సందేహం లేదు తెలుగుదేశం భావి నేత లోకేషే!

Publish Date:Jan 24, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అవసరం లేని చర్చ జోరుగా సాగుతోంది. ఎలాంటి హేతువూ లేకుండానే తెలుగుదేశం, జనసేన శ్రేణులు నేతల మధ్య పోటాపోటీ ప్రకటనలు వెలువడుతున్నాయి. రెండు పార్టీలూ పొత్తులో ఉన్నాయి సందేహం లేదు. పొత్తులో ఉండటమంటే రెండూ ఒకే పార్టీ అని కాదు. ఎవరి పార్టీ వారిదే. కానీ రెండు పార్టీలూ సమన్వయంతో పని చేసుకుంటాయి. ఒక పార్టీ నిర్ణయంతో రెండో పార్టీకి సంబంధం ఉండదు. కానీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో  జనసేనలో అభద్రత, తెలుగుదేశంలో జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి నచ్చిన డిమాండ్ చేయవచ్చు. అది తెలుగుదేశం సొంత వ్యవహారం. ఇక ప్రభుత్వంలో మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడం అన్న విషయానికి వస్తే డిమాండ్లు, ఖండనల గురించి పట్టించుకోవలసిన అవసరమే లేదు. ఆ విషయంపై ఇరు పార్టీల అధినేతలూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అన్నిటికీ మించి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రమోషన్ అన్న విషయంలో ఇరు పార్టీల అధినేతల స్పందన సెన్సిబుల్ గా ఉ:ది. తమతమ పార్టీల నేతలు, శ్రేణులకు ఆ విషయంపై నోరెత్తవద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ నాయకుడు అన్న చర్చ ఆరంభమైంది. ఇది కూడా అనవసరమే. ఎవరైనా సరే ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం తెలుగుదేశం నేతలు, శ్రేణులకే కాదు, మొత్తం అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంలో చంద్రబాబు తరువాత ఆ స్థాయి ఉన్న నేత లోకేష్ వినా మరొకరు కనిపించరు. సహజంగానే మీడియా అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం నేతలంతా పార్టీ భవిష్యత్ నేత నారా లోకేష్ అనే చెబుతారు.

మంత్రి అచ్చెన్నాయుడు కూడా  అదే సమాధానం చెప్పారు. ఆయన ఇంకొంచం గట్టిగా, ఘాటుగా అసలీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చంటి పిల్లాడిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు అంటూ భవిష్యత్ లో తెలుగుదేశం సారథి నారా లోకేషే అని స్పష్టంగా చెప్పేశారు.  అయితే నారా లోకేష్ కు పార్టీలో, ప్రజలలో ఈ గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి ఆయన నారా చంద్రబాబు కుమారుడు కావడం ఎంత మాత్రం కాదు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలోకి అడుగు పెట్టినా, స్వయంకృషితో ఆయన అంచలంచలుగా ఎదిగారు. లోకేష్ తనను తాను ప్రజా నాయకుడిగా మలచుకున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. 

వాస్తవానికి ఆయన రాజకీయాలలో తొలి అడుగు వేయకముందే.. ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఆహారం, ఆహార్యం, భాష నుంచి ప్రతి విషయంలోనూ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అటువంటి విమర్శలను ఎదుర్కొని తన సత్తాను చాటారు నారా లోకేష్. స్పష్టంగా చెప్పాలంటే వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం నారా లోకేష్ .  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, పడిన శ్రమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకుని.. పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకుడు నారోలోకేష్. యువగళం పాదయాత్ర తరువాత  నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ  ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి.

అందుకే  తెలుగుదేశం భవిష్యత్ నేతగా  పార్టీలో భిన్నాభిప్రాయం అన్నదే లేదు.  తెలుగుదేశం పార్టీ భవిష్యత్ సీఎం అభ్యర్థి నారా లోకేషే అని పార్టీ సీనియర్ నేతలే ప్రకటిస్తున్నారంటే ఆయన నాయ కత్వానికి ఎంతగా మద్దతు ఉందో ఇట్టే అవగతమైపోతుంది.  నారా లోకేష్ లో మాస్ లీడర్ తో పాటు, మేధావులు, విద్యావంతులను ఆకట్టుకోగలిగే విషయ పరిజ్ణానం కూడా మెండుగా ఉంది. అందేకే తెలుగుదేశం భవిష్యత్ నేత నారా లోకేష్ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా అశేష ప్రజానీకమే ఆయనను అంగీకరిస్తున్నారు. దటీజ్ లోకేష్.   

By
en-us Political News

  
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.