మాయాబజార్ ఎస్వీఆర్ స్టైల్ లో విజయసాయి 'పవర్ పంచ్'

Publish Date:Apr 21, 2020

Advertisement

*కమలానికి అసమదీయులెవరో, తసమదీయులెవరో తెలుసుకోవాలంటూ ఆ పార్టీ కి ఝలక్ 
*ఏపీ బీజెపీ ఇంకా చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు 

మాయాబజార్ సినిమాలో ఘటోత్కచ పాత్రధారి చేత కథారచయిత ఒక అద్భుతమైన ప్రయోగం చేయిస్తాడు... "ఎవరు పుట్టించకపోతే, కొత్త పదాలెలా పుట్టుకొస్తాయి," అంటూ ఘటోత్కచ పాత్రధారి ఎస్ వీ రంగారావు చేత ఒక సందర్భోచిత వ్యాఖ్యానం చేయిస్తాడు.. రాక్షస భృత్యులు అసస్మదీయులు అనటానికి బదులుగా అసమదీయులు అనటం, దానికి విరుద్ధ పదం గా 'తసమదీయులు' అనే కొత్త పదం సృష్టించటాన్ని అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి ఆడియెన్స్ కూడా పరిపూర్ణంగా ఆస్వాదించారు, ఆస్వాదిస్తున్నారు. అంతటి మహత్తరమైన లెగసీ ని క్యారీ ఫార్వార్డ్ చేయటానికి, ఎస్ వీ రంగారావు స్ఫూర్తిగా, వైఎస్ ఆర్ సి పీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి నడుం బిగించారు.  తెలుగు ప్రజానీకానికి కావాల్సినంత స్టఫ్ అందించే క్రమంలో, ఆయన కూడా ఎస్ వీ రంగారావు మాదిరి కొత్త పదాలు పుట్టిస్తున్నారు, పొలిటికల్ పార్టీలను కన్ఫ్యూజ్ చేయటానికి.... 

తాజాగా ఆయన కనిపెట్టిన పదం..తెలుగు జాకాల్స్ పార్టీ ( టీ జె పీ)...అంటే, దాని భాష్యం ఏమిటంటే..తెలుగుదేశం లో నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు పంపగా వచ్చి చేరిన వారి తో కలిసి (సుజనా చౌదరి, టీ జె వెంకటేష్, సి ఎం రమేష్ బోటివారన్న మాట) , బీ జె పి కాస్తా టీ జె పీ అయిందన్న మాట. ఇలాంటి ఒక కొత్త పదం పుట్టించిన విజయసాయి రెడ్డి, అభియోగమల్ల ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ ( ఈయన కూడా కాంగ్రెస్ నుంచి బీ జె పీ లోకి ఇంపోర్ట్ అయిన వారే) కు సుజనా ముడుపులిచ్చారనీ, ఆయన ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కోసం పని చేస్తూ పసలేని ఆరోపణలు చేస్తున్నారనీ... ఇంతకీ, దీనికి నేపధ్యమల్లా, సుజనా చౌదరికి, విజయసాయి రెడ్డి కి మధ్య నడుస్తున్న పవర్ వార్.. ఢిల్లీ లాబీల్లో గడిచిన ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి నిర్మించుకున్న 'పవర్ లాబీ' సామ్రాజ్యానికి, అలాగే బీ జె పీ హెడ్ క్వార్ట్రర్స్ తో ఆయనకున్న అవినాభావ సంబంధానికి , సుజనా చౌదరి పని కట్టుకుని గండి కొడుతున్నారని విజయ్ సాయి రెడ్డి అనుమానం, నమ్మకం కూడా. అందుకనే, ఆయన సుజనా చౌదరి ఆర్ధిక అవకతవకలపైన రాష్ట్రపతికి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూ లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయటం మొదలెట్టి, సుజనా చౌదరి ని ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలెట్టారు. 

ఇది తట్టుకోలేని సుజనా చౌదరి, సహజంగానే, ప్రతి వ్యూహం సిద్ధం చేసి, కన్నా లక్ష్మీ నారాయణ ను తన క్యాంప్ వైపు లాక్కోవటం మొదలెట్టారు. కన్నా కూడా విధి లేని పరిస్థితుల్లో సుజనా కు దగ్గరవడం, ఎలాగూ పోయే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ని నిలుపుకోవటం కోసం సుజనా ద్వారా లాబీ చేయించుకోవాలని చూడడటం వంటి కారణాలు, విజయసాయి రెడ్డి -సుజనా క్యాంప్ ని టార్గెట్ చేయటానికి కారణమయ్యాయి. 

ఇప్పుడు విజయసాయి వ్యూహమల్లా ఒకటే... అసలు సిసలు బీ జె పీ వారు ఎవరైనా ఆరోపణలు చేస్తే, సమాధానం ఇవ్వటానికి తాను సిద్ధమేనని, టీ డీ పీ నుంచి దిగుమతి అయిన సుజనా లాంటి ఆర్ధిక నేరగాళ్లు చేసే ఆరోపణలకు, అలాగే కన్నా లక్ష్మీనారాయణ లాంటి అవినీతిపరులు చేసే ఆరోపణలకు తానూ జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ- బీ జె పి హెడ్ క్వార్ట్రర్స్ నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఏతా వాతా, ఏపీ బీ జె పీ ఇంకా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే నడుస్తోందనే మెసేజ్ ను ఆయన నేరుగా ఢిల్లీ అశోకా రోడ్ లోని కమలదళాధినేతలకు పంపేశారు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని అప్లై చేయటం ద్వారా , ఆయన ఢిల్లీ కమలదళానికి, రాష్ట్ర బీ జె పీ కి మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నాన్ని సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర బీ జె పీ లో అసమదీయులెవరో, తసమదీయులెవరో తేల్చుకోవాలంటూ , మాయాబజార్ లో ఎస్ వీ ఆర్ స్టైల్ లో విజయసాయి విసిరిన పవర్ పంచ్ పై ఇప్పుడు -బీ జె పీ లో సుదీర్ఘ చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.