విజయసాయికి చేయడానికి పనేది?

Publish Date:Jun 9, 2023

Advertisement

విజయసాయి రెడ్డి.. చాలా కాలం తరువాత అమరావతిలో  వైపీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలే ఇప్పడు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ సర్కిల్స్ లోనూ ఓ రేంజ్ లో  చర్చకు తావిచ్చాయి. అంతే కాదు.. విజయసాయి నిజం చెప్పేశారంటూ సోషల్ మీడియాలో ఆయన మాటలు తెగ ట్రోల్ అవుతున్నాయి. ఇంతకీ విజయసాయి కొత్తగా ఏమీ చెప్పలేదు.

 రెండు రోజుల కిందట కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు ఏం చేప్పారో.. విజయసాయి ఇప్పుడు అదే విషయాన్ని అనుబంధ సంఘాలకు చెప్పారు. నాలుగేళ్లుగా రిలాక్స్ డ్ గా ఉన్నారు. పని చేయకుండా పబ్బం గడిపేసుకున్నారు. ఇక ఈ తొమ్మిది నెలలైనా పని చేయండంటూ విజయసాయి అనుబంధ సంఘాల సమావేశంలో చెప్పారు.  బలే కోయిన్సిడెన్స్ అంటూ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వమే కాదు.. పార్టీ, పార్టీ అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఈ నాలుగేళ్లు అధికారం, పెత్తనం చెలాయించేస్తూ గడిపేశారనీ, ఇక ఎన్నికలకు తొమ్మిది నెలలో మిగిలి ఉండటంతో పని చేయండ అని మంత్రులను సీఎం బతిమలాడుకుంటుంటే.. విజయసాయి తాను ఇన్ చార్జ్ గా ఉన్న పార్టీ అనుబంధ సంఘాలను బతిమలాడుకుంటున్నారు. ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు.. ఇక నుంచి 24 గంటలూ పార్టీ కోసం పని చేయాలని ఆయన వైసీపీ విద్యార్థి, యువత, మహిళా విభాగాలకు దిశా నిర్దేశం చేశారు.  

విజయసాయి అంటే ఇటీవల అయితే పార్టీలో అనామకుడిగా మిగిలిపోయారు కానీ, వైసీపీ ఆవిర్బావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన నేత. సలహాదారు అన్న పదవి లేదు కానీ, ప్రస్తుతం సజ్జల అనుభవించిన హోదాను, ఆధిపత్యాన్నీ పార్టీలో విజయసాయి అనుభవించారు. ఆయన మాటే వేదవాక్కుగా పార్టీ పై నుంచి కింది వరకూ అందరూ శిరసావహించేవారు. అలాంటి విజయసాయికి పదవులన్నీ పీకేసి కేవలం అనుబంధ సంఘాల ఇన్ చార్జి పదవిని నామమాత్రంగా మిగిల్చింది పార్టీ. మళ్లీ ఇక్కడ కూడా ఆయన అధికారాలు అంతంత మాత్రమే. పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జ్ లందరూ సజ్జల కంట్రోల్ లో ఉంటారు.

ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను ఈ అనుబంధ సంఘాలకు సంబంధం లేకుండా సజ్జల కుమారుడు మానిటర్ చేస్తున్నారు. అంటే అలంకారప్రాయమైన పదవిలో ఉన్న విజయసాయి.. అనుబంధ సంఘాల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఇంత కాలం రిలాక్స్ అయ్యింది చాలు ఇక పని చేయండంటూ దిశానిర్దేశం చేయడం వెనుక ఆయన ఉద్దేశమేమిటని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను సజ్జల కుమారుడి చేతికి పార్టీ అధినేత అప్పగించిన తరువాత పార్టీలో విజయసాయికి పనే లేకుండా పోయింది. ఇంత కాలం ఆయన హస్తినకు పరిమితమై.. మౌనాన్ని ఆశ్రయించారు.

చంద్రబాబు జన్మదినానికి ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం, మెడీని పొగుడుతూ పోస్టులు పెట్టడం వినా ఆయన ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కనిపించలేదు కూడా. ఇప్పుడు హఠాత్తుగా అమరావతిలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం పార్టీ వర్గాలనే విస్మయపరిచినట్లుంది. చేయడానికి పార్టీలో ఆయనకే ఏ పనీ లేదు.. ఇక ఆయన చెబితే అనుబంధ సంఘాలు వింటాయా? ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వైసీసీ వర్గాలలోనే  వ్యక్తమౌతున్నాయి.  

By
en-us Political News

  
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.