విజయమ్మ.. జగన్.. మధ్యలో సజ్జల!?

Publish Date:Jun 8, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి తల్లి విజయమ్మ  బుధవారం (జూన్ 7) అమరావతిలోని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. కుమారుడి ఇంటి వైపు కనీసం కన్నెత్తి చూడకుండా విజయమ్మ సజ్జల నివాసానికి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అ యితే వైయస్ విజయమ్మ  సజ్జల నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. అయితే  సాక్షాత్తూ ముఖ్యమంత్రి తల్లి అయిన విజయమ్మ స్వయంగా కుమారుడి కింద పని చేసే ఉద్యోగి లాంటి సజ్జల నివాసానికి వెళ్లడం తల్లీ కుమారుల మధ్య విభేదాలున్నాయనీ, కనీసం రాకపోకలు కూడా లేవని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అయ్యింది.

అయినా వాస్తవానికి విజయమ్మ స్థాయికి ఆమె కాకితో కబురంపితే రెక్కలు కట్టుకుని వాలిపోవాల్సిన స్థాయి సజ్జలది. అయితే  విజయమ్మే స్వయంగా సజ్జల నివాసానికి వెళ్లడమేమిటన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.   దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి,  ప్రస్తుత సీఎం  జగన్‌ తల్లి, అధికార వైపీసీ మాజీ  గౌరవ అధ్యక్షురాలు అయిన  ఆమె.. సజ్జల ఇంటికి వెళ్లడం.. ఆ సమయంలో సజ్జల లేకపోవడం.. మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయమ్మని అవమానపరచడమేనని వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ముందస్తుగా సజ్జలకు సమాచారం ఇచ్చే.. హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారని.. అలాంటి ఆమెను.. ఇలా అగౌరవపరచడం సజ్జల అహంకారం తప్ప మరోటి కాదని అంటున్నారు.  అయినా మహానేత భార్య  వైయస్ విజయమ్మ.. ఎందుకు సజ్జల ఇంటికి వెళ్లారనే అంశంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.  

అయితే అమరావతి వరకూ.. అదీ సజ్జల ఇంటి వరకు వెళ్లిన ఆమె... ఆ పక్కనే తాడేపల్లిలో ఉన్న తన కుమారుడు, సీఎం జగన్ ఇంటికి వెళ్లక పోవడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  జగన్ అధికార పీఠంపై కూర్చొబెట్టేందుకు తల్లిగా విజయమ్మ, చెల్లిగా  షర్మిల.. ఎంతగా కష్టపడాలలో అంతగా కష్టపడ్డారని.. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ వీరిద్దరినీ జగన్ దూరం పెట్టారని కూడా ఈ  సందర్భంగా  పరిశీలకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ ఫ్యామిలీలో వరుసగా చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. 

మరోవైపు వైయస్ జగన్ సొంత చిన్నాన్న  వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురై.. నాలుగేళ్ల దాటిపోయిందని... ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాత్రం ప్రధాన నిందితులంటూ కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఆ క్రమంలో వైయస్ భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం..  అవినాష్ రెడ్డి అయితే కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందడం.. తదితర అంశాలను ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇంకోవైపు తన తండ్రి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలంటూ  వివేకా కుమార్తె వైయస్ సునీత  వైయస్ అవినాష్ రెడ్డి పొందిన ముందస్తు బెయిల్  ను సవాల్ చేస్తూ మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిస్థితులలో జగన్ తల్లి విజయమ్మ కుమారుడిని కనీసం పలకరించకుండా.. ఆ పక్కను ఉన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు నివాసానికి వెళ్లడం వెనుక ఏదో గట్టి కారణమే ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

అదీకాక వైయస్ జగన్, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు  సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారం   చేస్తున్నారనే ఓ చర్చ  వైసీపీ వర్గాల్లో  హల్ చల్ చేస్తోంది.  దీంతో విజయమ్మ.. సజ్జలతో ఏ అంశాలపై చర్చించేందుకు  ఆయన నివాసానికి వైయస్ విజయమ్మ వెళ్లి ఉంటారన్న విషయంపై పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

By
en-us Political News

  
చెట్టు పడిపోతే కోతులు తలో వైపుకు చెదిరిపోతాయి. ఇది చైనా సామెత. ఈదురు గాలులు వీచి చెట్టు పడిపోయే  స్థితిలో కూడా కోతులు చెదిరిపోవడానికి ప్రయత్నిస్థాయి. ఎపిలో త్రికూటమి పోటీతో వైసీపీ చెట్టు కూలిపోవడం ఖాయమని తేలిపోయింది
హైదరాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవీలతకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైంది. నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తూ, ఆ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్న ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో బీజీపీ హై కమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.
రాజ‌కీయాల్లో అత్యంత సౌమ్యుడిగా పేరున్న వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌ వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి గత ఎన్నికలలో బాగా క‌లిసొచ్చింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో దుండ‌గులు వివేకానంద రెడ్డిని గొడ్డ‌లితో అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌టంతో, వివేకాను హ‌త్య‌చేయించింది అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడేన‌ని విస్తృతం ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ బ్యాచ్.
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు. ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు.
అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌.. అధికారం కోల్పోయిన త‌రువాత పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు.
ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి.
గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు.
పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్దకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు.
ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది
ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.
బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.