Publish Date:Apr 23, 2022
అవును, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుత హోంశాఖ మంత్రి తానేటి వనిత మాటలను చూసి మనసులో తెగ సంబరపడిపోతున్నారట. ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనను మంత్రి మండలి నుంచి తప్పించి.. తన ప్లేస్లో వనితను హోంమంత్రిగా నియమించి సీఎం జగన్ ఎంత తప్పు చేశారో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిందని సుచరిత తన సన్నిహితుల దగ్గర సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రి పదవి రాలేదని తాను అలిగితే.. తనను బుజ్జగించకుండా పక్కనపెట్టేసి అవమానించారని.. తీవ్ర అసమనంతో, అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి సుచరితకు.. తాజా మంత్రి తానేటి వనిత వ్యవహారం కాస్త తృప్తిని, ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు. ఎందుకంటే...
ఇప్పుడు సోషల్ మీడియాకు హోంమంత్రి వనితనే ఫుల్ టార్గెట్. ఆమె వ్యాఖ్యలపై ఫుల్ ట్రోలింగ్ జరుగుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యాచార ఘటనపై హోంమంత్రిగా ఆమెకు కనీస అవగాహన కూడా లేకపోవడం.. అధికారులను ఆ వివరాలు అడిగి తెలుసుకుంటూ.. దొరికిపోవడంతో ఆమె ట్రోలర్స్కు, ప్రతిపక్షాలకు చేతి నిండా పని కల్పించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రి అత్యాచార ఘటన యావత్ తెలుగుజాతిని కలిచివేస్తే.. హోంమంత్రి తానేటి వనిత మాత్రం ఎలాంటి ప్రాధమిక సమాచారం లేకుండా మీడియా ముందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యారు. మీడియా మైక్లు ఆన్లో లేవనుకున్నారో ఏమో.. అత్యాచారం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఇవాళ డేట్ ఎంత? ఎప్పుడు అరెస్ట్ చేశారు? అంటూ అధికారులను సమాచారం అడిగి తెలుసుకోవడం.. అదికాస్తా రికార్డు కావడం.. ఆ వీడియో ఫుల్ వైరల్ కావడంతో ప్రభుత్వ పరువంతా పోయింది. హోంమంత్రిగా ఉండికూడా.. అంత ఘోరం జరిగితే కూడా.. కనీస సమాచారం లేకుండా ఎలా ఉంటారు? ఆమె హోంమంత్రిగా ఎలా పనికి వస్తారు? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు, ట్రోల్స్ నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వనీత తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ఇదంతా చూస్తూ.. మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం లోలోన తెగ ఖుషీ అవుతున్నారని ఆమె అనుచరులే అంటున్నారు. తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పని చేసే దానినని.. కొత్త మంత్రి ఇలా మినిమమ్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాట్లాడి.. ఇటు ప్రభుత్వ పరువు, అటు పార్టీ పరువు రెండూ మంటగలిపారని.. తనను కాదనుకున్నందుకు.. ఏరికోరి వనితను కేబినెట్లోకి తెచ్చిపెట్టుకున్నందుకు.. తగిన శాస్త్రి జరిగిందంటూ.. సుచరిత తెగ సంతోష పడుతున్నారని చెబుతున్నారు. తనను అవమానించినందుకే, తన కడుపుమంట ఇలా వారికి తగిలిందని శాపనార్థాలు కూడా పెడుతున్నారట మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vanitha-episode-become-hot-topic-in-ycp-25-134865.html
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభం కాకమునుపే హైదరాబాద్ లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయోనన్న ఆందోళన ఎక్కువైంది. ఎండలతో మండిపోతున్న హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షం చేదు అనుభవాన్ని మిగిల్చింది
తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.