సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్

Publish Date:Aug 5, 2015

Advertisement

 

బుదవారం ఉదయం జమ్మూలో ఉదంపూర్ జిల్లాలో భారత సరిహద్దు భద్రతా దళాల మీద దాడి చేసిన ఒక ఉగ్రవాది భద్రతా దళాల కాల్పులలో అక్కడికక్కడే మరణించాడు. ఉస్మాన్ ఖాన్ అనే మరో ఉగ్రవాది తప్పించుకొని పారిపోవాలని చూసినప్పటికీ భద్రతా దళాలకు సజీవంగా చిక్కాడు. అతనిని పట్టుకొన్నప్పుడు అక్కడే ఉన్న మీడియా అడిగిన ప్రశ్నలకు అతను చెప్పిన జవాబులు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి.

 

“నేను పాకిస్తాన్ నుండి హిందువులను చంపేందుకే దట్టమయిన అడవుల గుండా ప్రయాణించి ఇక్కడికి వచ్చాము. 12రోజుల క్రితమే నేను ఇక్కడికి చేరుకొన్నాను. నేను తెచ్చుకొన్న ఆహారం మూడు రోజుల క్రితమే అయిపోయింది. నిన్నటి నుండి ఆహారం లేకుండా తిరుగుతున్నాను. మేమిద్దరం చేసిన దాడిలో నా పార్టనర్ భారత జవాన్ల చేతిలో మరణించాడు. ఒకవేళ నేను కూడా మరణించి ఉండి ఉంటే అది అల్లా నిర్ణయంగా భావించేవాడిని. కానీ ఇదంతా చాలా వినోదంగా ఉంది.” అని చెప్పాడు. మీడియా అతనిని ప్రశ్నించినప్పుడు తను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తినని చెప్పుకొన్నాడు మొదట అతను తన వయసు 20 సం.లని చెప్పాడు. కానీ మరికొద్దిసేపటి తరువాత అతను తన వయసు 16సం.లని మాట మార్చాడు.

 

భారత్ లో ప్రవేశించే పాక్ ఉగ్రవాదులు ఒకవేళ భద్రతా దళాలకు పట్టుబడినట్లయితే తమ వయసు 16సం.లని చెప్పవలసిందిగా లష్కర్ సంస్థ ప్రత్యేకంగా చెప్పి పంపిస్తుందని అజ్మల్ కసాబ్ విషయంలో ఇదివరకే రుజువయింది. ఆవిధంగా చెపిత భారత చట్టాల ప్రకారం అతనిని బాల నేరస్తుడిగా పరిగణించి చిన్నపాటి శిక్షతో విడిచిపెట్టే అవకాశం ఉంటుందని ఉగ్రవాదుల విశ్వాసం. ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ కూడా తన వయసును తక్కువ చేసి చెప్పడం వలన, అతని వయసును నిర్ధారించుకొనేందుకు భారత ప్రభుత్వం చాలా శ్రమ పడవలసి వచ్చింది. ఆ కారణంగానే అతను ఉరి శిక్ష పడకుండా చాలా ఏళ్ళు తప్పించుకోగలిగాడు. అందుకే ఇప్పుడు పట్టుబడ్డ ఉస్మాన్ ఖాన్ కూడా తన వయసు కేవలం 16సం.లే అని తక్కువ చేసి చెప్పుకొన్నాడు.

 

అతనిని సజీవంగా పట్టుకోవడం వలన అతని ద్వారా ఉగ్రవాదుల కుట్రల గురించి చాలా కీలకమయిన రహస్యాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కానీ అతనిని దోషి అని నిరూపించి ఉరి కంభం ఎక్కించేందుకు చాలా ఏళ్ళ సమయం పడుతుంది. అంతే కాదు ఆ ప్రక్రియలో భారత ప్రభుత్వానికి అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. అజ్మల్ కసాబ్ ని పట్టుకొన్నప్పతి నుండి అతనిని ఉరి తీసే వరకు అతని రక్షణ, ఆరోగ్యం, కోర్టు కేసు నడిపించడానికి, అతనికి వ్యతిరేకంగా శాఖ్యాలను సేకరించడానికి, అతని వయసు, ప్రాంతం వగైరా నిర్ధారణకి భారతప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు పైనే ఖర్చు చేయవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. కనుక ఇప్పుడు ఈ ఉస్మాన్ ఖాన్ కోసం మరో రూ.100 కోట్లు సిద్దంగా ఉంచుకోవాలేమో?

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.