చంద్రబాబు కేబినెట్ లోకి వంగవీటి రాధా!

Publish Date:Jun 18, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత తెలియంది కాదు. మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్యానంతరం ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ లోనూ, రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపించింది. 2014 ఎన్నికలలో కాపు సామాజిక వర్గం ఏకపక్షంగా తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేసింది. అప్పట్లో జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు కానీ తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి  జనసేన విడిగా పోటీ చేసింది. అలాగే తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు కూడా లేదు. జగన్ రెడ్డి ఒక్క చాన్స్ విజ్ణప్తి కారణంగా కాపు ఓట్లలో భారీగా చీలిక వచ్చింది. దీంతో జనసేన పార్టీ ఆ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  

ఇక 2024 ఎన్నికల సమయానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే కాపు సామాజి వర్గం మొగ్గు చూపింది. ఈ సామాజిక వర్గంలో పెద్ద తలకాయలుగా గుర్తింపు పొందిన ముద్రగడ వంటి వారి పిలుపును కూడా లెక్క చేయలేదు. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఏకతాటిపై నిలవడానికి జగన్ పాలనా వైఫల్యాలతో పాటు వంగవీటి అంశం కూడా ఒక ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. కాపు సామాజికవర్గంపై బలమైన ముద్ర ఉన్న వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా  బలంగా తెలుగుదేశం కూటమి పక్షాన నిలబడ్డారు. వైసీపీలో చేరాల్సిందిగా ఎన్ని ప్రలోభాలు వచ్చినప్పటికీ ఆయన ఖాతరు చేయలేదు. వంగవీటి రాధాను వైసీపీ గూటికి చేరడానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య వంగా హత్యకు ముందు నుంచీ ఉన్న వైరాన్ని దూరం చేసి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా కూటమి పక్షాన నిలిచేలా చేయడంలో వంగవీటి రాథా ఎంతో కృషి చేశారని తెలుగుధేశం అధినేత నారా చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు.  అందుకే తెలుగుదేశం కూటమి సర్కార్ లో ఆయనకు స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. చంద్రబాబు తన కేబినెట్ లో 24 మందికి మాత్రమే స్థానం కల్పించి మరో స్థానాన్ని ఖాళీగా ఉంచడం వెనుక కారణం అదేనని అంటున్నారు.  ఆ స్థానాన్ని వంగవీటి రాథాతో భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు.

ఇప్పుడు ఏపీలో  ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది. ఆ స్థానాలలో ఒక దాని నుంచి వంగవీటి రాధాను నిలబెట్టి గెలిపించుకుని కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే  కాపుసామాజిక వర్గానికి చెందిన నలుగురికి చంద్రబాబు స్థానం కల్పించారు. అయితే వంగవీటి రాధా విషయంలో సామాజిక సమీకరణాల జోలికి పోకుండా, కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేబినెట్ లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.