నోరు జారిన నేరానికి...!

Publish Date:Mar 17, 2025

Advertisement

కాలు జారితే, వెనక్కి తీసుకోవచ్చును, కానీ, నోరు జారితే వెనక్కి తీసుకోలేము. ఒక్కొక్క సారి, నోరు జారిన నేరానికి, భారీ మూల్యమే చెల్లించుకోవలసివస్తుంది, ఉత్తరాఖండ్’ ఆర్ధిక, శాసనసభ వ్యవహారాల మంత్రి, ప్రేమ్ చంద్ అగ్రవాల్ విషయంలో అదే జరగింది. అవును. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో,ఆయన,రాష్ట్రమంటే కేవలం’ పహాడీలు’ (గిరిజనులు) మాత్రమే కాదు,అంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆతర్వాత ఆయన, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  లాగా చాలా చాలా వివరణ ఇచ్చుకున్నారు. అయినా కొంచెం ఆలస్యంగానే అయినా, రాజీనామా చేయక తప్పలేదు. ఆదివారం (మార్చి 16) ఆయన మంత్రి పదవికి రాజీనామా  చేశారు. 

ఇలా తెలిసీ, తెలియకో, కొండకచో  నోటి తీటతో నోరు జారి, చిక్కుల్లో చిక్కుకున్న పెద్దలు, చిన్నలు చాలామందే ఉన్నారు. ఆ మధ్యన శ్యాం పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్దాయన, లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరు మీదున్న సమయంలో, చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. శ్యాం పిట్రోడా ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ..  దేశం తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా, ఉత్తరాది వారు శ్వేత జాతీయులుగా, చివరగా దక్షిణాది ప్రజలు అఫ్రికన్స్’లా ఉంటారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటికే వారసత్వ సంపద గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అందుకు ఆయన మూల్యం చెల్లించారు. ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ  ఆయన్ని మళ్ళీ అదే పదవిలో కుర్చోపెట్టిందనుకోండి అది వేరే విషయం. 

అలాగే, 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాయిన్’ చేసిన చోకీదార్ చోర్  నినాదం ఆయన్ను రాజకీయంగానే కాదు, చట్టపరంగానూ చిక్కుల్లోకి నెట్టింది. రాహుల్ గాంధీ ప్రధాని మోదీని దేశం ముందు దొంగగా చూపించేందుకు తమ ఆరోపణను, అభిప్రయాన్ని కోర్టుకు అపాందించారు. కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం సాగించారు. న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు.  ఒకసారి కాదు రెండు సార్లు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా నోరు జారిన నేరానికి, ఆయన చెల్లించిన మూల్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి రెండు అంకెలకు పరిమితం అయింది. పార్టీ ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇలా ఒకరిద్దరు కాదు, నోటి తీటా రాజకీయ నేతల చిట్టా చాలా వుంది. ఎక్కడి దాకానో ఎందుకు, మొన్నటి 2024 ఎన్నికలకు ముందు  బీజేపీ అధ్యక్షుడు, జేపీ నడ్డా  బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్,(ఆర్ఎస్ఎస్) అవసరం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపాయో, చెప్ప నక్కర లేదు. సరే  ఆ తర్వాత బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకుని,ఇటీవల జరిగిన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సహా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. అలాగే, హర్యానా, గుజరాత్ సహా ఐదారు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్  స్వీప్ చేసింది.  

