విజయసాయి కనుసన్నల్లో విశాఖ.. సార్ పిలిచారంటే చాలు!!

Publish Date:Feb 1, 2020

Advertisement

ఎందుకో తెలియదు వైసీపీకి విశాఖ అంటే ప్రత్యేక ఆసక్తి. అందుకేనేమో! సీఎం జగన్ కు కీలక సహచరుడు ఇంకా చెప్పాలంటే అత్యంత విశ్వసనీయుడైన విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి రాకముందు ఒకటి రెండేళ్ల ముందు నుంచి సాయిరెడ్డి విశాఖను తన రెండో ఇల్లుగా మార్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశాఖను దత్తతకు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. అధికార యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుంది. విజయసాయిరెడ్డి నెలకు కనీసం రెండు మూడు సార్లయినా నగరంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిపైనా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షిస్తుంటారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా ప్రభుత్వ అతిథి గృహానికి పిలిపించుకుని కీలక అంశాలపై చర్చిస్తుంటారు. ఒక్కోసారి తన ఇంటికి కూడా పిలిపించుకుంటారు, ఇలా ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాల్లో జిల్లా ఇన్ చార్జి మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఎవరూ పాల్గొనరు.వారికి కనీస సమాచారం కూడా ఉండదు, ఇలాంటి రహస్య భేటీలో ఎక్కువగా భూములకు సంబంధించిన అంశాలపైనే చర్చిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

విజయసాయిరెడ్డి విశాఖ జిల్లాకు వైసీపీ ఇన్ చార్జ్, ఆ హోదాతో ఆయన పార్టీ కార్యక్రమాలపై సమీక్షించవచ్చు, ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలపై సమీక్షించే అధికారం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. అయినా సరే సార్ పిలిచారంటే చాలు ఐఏఎస్, ఐపిఎస్ లు రెక్కలు కట్టుకొని వాలి పోవాల్సిందే. ఇక కలెక్టరేట్ లో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో సాయిరెడ్డి మధ్యలో కూర్చుంటారు. కలెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరూ ఆయనకే అన్ని వివరాలూ చెబుతారు. విశాఖ జిల్లాలో మంత్రుల కంటే ఆయనే పవర్ ఫుల్, ఆయన అపాయింట్ మెంట్ కూడా ప్రముఖులకే లభిస్తుంది. తాము హాల్లో కూర్చుని వెనక్కి రావాల్సిందే తప్ప ఆయనను కలిసే భాగ్యం దక్కదని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతుంటారు. నిజానికి పార్టీ ఇన్ చార్జి గా ఆయన వైసీపీ కార్యకర్తలు, నేతలకే ఎక్కువగా అందుబాటులో ఉండాలి కానీ, అధికారిక సమీక్షల పైనే అధికంగా దృష్టి సారిస్తుంటారు.

ఇక సాయిరెడ్డి విశాఖ నగరంలోకి వచ్చారంటే చాలు పోలీస్ కమిషనరేట్ లోని ఒక అధికారి పూర్తిగా ఆయన సేవలోనే ఉంటారు. సీతమ్మధారలో ఎంపీ తీసుకున్న నివాసంలోనే మకాం వేస్తారు. సాయిరెడ్డి తిరిగి వెళ్లేదాకా అదే డ్యూటీ. ముందే చెప్పినట్లు సాయిరెడ్డికి విశాఖ పైన ప్రత్యేక ఆసక్తి, రాజ్యసభ సభ్యుడిగా విశాఖనే దత్తత తీసుకున్నారు. మరెక్కడా కాకుండా ఇక్కడే ప్రగతి భారతి పేరిట ఒక సేవా ట్రస్ట్ ను స్థాపించారు. అధికారంలోకి రాగానే ఏర్పాటైన ఈ ట్రస్టుకు విశాఖ నగరంలోని ప్రముఖులు వ్యాపారులు పోటీలు పడి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. విశాఖ లోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ ట్రస్టుకు నిధులు ఇవ్వాలని సాయి రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లాకు గతంలో మోపిదేవి వెంకట రమణ ఇన్ చార్జి మంత్రిగా ఉండేవారు. మూడు నెలల క్రితమే ఆయనను మార్చి కన్నబాబును నియమించారు.

ఇక్కడ సాయిరెడ్డి అన్ని వ్యవహారాలూ చూసుకోవడంతో ఇన్ చార్జి మంత్రి విశాఖ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని చెబుతారు. ఇటీవల సాయిరెడ్డి విశాఖకు వచ్చారు, నెలకు రెండు మూడు సార్లు వస్తూనే ఉంటారు కదా ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా ఖచ్చితంగా ఉంది. ఈ సారి కొందరు న్యాయ నిపుణులతో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సిరిపురంలోని ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లారు. ఐఏఎస్ అధికారులు వినయ్ చంద్ సృజన కోటేశ్వరరావులను పిలుపించుకున్నారు. ఈ అతిథి గృహానికి ఎదురుగా ఉన్న వాల్తేరు క్లబ్, పక్కనున్న దస్పల్లా భూముల పైనే చర్చ జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం ఇతరుల స్వాధీనంలో ఉన్న ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.

విశాఖలో అగ్రశ్రేణి వాల్తేర్ క్లబ్ లీజుకు తీసుకున్న స్థలంలోనే నడుస్తోంది. ఆ భూముల వారసులు వాటిని విక్రయించాలనే యోచనలో ఉన్నారు. క్లబ్ ను ఖాళీ చేయాలని కోరగా కార్య వర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అలాగే దసపల్లా భూములు కూడా చేతులు మారి న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ భూములపై ఐఏఎస్ అధికారులతో సాయిరెడ్డి ప్రత్యేకంగా చర్చించడం సంచలనం సృష్టించింది. అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకుని న్యాయ నిపుణుల సలహాలతో వాటిని కోరుకున్న వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. తిరిగి వెళ్తూ రెండు అట్టపెట్టెల్లో ఫైళ్లు కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఏదేమైనా విజయసాయి తీరు విశాఖ లోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

By
en-us Political News

  
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.