Publish Date:Aug 11, 2023
రాజకీయాలు ఎప్పుడూ నల్లేరుపై నడక కాదు.. క్షణం..క్షణం రంగు మార్చుకుంటుంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. గత 2014, 2019 ఎన్నికల్లో ఆయన పరిస్థితి నల్లేరుపై నడకగా మారిపోయింది. దీనికి కారణం.. బలమైన టీడీపీ కేడర్ అంతా కూడా ఆయన వెంటే ఉంది. ప్రజలు కూడా ఆయనను నమ్మారు.
స్థానికంగా కూడా టీడీపీని వంశీ డెవలప్ చేశారు. కేడర్ను పెంచుకున్నారు. యువతలో భరోసా నింపారు. దీంతో గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆయన అసలు ఎన్నికలను పెద్ద సీరియస్ గా కూడా తీసుకోలేదు. పరిటాల రవి దగ్గర తీసుకున్న ట్రయినింగ్ వంశీకి ఇప్పటిదాకా బాగానే ఉపయోగపడింది. మునుపు ఆయనకు పార్టీలోనూ ఎంతో ఇమేజ్ ఉండేది. తిరుగులేని నాయకుడిగా ఆయన ఒక ఊపు ఊపారు. అయితే.. ఆయన కోరి కోరి 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక వైసీపీ పంచన చేరిపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు ఇది ఆనందాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా మాత్రం వంశీకి ఇది పూర్తి మైనస్ అయిపోయిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. తటస్థులు కూడా వంశీని నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని.. అనేక ఆన్లైన్ చానెళ్లు చేస్తున్న సర్వేల్లో తేలి పోయింది. వంశీ అంటే ఎంతో గౌరవం ఉందని అంటున్న వారు కూడా.. ఎన్నికల విషయానికి వచ్చే సరికి మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేం.. అని అనేస్తున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి వంశీకి ఎప్పుడూ ఎదురు కాలేదు. ఆయనే మా ఎమ్మెల్యే అని బల్లగుద్ది మరీ చెప్పిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా.. ఆయన ఉన్న వైసీపీలోనూ.. ఆయనకు ఎదురు గాలి వీస్తోంది. గతంలో ఆయన టీడీపీలో ఉంటే.. నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కానీ.. ఇప్పుడు వైసీపీలో ఆయనకు అంతా వ్యతిరేకంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం.. అధిష్టానంకు మాత్రమే ఎటూపాలుపోని పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం.. డెబ్బై శాతం వ్యతిరేకత కనిపిస్తోంది. అటు యార్లగడ్డ వెంకట్రావ్ .ఇటు దుట్టా.. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన చెమట చిందించాల్సిందే అనే రాజకీయ పండితులు భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabaneni-vamshi-clean-bold-39-159820.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.