనీల్ విషయాన్ని అనివార్యంగా ప్రస్తావించాలి. ఎందుకంటే.. వైసీపీలో సజ్జల వ్యతిరేకులందరూ ఇప్పుడు ఏక కాలంలో బయటకు వచ్చి విమర్శలకు దిగుతున్నారంటే.. విజయసాయి వైసీపీ రీఎంట్రీకి సజ్జల అడ్డంకి తొలగిపోయేలా పార్టీ అధినేత జగన్ మనసు మార్చడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Vijayasai Reddy political re Entry,  YCP  News, YS Jagan, AP Politics, TeluguOne News

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.