వైభవ్ ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన.. బుడ్డోడికి అరంగేట్రం దక్కేనా?

Publish Date:Jun 26, 2026

Advertisement

ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు, భారత క్రికెట్ వర్గాల్లో ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా జట్టులో చోటు సంపాదించుకున్న అద్భుత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో తుది జట్టు (ప్లేయింగ్-11) లో ఉంటాడా లేదా? అనేదే ఆ సస్పెన్స్. భారత పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించేందుకు వైభవ్ ముంగిట నిలిచాడు. ఈ తరుణంలో అతని డెబ్యూపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నోరు విప్పారు. అతని వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ 15 ఏళ్ల కుర్రాడి అసాధారణ ప్రతిభపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవని సితాంశు కోటక్ స్పష్టం చేశారు. ఐపీఎల్‌తో పాటు దేశీయ టోర్నమెంట్లలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేసిన తీరు అతని అద్భుతమైన సహజ సామర్థ్యాన్ని చూపిస్తుందని కొనియాడారు. ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ లాంటి ఆటగాళ్లను కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎంతో పరిణతితో ఎదుర్కొన్న ఈ బుడ్డోడు నిజంగానే ప్రత్యేకమైన టాలెంట్ అని కోచ్ అభినందించారు. అయితే, కేవలం ఒక రికార్డు కోసమో లేదా అరంగేట్రం చేయించాలనే ఉద్దేశంతోనో జట్టు ప్రయోజనాలను పక్కన పెట్టలేమని ఆయన కుండబద్దలు కొట్టారు.

సితాంశు కోటక్ మాట్లాడుతూ, ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ, ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం జట్టులో నిలకడగా రాణిస్తున్న పాత ఆటగాళ్లను పక్కనబెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఎప్పుడూ ఒక బలమైన ప్లేయింగ్-11తోనే బరిలోకి దిగాలని భావిస్తుందని, ప్రదర్శన ఆధారంగా ఇప్పటికే చోటు సంపాదించుకున్న ఆటగాడికి అన్యాయం చేయలేమని అన్నారు. కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి, పాత ఆటగాళ్లకు న్యాయం చేయడానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుందని, జట్టు తుది నిర్ణయాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమే ఖరారు చేస్తారని కోటక్ వెల్లడించారు.

ఒకవేళ బెల్‌ఫాస్ట్ టీ20లో వైభవ్‌కు అవకాశం వస్తే చాలా సంతోషమని, ఒకవేళ రాకపోయినా ఇబ్బందేమీ లేదని కోచ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అతను ఇప్పటికే భారత జట్టులో ఒక భాగమయ్యాడని, భవిష్యత్తులో అతనికి మరిన్ని అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని భరోసా ఇచ్చారు.

జట్టులో 15 ఏళ్ల చిన్నవాడైనప్పటికీ, వైభవ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి ప్రత్యేక మర్యాదలు లేదా సినీయారిటీ మినహాయింపులు ఉండవని కోచ్ వివరించారు. అందరు ఆటగాళ్లలాగే అతనూ సమానమేనని, అయితే అతను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తన ఆటను ఆస్వాదించాలనేదే మేనేజ్‌మెంట్ కోరికని చెప్పారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వైభవ్‌కు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారని, జట్టులో తనను తాను వేరుగా చూసుకోవద్దని, ఇదంతా నీ సొంత జట్టు లాంటిదేనని భావించి, ఎలాంటి భయం లేకుండా సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించాలని ధైర్యం చెప్పినట్లు కోటక్ వెల్లడించారు. ఈ మ్యాచ్ లో వైభవ్ చోటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
 

By
en-us Political News

  
శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని  డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ  ఎన్నికల  బహిష్కరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే  ఆ పిలుపును జనం ఖాతరు చేయలేదు. పీవోకే రాజధాని  ముజఫరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా  మౌజమ్‌పూర్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘోర సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో  గత కొన్ని రోజులుగా   ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  రహీస్ అనే వ్యక్తికి చెందిన రెండంతస్తుల ఇల్లు  కుప్పకూలింది.
విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు సాధించడమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పటికీ రాజకీయ పార్టీగా మారబోదని స్పష్టం చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రెషర్ గ్రూప్ గా అంటే ఒత్తిడి బృందం గా మాత్రమే విద్యా వ్యవస్థ సంక్షేమం కోసం పని చేస్తుందని విస్ఫష్టంగా ప్రకటించింది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ తీవ్ర జాప్యం కావడంపై పార్లమెంట్ వేదికగా తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ వార్తల్లో నిలిచారు. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబా సిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
భారత విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక మార్పుకు బీజం పడింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌
మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి చేపట్టిన నిరసన
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి ఉక్కుపాదం మోపుతున్నారు
మహిళలకు బంగారం.. పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.