Publish Date:Jan 25, 2025
విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. విజయసారిరెడ్డి ఇంత హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటన్నదానిపైనే రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం అంటున్నారన్న వాదన బలం పుంజుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే పలువురు తెలుగుదేశం నేతలు విజయసాయిరెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసుల నుంచి తప్పించుకోజాలరని అంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజీనామా చేసి, రాజకీయాలనుంచి వైదొలగినంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనీ, విజయసాయి చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇక్కట్లు, విశాఖలో జరిగిన విధ్వంసం, దాడులు అందరికీ తెలుసునన్న గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే విజయసాయి రాజీనామాతో ఒక విషయం మాత్రం ప్రస్ఫుటమైందనీ, వైసీపీ అనేది మునిగిపోయే నావ అన్నది తేటతెల్లమైందని గంటా అన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అన్న విషయం తాను ఎప్పుడో చెప్పాననీ, ఇప్పుడది నిజం కాబోతోందని పేర్కొన్నారు.
ఇక అమరావతి బహుజన సమాఖ్య అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అయితే విజయసాయిని ఒక మాయల ఫకీరుగా అభివర్ణించారు. ఆయన ఏదైనా చేయగలరు, ఎవరినైనా నమ్మించగలరని పేర్కొన్నారు. విజయసాయి రాజీనామాను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన నేపథ్యంలో శనివారం (జనవరి 25) మీడియాతో మాట్లాడిన బాలకోటయ్య.. ఏదో బోధి వృక్షం కింద జ్ణానోదయం అయ్యింది అనుకోవడానికి విజయసాయి బుద్ధుడు కాదన్నారు. ఇక తన భవిష్యత్ వ్యవసాయమే అని విజయసాయి చెప్పడాన్ని కూడా బాలకోటయ్య ఎద్దేవా చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి విదేయుడైన ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయికి వ్యవసాయం అంటే ఏం తెలుసునని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పార్టీలోనూ, ఆయన కేసుల్లోనూ కూడా ఏ2గా ఉన్న విజయసాయి వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తనంతటి వాడు లేడని విర్రవీగి, అధికారం పోగానే పలాయనం చిత్తగించటం విజయసాయి నైజమని విమర్శించారు. ఆయన రాజకీయ సన్యాసం అనడం వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్నంత మాత్రాని చట్టం నుంచి తప్పించుకోగలననుకోవడం విజయసాయి భ్రమ మాత్రమేనని బాలకోటయ్య అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-mayalaphakir-39-191845.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.