Publish Date:Jan 26, 2019
గణతంత్ర దినోత్సవం...సందర్భంగా
భారతీయులందరికీ తెలుగు వన్ చేసుకొనే విన్నపం...
ప్రతిరోజూ మన భారతదేశ జాతీయ గేయాన్ని పఠనం చేసుకుంటున్నాం...
దాని అర్ధం చాలా మందికి తెలియదు. అసలు వాటిలో అర్ధాలను సవివరంగా తెలియజేస్తే..
అందరూ మరెంతో ఆనందపరవశులవుతారని ఆశిస్తూ... వందేమాతర గీతం...గురించి తెలుసుకుందాం..
మన భారతదేశ జాతీయ గేయం వందేమాతరం... దీనిని బెంగాలీ రచయిత బంకించంద్రచటర్జీ రచించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాలీలో ఈయన రచించిన గేయం...రణన్నినాదంగా ఎంతగానో ఉపయోగపడింది.
అందుకే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది మన భారత ప్రభుత్వం.
అందుకే గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వందేమాతరం గీతాలపన చేసి దాని అర్ధాలు తెలుసుకుందాం...
వందేమాతరం... భారత మాతా నీకు వందనం
సుజలాం సుఫలాం ... గల గల పారే ప్రవాహాలతో
మలయజ శీతలాం... మలయ మారుతముల చల్లని గాలులతో
సస్య శ్యామలాం మాతరమ్... సస్యశ్యామల మైన దేశమా నీకు వందనాలు
||వందే||
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం... తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం... వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో
సుహాసినీం సుమధుర భాషిణీం... స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో
సుఖదాం వరదాం మాతరమ్... మాకు సుఖమును వరములను ఇచ్చు మాతా నీకు వందనం
|| వందే || ........................ భారత మాతా నీకు వందనం..
కోటికోటి కంఠ కలకల నినాదకరాలే ... కోటి కోటి కంఠముల నినాదములు
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే... అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేమి
అబలా కేయనో మా ఏతో బలే... అబలకు బలమిచ్చు శక్తిని
బహుబల ధారిణీం నమామి తారిణీం... బాహు శక్తులు ధరించిన మాతా
రిపుదలవారిణీం మాతరామ్... శత్రువు నుంచి మమ్ము రక్షించు మా తల్లీ నీకు వందనం
|| వందే || ......................................భారత మాతా నీకు వందనం...
తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ ... నీవే విద్యవు...నీవే ధర్మము... నీవే హృదయము...నీవే మర్మము...
త్వం హి ప్రాణాః శరీరే .... మా శరీరంలో ప్రాణమూ నీవే...
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి ... మాలో శక్తివి నీవే....మా మనస్సులో భక్తివి నీవే...
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే || వందే ||... మా హ్రుదయమందిరములో ప్రతిమవు నీవే...
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ... పది ఆయుధములు చేత బట్టిన దుర్గవి నీవే...
కమలా కమలదళ విహారిణీ... పద్మ ధళములందు విహరించే
లక్ష్మివినీవే...
వాణీ విద్యాదాయినీ... విద్యాధాత్రివైన శారదవు నీవే...
నమామి త్వాం... తల్లీ నీకు నమస్కారం.....
నమామి కమలామ్ అమలామ్ అతులాం... కమలా..అయలా....అతులా....
సుజలాం సుఫలాం మాతరమ్ ... సుజలా సుఫలా మాతా నీకు వందనం..
|| వందే ||.................. భారతమాతా నీకు వందనం..
శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం... శ్యామలా సరళా సుస్మితా అలంక్రుతా...
ధరణీం భరణీం మాతరం... మా భారము మోయు భారత మాతా నీకు వందనం...
ఇవండీ...మన వందేమాతర గీతం వివరాలు ..అర్ధమైందా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vande-mataram-national-song-in-telugu-39-85522.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.