అలాగే కేంద్ర హోం మంత్రి అమిత షా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్’ గురించి రాజస్య సభలోచేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో చెప్పనవసరం లేదు. రాజ్యాంగ వజ్రోత్సవాలను పురస్కరించుకుని  రాజ్య సభలో చేపట్టిన ప్రత్యేక చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి, అంబేద్కర్, అంబేద్కర అనడం వాళ్ళకు ఒక ఫాషన్ అయి పోయింది. అంబేద్కర్ పేరు ఉచ్చరించినన్ని  సార్లు భగవత్ నామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల పాటు స్వర్గమైనా దక్కేది  అంటూ చేసిన వ్యాఖ్యలు, పార్లమెంట్ లోపలా వెలుపలా ప్రకంపనలు సృష్టించాయి. ఎంతో దుమారాన్ని రేపాయి. విపక్షాలు హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఆయన్ని బర్తరఫ్ చేయాలని పట్టు పట్టాయి.  పార్లమెంట్ ప్రాంగణంలో ఇంతవరకు ఎప్పుడూ చూడని నిరంతర నిరసన ప్రదర్శనలు, తోపులాటలు, తొక్కిసలాటలు, గౌరవ  ఎంపీలు గాయాలతో ఆసుపత్రుల పాలుగావడం వంటి    తతంగం చాలా చాలా జరిగింది. ఇంచుమించుగా వారం రోజులకు పైగానే, పార్లమెంట్ సమావేశాలు, ఆ దుమారంలో కొట్టుకు పోయాయి. అమిత షా రాజీనామా చేయలేదు, ప్రధానమంత్రి ఆయనని  బర్త్ రఫ్  చేయలేదు కానీ  రాజ్యాంగ వజ్రోత్సవాలను ఘనంగా  నిర్వహించి క్రెడిట్ కొట్టాయాలని చూసిన బీజేపీ లక్ష్యం మాత్రం నెరవేర లేదు. పార్టీ ఇమేజ్  పక్కకు వాలింది. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ  బోనులో నిలబడింది.  ఇక మన దగ్గరకు వస్తే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతల దురుసు తనానికి హద్దులే లేవు. అది రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో  ముఖ్యమంత్రి సహా మంత్రులు, భాష విషయంలో ఎంతగా దిగ జారారో,ఎంతగా నోటిని పారేసుకున్నారో,  ఎన్నెన్ని బూతు నిఘంటువులు సృష్టించారో వేరే చెప్ప నక్కరలేదు. అలాగే అందుకు  వైసీపీ చెల్లించిన మూల్యం గురించి కూడా చెప్ప నవసరం లేదు.  

ఇక ఇప్పడుతాజాగ , ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేతలు నోరు జారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్’ గురించి చేసిన, స్టేచర్  - స్ట్రెచర్ - మార్చురీ  వ్యాఖ్యలు.. దానికి అనుబంధంగా ఇచ్చిన వివరణ, కొనసాగింపుగా  సోషల్ మీడియా విశృంఘలత్వం పై విరుచుకు పడుతూ,  బట్టలు ఊడదీసి... అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు, నోరు జారిన  రోత మాటలు,మళ్ళీ మళ్ళీ తెర మీదకు వస్తున్నాయి. 

దీంతో ఇప్పటికే ఓ వంక అంతర్గత రాజకీయ సంక్షోభం, మరో వంక ఆర్థిక సంక్షోభంతో పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ రోజు కాక పోయినా రేపు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ప్లస్ అండ్ మైనస్  లెక్కల బాలన్స్ షీట్ స్క్రూటినీకి వచ్చినప్పడు, ఆయన  ఖాయంగా మూల్యం చెల్లించవలసి రావచ్చును.   

అలాగే ఆంధ్ర అప్రదేశ్  లోనూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జన సేన అధినేత పవన్ కళ్యాణ్’, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగ బాబు పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో  చేసిన వివాదస్పద వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు పెట్టాయి. అనుభవ రాహిత్యంతో పాటు అజ్ఞానం తోడైన అహంకారంతో  అన్నదమ్ములు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కుంపట్లు రాజేసాయి. ఇంతవరకు సజావుగా సాగుతున్న కుటుంబంలో చిచ్చు పెట్టాయి. సినిమాల్లో  డూప్  లు చేసిన ఫైట్లు చూసి  హీరోలే ఫైట్  చేశారని  అభిమానులు ఈలలు వేస్తారు. చప్పట్లు కొడతారు. హీరోలకు తాము జీరోలమని తెలుసు. అయినా  విజయోత్సవ వేడుకల్లో వేదికలు ఎక్కి  చేతులు ఊపుతారు. సక్సెస్  సొంతం చేసుకుంటారు.  అలా  తమను తాము మోసం చేసుకుంటూ, అభిమానులను మోసం చేస్తారు. రాజకీయాల్లోనూ అదే  హీరోయిజం’ చుపిస్తామంటే కుదరదు. 

కానీ  కొణిదెల సోదరులు  పిఠాపురంలో  కూటమి గెలుపును తమ ఖాతాలో వేసుకుని  హీరో ఫోజులు ఇచ్చే విఫల ప్రయత్నం చేశారు. బండి కింద నడిచి వెళ్లే కుక్క పిల్ల బండి భారం మొత్తం తానే మోస్తున్నానని ఫీల్  అవుతుందంటే అర్థం చేసుకోవచ్చును, కానీ  వారనే కాదు,  రాజకీయ నాయకులు ఎవరైనా అదే ఫీలింగ్  లో ఉంటే, ఆ వైభోగం అట్టే కాలం నిలవదు. సంకీర్ణ  రాజకీయాల్లో చేయి చేయి కలిస్తేనే చప్పట్లు... లేదంటే చిత్కారాలు చీవాట్లు తప్పవు. అందుకే, నోటి తీట పొట్టకు చేటని  అంటారు.

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.