Publish Date:Sep 17, 2020
సాక్షాత్తు పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమరావతి భూములకు సంబంధించి ఏర్పాటైన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం పై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే రాజ్యసభలో ప్రసంగించారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు. అంతేకాకుండా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని న్యాయ వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా అయన డిమాండ్ చేశారు. తను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అయితే న్యాయస్థానాలు మాత్రం మీడియా నోరు నొక్కుతున్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మీడియాలో, సోషల్ మీడియాలో రాకుండా హైకోర్టు ఆదేశాలివ్వడమే.
అయితే న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ మీడియా గొంతు నొక్కిందని వైసీపీ నేతలు అంటున్నారని ఐతే వివేకా హత్య కేసులో విచారణ అంశాలు మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్న విషయం వారు మరిచిపోయారా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు జడ్జిలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని.. అలాగే కోర్టులను కూడా బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీనికోసం న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసైనా.. తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసిపి పై మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-sai-reddy-sensational-comments-on-ap-high-court-25-104165.html
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
దెందులూరులో మరోసారి వైసిపి గుండాల అరాచకం
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి,
బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.