Publish Date:Apr 22, 2025
జగన్ కు అత్యంత విశ్వసనీయ సహచరుడు, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ తో కలిసి నడిచి, ఆఖరికి ఆయన అక్రమాస్తుల కేసులో కూడా సహనిందితుడిగా జైలు జీవితం కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు. వైఎస్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం, ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటూ వచ్చిన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాల గుట్టుమట్లన్నీ విప్పుతానంటున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత.. ఇంకా పార్టీకి ఏమైనా మిగిలి ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠనూ కూడా దిగజారుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరినీ బయటకు లాగుతానని చెబుతున్నారు.
రాజ్ కసిరెడ్డి అరెస్టు అనంతరం సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో తనను తాను ఒక విజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ పాత్రేనని చెప్పుకున్నారు. అయితే ఈ కుంభకోణంలో దొరికిన దొంగలు, ఇంకా దొరకకుండా ఉన్న దొంగలూ కూడా తమను తాము కాపాడుకోవడానికి తన పేరు లాగుతున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఇంకా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న దొంగల గుట్టుమట్లన్నీ తాను బయటపెడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ తోనూ, ఆ అధినేతగా ఉన్న వైసీపీతోనూ అంటకాగి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని అందరి బాగోతం బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.
అందుకే రాజ్ కసిరెడ్డి అరెస్టు అయిన వెంటనే.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారల కమిటీతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. విజయసాయి రెడ్డి సిట్ దర్యాప్తులో పాల్గొన్న రెండు రోజుల వ్యవధిలోనూ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. ప్రశ్నలు సంధించింది. దీంతో విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే రాజ్ కసిరెడ్డే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని విజయసాయి మీడియా ముఖంగా చెప్పిన తరువాతే ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రమేయం గురించి అందరికీ తెలిసింది. కాగా విజయసాయి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి చరిత్రను తానూ బయటపెడతానంటూ ఓ వీడియో విడుదల చేశారు.
దీంతో విజయసాయి రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి మద్యం కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోతాన్నీ బయటపెడతానంటూ ట్వీట్ చేశారు. గతంలో సంగతి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం వజియసాయి రెడ్డి విజల్ బ్లోయర్ గానే పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసారి నోరు విప్పితే.. జగన్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ ససాక్ష్యాలతో బయటకు రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-new-imbodiment-whistle-bloyer-39-196706.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.