కడప బిడ్డను విస్మరించిన కడప బిడ్డ

Publish Date:Jan 27, 2022

Advertisement

పాత సమస్యలు దారి మళ్లించేందుకు రోజుకో కొత్త ఇష్యూ చొప్పున క్రియేట్ చేస్తున్న ఆంధ్రా సీఎం జగన్... తాజాగా మరో వివాదానికి కారణమయ్యారు. కొత్త జిల్లాల పేరుతో ప్రజల్ని కాస్తో కూస్తో ఊరడిద్దాం అనుకుంటున్న జగన్ కు ఊహించని కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీకి  అద్భుతమైన పేరు-ప్రఖ్యాతులు రావడంలో, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటడంలో, అనేక సాంఘిక దురాచారాలను, కులాల కుత్సితపు కట్టుబాట్లను, అగ్రవర్ణ దురహంకారాన్ని తీవ్రంగా ఎండగట్టిన వీరబ్రహ్మేంద్రస్వామికి కొత్త జిల్లాల్లో చోటే దక్కకపోవడంపై ఆంధ్రా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు, ఆచరణల్లో ఎంతో పారదర్శకత, ఎంతో సామాజిక శ్రేయోకాంక్ష మాత్రమే గాక సర్వమానవాళికి వినిపించిన ఆయన కాలజ్ఞానం తెలుగుప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామిని ఈ ప్రపంచం మరచిపోకుండా అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. దానికి టైటిల్ కూడా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర అంటూ ఆయన పట్ల ఎంతో భక్తిభావం చాటుకున్నారు. తెలుగునేలపై నడిచిన దైవంగా అన్నగారి అభిమానులు ఎన్టీఆర్ ను కీర్తిస్తున్నట్టే... వీరబ్రహ్మేంద్రస్వామిని సైతం తెలుగుప్రజలు అలాగే భావిస్తారు. 

అలాంటి ఎన్టీఆర్.. వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధకుడిగా మారిపోయి ఎంతో నియమ నిష్టలతో స్వామివారి చరిత్రను నభూతో, నభవిష్యత్ అన్న రీతిలో తెరక్కించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులూ తాను ఒంటిపూట భోజనం చేశానని, యోగాభ్యాసం చేశాననని, చాప మీదే శయనించి బ్రహ్మచర్యం పాటించానని, ఆ షూటింగ్ జరిగినన్ని రోజులూ తనను ఆ వీరబ్రహ్మేంద్రస్వామి ఆవహించినట్టుగానే ఉండేదని, ఏదో అద్భుత శక్తి తనను నడిపిస్తున్నట్టు, తనతో మాట్లాడిస్తున్నట్టు అనిపించేదని పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పుకొని ఎంతో  ఉప్పొంగిపోయారు. ఆ సినిమాను తన జీవిత లక్ష్యంగా కూడా చెప్పుకున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో గతంలో పలువురు సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పుడు వారికి అనుకోని సంఘటనలు ఎదురయ్యాయని, అనేక అవాంతరాలు కలిగాయని, సినిమా కోసం ముందుకొచ్చి వారెంతో నష్టపోయారంటూ తన శ్రేయోభిలాషులు హెచ్చరించారని చెప్పుకున్నారు. అయినా తానెంతో నిష్టగా ఆ సినిమాను చేయడం వల్ల సాక్షాత్తూ ఆ వీరబ్రహ్మేంద్రస్వామే అన్నీ ముందుండి చూసుకున్నాడని, అందువల్లే ఆ సినిమా హిట్టయ్యి తెలుగు ప్రజల్ని ఉర్రూతలూగించిందని చెప్పుకొని మురిసిపోయారు. ఇదంతా వీరబ్రహ్మేంద్రస్వామి పట్ల ఎన్టీఆర్ కు ఉండే భక్తిప్రపత్తులకు తార్కాణంగా చెప్పుకోవాలి. 

మరోవైపు ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న క్రమంలో ఫిబ్రవరి 26 వరకు ప్రజల అభిప్రాయాలు, సూచనలు కూడా వినేందుకంటూ నోటిఫికేషన్ వెలువరించారు. అయితే ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటును టీడీపీ శ్రేణులు, పలువురు ప్రముఖులు స్వాగతిస్తుండగా రాజకీయ నిపుణులు మాత్రం అందులోని జగన్ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు మంచిదే కానీ.. ఆయన దైవంగా భావించిన వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడాన్ని ఎలా సమర్థించుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఓట్ల రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో పలు ముఖ్యమైన సామాజికవర్గ సమీకరణల్ని దెబ్బ తీయడం కోసమే చేస్తున్నారు తప్ప.. చిత్తశుద్ధి ఏమాత్రం కనిపించడం లేదంటున్నారు. నిజంగా జగన్ కు చారిత్రక పురుషులపై అంతగా అభిమానం ఉంటే వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించేవాడే కాదంటున్నారు. ఆంధ్రాతో ఏ సంబంధం లేని తెలంగాణ కవి, గాయకుడు గోరటి వెంకన్న రాయలసీమ గొప్పతనాన్ని, అక్కడి చారిత్రక ఔన్నత్యాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. శ్రీరాములయ్య సినిమాలో... నను గన్న నా తల్లి రాయలసీమ, రతనానల సీమ అంటూ ఆ పాటలో వెంకన్న ఎంతో ఉద్వేగాన్ని మేళవించారు. రాయలసీమ కవిపుంగవులు కూడా ఇంత బాగా రాయలేరేమోనన్న అద్భుతమైన కితాబును వెంకన్న అందుకున్నారు. 

మరి రాయలసీమకు అందులోనూ బ్రహ్మంగారి మఠం వెలసిన కడప జిల్లాకు చెందిన జగన్.. వీరబ్రహ్మేంద్రస్వామిని విస్మరించడం ఏంటని ప్రజలంతా విస్తుపోతున్నారు. సామాజిక సంస్కరణ కోసం కులాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయిన వీరబ్రహ్మేంద్రస్వామి.. ఆనాడే కొందరు అగ్రకులస్తుల దురహంకారాన్ని భరించారు. వారిని తన మాటల ద్వారా, పాటల ద్వారా, బోధనల ద్వారా ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయినా నిజాలు గ్రహించలేని సందర్భాల్లో వారి కళ్లు తెరిపించడానికి అనేక మహిమలు కూడా చూపారు. తన మహిమల ద్వారా నవాబులను సైతం శిష్యులుగా చేసుకున్నారు. తన అకుంఠిత దీక్షతో, దైవీచింతనతో పెద్దసంఖ్యలో శిష్యగణాన్ని పెంపొందించుకున్నారు. కులాతీత, మతాతీత సహజీవనం కోసం ఎంతో శ్రమించారు. జీవసమాధి నిష్ట వహించేవరకు ఇదే ఓ వ్రతంగా కొనగించారు. 

అంతటి మహిమాన్వితుడు, తపస్సంపన్నుడూ అయిన వీరబ్రహ్మేంద్రస్వామి ప్రస్తావనే లేకుండా చేయడంలో జగన్ ఆంతర్యమేంటని, ఇది కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకమా తెలియజేయాలని, ఒకవేళ పొరపాటున వీరబ్రహ్మేంద్రస్వామి పేరు గనక మిస్సయితే వెంటనే సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి వచ్చే ఉగాది లోగా జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

- టి.రమేశ్ బాబు

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.
ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు.
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.