Publish Date:May 24, 2021
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొవిడ్ మరణాలు రోజు 4 వేలకు పైగానే నమోదవుతున్నాయి. కొత్త బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ మాయదారి వైరస్, ఫంగస్ ల నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో దేశంలోనూ వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపట్టేందుకు కేంద్రం కార్యాచరణ ప్రకటించింది. కాని వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. సరిపడా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు కొవిడ్ వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. కొవాగ్జిన్ నెలకు కోటీ డోసులు తయారవుతుండగా.. కోవిషీల్డ్ టీకాలు నెలకు ఐదు కోట్ల వరకు ఉత్పత్తి అవుతున్నాయి. మన డిమాండ్ కు ఇవి ఎంత మాత్రం సరిపోవడం లేదు.
ఇటీవల కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు నేరుగా టీకాలు కొనుగోలు చేయవచ్చు. దేశంలో టీకాల కొరత ఉండటంతో పలు రాష్ట్రాలు విదేశీ సంస్థల టీకా కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఐదారు రాష్ట్రాలు కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించాయి. గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 4కోట్ల వ్యాక్సినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెండర్ల ద్వారా 10మిలియన్ డోసులు సేకరించాలని భావించింది. బిడ్ల గడువు జూన్ 4వరకు గడువు విధించింది. కేవలం ఆరు నెలల్లో 10మిలియన్ డోసులు పంపిణీ చేయాలని కండీషన్ కూడా విధించింది. పంజాబ్ ,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.
వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు పిలుస్తున్న రాష్ట్రాలకు షాకిచ్చాయి అమెరికాలోని ఫైజర్, మోడెర్నా ఫార్మా కంపెనీలు. రాష్ట్రాలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా చేయబోమని స్పష్టం చేశాయి. కంపెనీల పాలసీ ప్రకారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేస్తామని క్లారిటీ ఇచ్చాయి. దీంతో గ్లోబల్ టెండర్లకు పిలిచిన పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఫైజర్, మోడెర్నా కంపెనీల నిర్ణయంతో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది బీహార్ ప్రభుత్వం.
ఫైజర్, మోడెర్నా ప్రకటనతో వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలని భావించిన రాష్ట్రాల ఆశలపై నీళ్లుచల్లినట్టయింది. వ్యాక్సిన్ కోసం రాష్ట్రాలు కేంద్రం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
కేంద్రం నేరుగా అమెరికా సంస్థలతో మాట్లాడి వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు చేసుకుంటేనే టీకాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది కీలకంగా మారింది. లేదంటే దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/us-covid-vacciene-will-come-to-states-25-116115.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు