చంద్రబాబుకున్న మనోబలం.. వంశీకి లేదా?

Publish Date:Mar 27, 2025

Advertisement

జైల్లో గడపవలసి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారక్ లో ఒంటరి గా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష  అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసినవారిని ఇటువంటి సాలిటరీ సెల్ లలో ఉంచుతారు. అలాగే సెలబ్రిటీలు ఇతరులతో కలిపి ఉంచడం వలన వారికి ప్రమాదం ఉంటుందనే అనుమానం ఉంటే..  వాళ్ళను కూడా ఒక సెల్ లో ఒంటరిగా ఉంచుతారు. ప్రస్తుతం దళిత యువకుడు సత్యావర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ విధంగా సింగిల్ బ్యారెక్ లో ఒంటరిగా ఉంటున్నారు. సెల్ లో ఒక్కడినే ఉండలేకపోతున్నాను.. తనకు తోడుగా మరొక ఖైదీని ఉంచాలని  ఆయన కోర్టును పదేపదే వేడుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీకి నాయకుడిగా ప్రముఖ వ్యక్తి కావడం వలన ఆయన భద్రతా కారణాల దృష్ట్యా మరొక ఖైదీని అక్కడ ఉంచలేం అని జైలు అధికారులు చెప్పడంతో కోర్టు కూడా అనుమతించడం లేదు. రిమాండు పొడిగింపు కోసం న్యాయమూర్తి ఎదుటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జైల్లో తనకు తోడు కావాలని వంశీ అడగడం,  ఆ కోరిక నెరవేరకపోవడం జరుగుతూనే ఉంది. 

ఇదంతా నేపథ్యం అనుకుంటే.. ఇప్పుడు అసలు సంగతి ప్రస్తావించుకోవాలి! ముందే చెప్పుకున్నట్టు ఒక సెల్ లో ఒంటరిగా ఉండడం అనేది నిజంగానే కష్టం! అయితే అలా ఉండడానికి ఎంతో దృఢమైన మానసిక బలం ఉండాలి. ఒక టర్మ్ రిమాండ్ పూర్తి అయిన నాటి నుంచి తనకు తోడు కావాలని గోల ప్రారంభించిన  వంశీ ఇలాంటి మానసిక బలం విషయంలో చాలా వీక్ గా ఉన్నారని అనుకోవాల్సి వస్తోంది.

గతంలో జగన్ పాలనలో చంద్రబాబునాయుడడిని అరాచకంగా అరెస్టు చేసి.. చాలా దుర్మార్గమైన రీతిలో రోడ్డు మార్గంలో  తరలించి మొత్తానికి ఆయనను 53 రోజుల పాటు సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తనను అరెస్టు చేసిన ప్రభుత్వ అరాచకత్వాన్ని చంద్రబాబునాయుడు ప్రశ్నించారే తప్ప.. జైలులో తనకు తోడు కావాలని మొర పెట్టుకోలేదు. వయసు రీత్యా డెబ్భయ్యేళ్లు దాటిన చంద్రబాబునాయుడుకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను మాత్రం కోర్టు కల్పించింది. ఆ విషయానికి వస్తే.. వల్లభనేని వంశీ విన్నవించుకున్న తర్వాత.. ఆయనకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఇనుప మంచం ఇబ్బందికరంగా ఉందని అంటే.. పరుపు, దిండు కూడా ఏర్పాటు చేశారు. వాటి గురించి న్యాయమూర్తి ప్రత్యేకంగా ప్రశ్నించినప్పుడు.. అవన్నీ సౌకర్యంగానే ఉన్నాయని ఒప్పుకున్న వల్లభనేని వంశీ జైలు బ్యారెక్ లో తనకు ఒక తోడు కావాలని ఆరాటపడడమే ఆయన మానసిక దౌర్బల్యానికి నిదర్శనం. ఆ మాటకొస్తే 2014కు పూర్వం జగన్ జైలులో ఉన్నప్పుడు కూడా ఆయన బ్యారెక్ లో మరొకరు తోడు ఉన్నారు. 

కానీ.. చంద్రబాబునాయుడు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ.. తోడు అడగలేదనే సంగతిని గమనించాలి. ఆయన మానసిక దారుఢ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. నిజానికి చంద్రబాబు వయస్సు ఎక్కువ అయినప్పటికీ.. శారీరకంగా   చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన వయసు గురించి జగన్ హేళన చేసినప్పుడు.. ఇద్దరం కలిసి నడుద్దాం.. ఎవరు ఎక్కువ దూరం నడవగలరో కూడా చూద్దాం అంటూ చంద్రబాబు సవాలు చేశారు కూడా. చంద్రబాబుకు ఉండే మానసిక బలం.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలచుకోవడం, నిబ్బరంగా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధికి పదును పెట్టుకోవడం వంటి విషయాలను చంద్రబాబును చూసి వంశీ లాంటి నాయకులంతా నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

By
en-us Political News

  
వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది.
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి నాయకులు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో పట్టు బిగిస్తున్నారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా? అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆయనకు పోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పోనీ ఆయన పీఏకైనా సమాచారం ఇద్దామని భావించిన పోలీసులకు పీఏ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో చేసేదేం లేక కాకాణి నివాసానికి నోటీసులు అందించి వెనుదిరిగారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తున్నది. గత వారం అంతా భక్తుల రద్దీ కొనసాగింది.
 చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  ఈ విషయాన్ని  బీజాపూర్ ఎస్ పి  జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు
 ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు
 మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో  పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. 
పండుగ పూట  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం  చోటు చేసుకుంది.   ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు  ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి  గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.