డీఎంకే ఓటమి.. అసలేం జరిగింది?

Publish Date:May 4, 2026

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్నాళ్లుగా తిరుగులేని శక్తిగా కనిపించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే   కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటూ ఇచ్చిన తీర్పు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టాలిన్ స్పీడుకు ఓటర్లు బ్రేకులు వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఎన్నికల ఫలితాల్లో  విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.   ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, శాంతి భద్రతల సమస్య,  అవినీతి ఆరోపణలు పాలక పక్షాన్ని చావుదెబ్బ తీశాయి. ఫలితాల సరళిని గమనిస్తే, యువత,  మహిళా ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పునిచ్చినట్లు స్పష్టమవుతోంది.  

 స్టాలిన్ హయాంలో తమిళనాడు ప్రగతి సాధారణమైనది కాదు. ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధి విషయంలో స్టాలిన్ గణనీయమైన పురోగతి సాధించారు.   ఆయన హయాంలో సుమారు  రాష్ట్రం 9% జీడీపీతో   భారతదేశంలోనే రెండవ  స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో ఐటీ రంగం, అలాగే ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల విషయంలో కూడా గణనీయమైన అభివృద్ధి నమోదైంది. అయినప్పటికీ..  ఇవేవీ డీఎంకే పరాజయాన్ని నిలువరించలేకపోయాయి.   

రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేసిన దానికంటే భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని ఈ ఫలితాలు నిరూపించాయి. స్టాలిన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చాయి.  నిత్యావసర ధరల పెరుగుదల మరియు నిరుద్యోగ సమస్య కూడా డీఎంకే ఓటమిలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది.

స్టాలిన్ వ్యక్తిగత ఇమేజ్ బాగున్నప్పటికీ, పార్టీలోని ఇతర నేతల వైఖరి పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేశాయి. గెలుపుపై ధీమాతో ఉన్న డీఎంకే శ్రేణులకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.  

గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్, ఈ ఐదేళ్ల కాలంలో తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వారసత్వ రాజకీయాలనే విమర్శలు, కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందనే ఆరోపణలు కూడా ఆయనపై ప్రతికూల ప్రభావం చూపాయి. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా అధికారాన్ని ఇవ్వరనే సాంప్రదాయాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు.  

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.