ఎన్టీఆర్ తరువాత విజయే!

Publish Date:May 4, 2026

Advertisement

సినిమాల్లో అగ్రహీరోగా రాణించి.. రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రావడమనేది సాధారణ విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తలపండిన నేతలకు ధీటుగా నిలబడి.. ప్రచారాలు చేసి, పార్టీని అధికారంలో నిలబెట్టిన ఘనత ఆనాటి నందమూరి తారకరామారావుకే చెందుతుంది. ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనం.

భారత రాజకీయ చరిత్రలో సినీ గ్లామర్‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెండితెర వేల్పులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాకపోయినా, అడుగుపెట్టిన తొలి ప్రయత్నంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది మాత్రం ఒక అద్భుతం. నాడు ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు  సృష్టించిన ఆ ప్రభంజనాన్ని, నాలుగు దశాబ్దాల తర్వాత నేడు తమిళనాడులో నటుడు విజయ్ పునరావృతం చేశారు.  

తమిళనాడు రాజకీయ యవనికపై  నూతన శకం ఆరంభమైంది.   ఐదు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే సాగుతున్న అధికార మార్పిడికి చెక్ పెడుతూ.. దళపతి విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం  అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని దక్కించుకుని  రికార్డు సృష్టించారు.  ఆ  తరువాత విజయ్ కూడా అలాగే పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే  తమిళ గడ్డపై రాజకీయ ప్రభంజనాన్నిసృష్టించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుండి టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం ఈ విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు పోటీ చేసిన స్థానాల్లో సైతం టీవీకే అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించడం గమనార్హం.  

విజయ్ తన ప్రచారంలో చాటిన  సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన నినాదాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును విజయ్ చీల్చడమే కాకుండా,  తటస్థ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో   సఫలీకృతమయ్యారని ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.  
సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్, జయలలిత వారసత్వాన్ని విజయ్ కొనసాగిస్తున్నారని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, గత నేతల కంటే భిన్నంగా విజయ్ ఆధునిక రాజకీయ పోకడలను, టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు చేరువయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు..  మార్పు కోరుకునే ఓటర్లందరూ టీవీకే గుర్తుకే ఓటు వేశారని ఈ ఫలితాలు విస్పష్టంగా చెబుతున్నాయి. 

ఈ విజయం కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా..  దక్షిణాది రాజకీయాల్లోనే ఒక పెద్ద మార్పుగా భావించవచ్చు. ప్రాంతీయ పార్టీల బలం తగ్గుతున్న తరుణంలో..  ఒక కొత్త ప్రాంతీయ పార్టీ ఈ స్థాయి విజయం సాధించడం ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా చర్చనీయాంశంగా మారింది.  టీవీకే విజయంతో ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  ఎన్టీఆర్ తర్వాత అంతటి వేగంతో అధికారాన్ని అందుకున్న నాయకుడిగా విజయ్ పేరు చరిత్రలో నిలిచిపోనుందంటున్నారు.  

ఎన్టీఆర్ తరువాత విజయ్ కు ముందు రాజకీయ పార్టీలు పెట్టి ప్రత్యక్ష ఎన్నికలలో నిలబడిన సినీ తారలు చాలా మందే ఉన్నారు. అయితే వారెవరూ కూడా విజయ్ లా విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు.   2005లో పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో పోటీ చేసిన నటుడు విజయ్ కాంత్.. ఆ ఎన్నికలలో ఆక్ష్న ఒక్కరే గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేత స్థాయికి ఎదిగినా అధికారానికి దూరంగానే ఉండిపోయారు. ఆ తరువాత చిరంజీవి 2009లో భారీ అంచనాలతో ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు.  ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 18 సీట్లు గెలుచుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోలేక చివరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

 ఆ తరువాత 2014లో పవన్ కల్యాణ్ పార్టీ పెట్ట.. , 2019లో తొలిసారి పోటీ చేస్తే కేవలం ఒక్క సీటుకే పరిమితమయ్యారు. అయితే ఆ తరువాత 2024 ఎన్నికలలో   100% స్ట్రైక్ రేట్‌తో  పోటీ చేసిన 21 స్థానాలలోనూ పార్టీని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.  ఇక 2018 కమల్ హసన్ సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించిన.. ఇంత వరకూ జరిగిన ఎన్నికలలో  ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. 

అయితే విజయం మాత్రం 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి.. రెండేళ్లలోనే అంటే 2026 అసెంబ్లీ ఎన్నికలలో  105కుపైగా స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టనున్నారు.  దీంతో ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి కాబోతున్న స్టార్ హీరోగా విజయ్ చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. 

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.