Publish Date:May 21, 2023
ఎన్నికలు మళ్లీ వచ్చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా మళ్లీ గెలుపొందాలంటే.. పార్టీ అండ దండ కావాలి. అలా అయితేనే.. మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్షా.. అధ్యక్షా అనొచ్చు. కానీ గత ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ జిలానీ రాగం ఆలపించడంతో.. ఇప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నా.. ఎన్నికల నాటికి సీన్.. సితారా అయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్కు గట్టిగానే అర్థమైన్నట్లుందనే ఓ టాక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ క్రమంలో ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్కు ఆయన ఫ్యామిలీకి రాపాక వారు గట్టిగానే సోప్ వేస్తున్నట్లు ఆయన చర్యలు చూస్తే ఇట్టే అర్థమవుతోందనే చర్చ సైతం సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తన కుమారుడు వివాహ వేడుకను రాపాక వాడుకొంటున్నట్లుగా ఉందని తెలుస్తోంది. ఆ క్రమంలో తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రంపై మాకు దైవ సమానులైన మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ గార్ల ఆశీస్సులతో.. అంటూ వారి పొటోలను ముద్రించిన శుభలేఖ అటు మీడియాను ఇటు సోషల్ మీడియాను చూట్టేస్తోంది. అయితే ఈ పోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు..ఫ్యాన్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. జనసేన శ్రేణులు మాత్రం వ్యంగ్య బాణాలు సంధిస్తోంది.
ఎందుకంటే.. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోల్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఘన విజయం సాధించారు. అయితే ఇవే ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమి పాలైయ్యారు. దీంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు రాపాక.. దాంతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు.
తాను జనసేన సభ్యుడిగానే ఉంటానని.. అలా అయితే తన నెంబర్ 1 గా ఉంటుందని.. అదే జగన్ పార్టీలోకి వెళ్లితే.. తన నెంబర్ 152గా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా రాపాక ప్రకటించారు. అలా చెప్పిన కొద్ది రోజులకే రాపాక.. పార్టీ కండువా మార్చే చేశారు. ఆయన కుమారుడిని ముందుగా పార్టీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పారు. అలాగే పి.గన్నవరంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో సైతం ఆయన జగన్ పార్టీ కండువా కప్పుకొని.. వేదిక మీద ఆశీసునులు అయిన సంగతి తెలిసిందే.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజోలు నుంచి అధికార ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రాపాక సన్నాహాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఓ వేళ పార్టీ టికెట్ సీఎం జగన్ వలదన్నా... తన వంతు ప్రయత్నంగా ముందు చూపుతో రాపాక వ్యవహరిస్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా ఫ్యాన్ పార్టీలో జోరందుకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/values-dont-care-political--gain-enough-25-155697.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.