రెంటికీ చెడ్డ రేవడి వల్లభనేని వంశీమోహన్

Publish Date:May 12, 2022

Advertisement

 గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై వంశీ గెలిచినా.. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీలోకి వెళ్లితే.. తనకు అందలం దక్కుతుందని ఆయన భావించారు. కానీ అనుకున్నది ఒకటి అయింది మరొకటి. దీంతో తన సీన్ ఇంతలా సితారవుతుందని అనుకోలేదని వల్లభనేని వంశీ మధనపడుతున్నారట.

బుధవారం నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా   గడప గడపకు వైసీపీ   కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.  అయితే ఇది మా పార్టీ ఫ్యామిలీ పండగ.. మేం  మాత్రమే చేసుకుంటామంటూ   ఫ్యాన్ పార్టీ నేతలు దీర్ఘాలు తీస్తూ కండీషన్లు పెట్టి ఈ కార్యక్రమానికి వల్లభనేని వంశీని దూరం పెట్టేశారుట. దీంతో టీడీపీలో గెలిచి.. ఫ్యాన్ పార్టీలోకి జంప్ కొట్టిన వల్లభనేని వంశీకి ఆయన వర్గానికి అనుకోని విధంగా ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అంతే కాకుండా    నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వ్యతిరేకులు అంటే డాక్టర్ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు ఏక తాటిపైకి వచ్చి.. గడపగడపకూ కార్యక్రమం అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తూ.. నియోజకవర్గమంతటా  భారీగా ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు. దీంతో  చేసేదేమీ లేక వల్లభనేని వంశీ, ఆయన వర్గం నోటిపై వేలేసుకుని మరీ సైలెంట్ అయిపోయారట.  

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలో రావడంతో...  ప్రతిపక్షంలోని వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలకు .. నిధులు ఇచ్చి.. తననూ ప్రోత్సహిస్తారని వల్లభనేని వంశ ఆశించారట.    ఆ క్రమంలో తన  స్నేహితుడు, మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి.. టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగానే గళమెత్తారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన భార్య నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసి.. తానేమి కొడాలి నాని కంటే తక్కువ కాదనట్లు నిరూపించుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలన్నీ   తెలిసినవే. 

ఈ నేపథ్యంలో టీడీపీకి తనకు తానుగా దూరమైన వల్లభనేని వంశీని.. ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం కావాలని  దూరంగా పెట్టారట. ఆ క్రమంలోనే ఫ్యాన్ పార్టీలోని వంశీ వ్యతిరేక వర్గం.. ఏకంగా పార్టీలో కీలక నేత విజయసాయిరెడ్డికి కొండవీటి చాంతాడంత లేఖ రాసి మరీ వంశీకి గన్నవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఫ్యాన్ పార్టీ గెలుపు కష్టమవుతోందని వంశీకి కాకుండా ఎవరికి  అవకాశం ఇచ్చినా   తామంతా కష్టపడి మరీ పార్టీని గెలుపించుకొనేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారట. వల్లభనేని వంశి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారడానికి కారణమేమిటన్నదానికి 
మరోవైపు వల్లభనేని వంశీని అటు టీడీపీ వాళ్లు.. ఇటు వైసీపీ వాళ్లు ఎందుకిలా పగ పట్టారంటే మాత్రం.. గన్నవరం నియోజకవర్గంలో ఓ టాక్  జోరుగా వైరల్ అవుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలో గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ చాలా దూకుడుగా వ్యవహరించారట.  ఎలా అంటే నాటి ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు పెట్టించారట. అలాగే వారి ఆర్థిక మూలాలను సైతం ఆయన తీవ్రంగా దెబ్బ కొట్టారట. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలకు సైతం ఈ వల్లభనేని వంశీపై కన్నెర్రగా ఉందన్నదే ఆ టాక్.   అదీకాక రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగాలని భావిస్తుండగా.. మరో వైపు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు దుట్టా రామచంద్రరావు   అల్లుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వీరిద్దరు వ్యూహాత్మకంగా  అడుగులు వేస్తున్నారట. దుట్టా రామచంద్రరావు అల్లుడు వైయస్ జగన్ భార్యకు సమీప బంధువు అని తెలుస్తోంది.ఆ క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే వల్లభనేని వంశీకి మాత్రం టికెట్ రాకూడదనే విధంగా కూడా వీరు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం

మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఇప్పటికే చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎందుకంటే.. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ ఓ వేళ.. ఎవరినీ కాదని.. వల్లభనేని వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. అతడి ఓడించాలనే ఓ విధమైన దృఢ సంకల్పంతో సైకిల్ పార్టీ అధినేత ఉన్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

వల్లభనేని వంశీ.. పార్టీ మారి తప్ప చేశారని.. ఓ వేళ పార్టీ మారినా ఆయన చంద్రబాబు ఫ్యామిలీ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందనే ఓ అభిప్రాయం అయితే గన్నవరం నియోజకవర్గంలో  బలంగా వినిపిస్తోంది.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.